కాల్‌మనీ కీచకులను శిక్షించాలి..

 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపి కాల్‌ మనీ కీచకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమో క్రసీ, లిబ రేషన్‌, ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తా, బహు జన సమాజ్‌ పార్టీల ఆధ్వర్యంలో బుధ వారం వంద లాది మంది భారీ ప్రదర్శన నిర్వహిం చారు. అనంతరం సిపి గౌతమ్‌ సవాంగ్‌ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌. బాబూరావు మాట్లా డుతూ, కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌ ఘటనపై ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా స్పందించా లన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తమ పార్టీకి చెందిన నేతలు ఇటువంటి అరాచకాలకు పాల్పడుతుంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంద న్నారు.