2015

నేడు శాసనసభలో ఐదు బిల్లులు..

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రభుత్వం ఇవాళ 5బిల్లులు ప్రవేశపెట్టింది. మౌలిక సదుపాయల అభివృద్ధి సవరణ బిల్లు, విద్యుత్‌ సుంకం బిల్లు, నౌకాశ్రయాల అభివృద్ధిపై మ్యారీటైమ్‌ బోర్డు బిల్లు, విలువ ఆధారిత పన్ను, విదేశీ మద్యం సవరణ బిల్లులను ప్రభుత్వం స్పీకర్‌ అనుమతితో సభలో ప్రవేశ పెట్టింది. వైకాపా సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు ఆయా బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

ప్రజలకు ప్రయోజనమేదీ? :ఏచూరి

ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతున్నా మనదేశంలో ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలకు ఆ ప్రయోజనాలు అందటంలేదని సిపిఎం విమర్శించింది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు నానాటికీ తగ్గుతున్నాయని, ప్రస్తుత గతంలో కంటె మూడు రెట్లు ధరలు పడిపోయాయని చెప్పారు. అయితే నరేంద్రమోడీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుండి ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలను తొమ్మిదిసార్లు పెంచివేసిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిమితి దాటిన ఉత్పత్తి, అమెరికన్‌ డాలర్‌ ప్రభావంతో క్రూడాయిల్‌ ధరలు పడిపోతున్నాయని ఆయన గుర్తుచేశారు.

కాల్‌మనీపై అసెంబ్లీలో రగడ..

శీతాకాల సమావేశాల శుక్రవారం రెండోరోజున కూడా కాల్‌మనీ వ్యవహారంపై అధికారప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ నడిచింది.మధ్యాహ్నం సభలో సిఎం కాల్‌ మనీపై ప్రకటన చేశారు. సిఎం ప్రకటన చేస్తుండగా ప్రతిపక్షసభ్యులు ఆయన స్థానం వద్దకు వెళ్ళి అడ్డు తగలడంతో సభలో గందరగోళం చెలరేగింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో సభ మార్మోగింది. వైఎస్‌ ఆర్‌ సి పి సభ్యురాలు రోజా సిఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సభనుంచి ఆమెను ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వమే ఓ భూకబ్జాదారు:కారత్

రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో టిడిపి ప్రభుత్వమే భూకబ్జాదారుగా మారిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు. భూసేకరణ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం శకునాల, బ్రాహ్మణపల్లె, గడివేముల మండలం గని గ్రామాల్లో సోలార్‌ హబ్‌ కింద భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడేందుకు శుక్రవారం ఆయన జిల్లా పర్యటనకు వచ్చారు.2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగాలకు సంబంధించిన భూసేకరణలో ఎక్కడ భూసేకరణ జరిగినా 80 శాతం మంది నిర్వాసితులు గ్రామసభలో ఒప్పుకోవాలనే నిబంధన ఉందన్నారు.

అంగన్వాడీలకు అండగా...

పోరాటానికి మరో పేరు అంగన్ వాడీలని వామపక్ష నేతలు పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీలు శుక్రవారం చలో బెజవాడకు భారీ ర్యాలీని చేపట్టారు. తుమ్మళ్లపల్లి కళాక్షేత్రం నుండి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మహాత్మగాంధీ రోడ్డు వరకు చేరుకోగానే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. నేతలను ఇష్టమొచ్చినట్లు లాక్కొంటూ వ్యాన్ లలో పడేశారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, న్యాయంగా జారీ చేయాల్సిన జీవోను జారీ చేయాలని కోరుతున్నారన్నారు.

CPM ప్లీనంకు 10లక్షల మంది..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీపీఐ (ఎం)జరుప తలపెట్టిన ప్లీనం ఏర్పాట్లు విస్తృతంగా జరుగు తున్నాయి. ప్లీనం ఏర్పాట్లతో కోల్‌కత్తా నగరం ఎర్రబారింది. 37ఏళ్ల తర్వాత జరుగుతున్న సీపీఐ(ఎం) ప్లీనంలో 456 మంది ప్రతినిధులు హాజరవుతారని రబీన్‌ దేవ్‌ తెలిపారు. డిసెంబర్‌ 20న పీడీజీ భవన్‌లో ప్లీనం ప్రారంభమవుతుందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 77, 247 బూత్‌లలో ఉన్న ప్రజలందరినీ కదిలించే విధంగా కోల్‌కత్తా నగరం ఐదు వైపుల నుంచి ఐదు ర్యాలీలుగా దాదాపు పది లక్షల మంది ప్రజలు రానున్నారని ఆయన తెలిపారు. 

కాల్‌మనీ కీచకులను శిక్షించాలి..

 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపి కాల్‌ మనీ కీచకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమో క్రసీ, లిబ రేషన్‌, ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తా, బహు జన సమాజ్‌ పార్టీల ఆధ్వర్యంలో బుధ వారం వంద లాది మంది భారీ ప్రదర్శన నిర్వహిం చారు. అనంతరం సిపి గౌతమ్‌ సవాంగ్‌ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌. బాబూరావు మాట్లా డుతూ, కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌ ఘటనపై ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా స్పందించా లన్నారు.

VRAల నిరాహారదీక్షకు మద్దతు..

గత 45రోజులుగా రిలే నిరహారదీక్షలు చేస్తున్న విఆర్ఎలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మద్దతు తెలిపారు. 45రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, తక్షణం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా ఉన్న వాళ్లనందరిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు తాను అధికారంలోనికి వస్తే అందరిని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పారని కాని ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. వి ఆర్ ఎ లు చేసే న్యాయమైన పోరాటానికి సిపిఎం మద్దతు ఎప్పుడూ ఉంటుందని మధు తెలిపారు.. 

కాల్‌మనీపై విచారణచేయాలి:CPM

విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ ఘటనపై హైకోర్టు న్యాయ మూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు.చట్టవిరుద్ధంగా కాల్‌మనీ వ్యాపారం చేస్తూ మహిళలను వ్యభిచారకూపంలోకి దించిన వారి ఆస్తులను తక్షణమే జప్తుచేయాలని కోరారు. ఆయా ఆస్తులను బాధిత మహిళలకు తిరిగి ఇవ్వాలన్నారు. కాల్‌మనీ వ్యాపారమే కాకుండా దాని ద్వారా మహిళలను వేధించడం, లోబరచుకోవడం, అఘాయిత్యాలకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చట్టం చేసి దానిని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.

రాజధాని ప్రాంతంలో పర్యటన..

రాజధాని ప్రాంతంలో అభద్రతా భావం పెరుగుతోందని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, గుంటూరు కార్యదర్శివర్గ సభ్యులు జొన్న శివశంకరరావు, రాధాకృష్ణ, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవితో కలిసి శ్రీనివాసరావు సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు.సింగపూర్‌ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతోందని శ్రీనివాసరావు విమర్శించారు. తప్పులకు అధికారులను బలిపశువులు చేస్తూ మంచిని మాత్రం మంత్రులు తమకు ఆపాదించుకుంటున్నారని తెలిపారు. సమీకరణకు భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లించడంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు.

Pages

Subscribe to RSS - 2015