2015

ఖజానా నింపుకోడానికే ప్రభుత్వం:మధు

విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం సేవించి ఆరుగురు మృతి చెందటానికి ప్రభుత్వ మద్యం విధాన మే కారణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఖజానా నింపుకో వటమే లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింద న్నారు. మృతుల కుటుం బాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరి హారం చెల్లించాలని ఆయన ప్రకటనలో డిమాండ్‌ చేశారు. బాధితు లకు ఉన్నత వైద్య సౌకర్యం అందించాలని కోరారు.

విశాఖలో లోకేష్ కు చేదుఅనుభవం

హుదూద్‌ పరిహారం ఇంతవరకూ అందలేదంటూ విశాఖ జిల్లా చీడికాడలోని ఎస్‌సి కాలనీ మహిళలు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను నిలదీశారు. మాడుగుల నియోజకవర్గం, చీడికాడ మండలంలో సోమవారం జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు తమ ఇబ్బదులను లోకేష్‌కు వివరించారు. ఎస్‌సి కార్పొరేషన్‌ రుణాలు మంజూరు చేయలేదని, గ్రామ సమీపంలో బంజరు భూముల పట్టాలను తమకు ఇవ్వలేదని, రేషన్‌కార్డులు, పింఛన్లు, మరుగుదొడ్లు వంటి సమస్యలపై పట్టించుకునే నాథుడే లేడని నిరసన వ్యక్తం చేశారు.

CPIబర్థన్‌కుబ్రెయిన్‌స్ట్రోక్‌..

సిపిఐ కురువృద్ధుడు ఎ.బి.బర్థన్‌ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్య నిపుణులు చెప్పారు. సోమవారం తెల్లవారుజామున మెదడులో రక్తనాళాలు చిట్లి గడ్డకట్టుకు పోవడంతో ఇక్కడి జిబి పంత్‌ ఆసుపత్రికి వెంటనే తరలించారు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. మరో 48 గంటలు గడిస్తే గానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్‌ మీద వుంచారు. మెదడు కుడివైపు భాగంలో సుమారు యాభై శాతం వరకు రక్తం గడ్డకట్టింది. ఎడమ వైపు శరీరం పూర్తిగా చచ్చుబడిపోయి పక్షవాతం వచ్చింది. ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడం ఇది మూడోసారి. 

మద్యం పాలసీని పున:సమీక్షించాలి..

 విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణబార్‌లో కల్తీ మద్యం తాగి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు..కల్తీ మద్యం మృతులు, బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 40 మంది సిపిఎం నాయకులను పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించేందుకు సిఎం చంద్రబాబు వెళ్లినపుడు సిపిఎం రాజధాని ప్రాంత కమిటీ కార్యదర్శి సిహెచ్‌.బాబూరావు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతకుముందు ప్రభుత్వాసుపత్రి వద్ద కూడా సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు.

దేశంలో భయానక వాతావరణం నెలకొంది

రాజ్యాధికారం కోసం సంఫ్‌ుపరివార్‌ శక్తులు ఒక పథకం ప్రకారం మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయని జమ్మూ కాశ్మీర్‌ ఎమ్మెల్యే యూసఫ్‌ తరిగామి అన్నారు. డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు ఘటనతో పథకం ప్రారంభమై, గుజరాత్‌లో అల్లర్లు సృష్టి, దాద్రి ఘటన ఇవన్నీ ఒక వరుస క్రమంలో జరిపినవేనని చెప్పారు. ఆదివారం స్థానిక పాతబస్టాండ్‌ సెంటర్లోని ఉర్దూ బాలుర పాఠశాల ప్రాంగణంలో ఆవాజ్‌ సంఘం నిర్వహించిన లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సదస్సుకు అవాజ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అక్భర్‌ అధ్యక్షత వహించారు. తరిగామి మాట్లాడుతూ దేశంలో భయానక వాతావరణ నెలకొన్నదని చెప్పారు.

AP,TS లలో కేంద్రబృందాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రకాల సమస్యలు నెలకొన్నాయి. తెలంగాణలో కరవు తాండవిస్తుంటే.... ఏపీలోని దక్షిణకోస్తా, రాయసీమ జిల్లాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. రెండు రాష్ట్రాల్లోని నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర అధికారుల బృందాలు పర్యటించనున్నాయి.

సోనియా, రాహుల్ లకు చుక్కెదురు

నేషన్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వారి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టుకు హాజరు కావాలని సోనియా, రాహుల్ లను హైకోర్టు ఆదేశించింది.

Pages

Subscribe to RSS - 2015