సుప్రీం కోర్టు రాజకీయ పార్టీలను ఎక్కడ సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తుందోనన్న భయంతో నాయకులు గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తే కాంగ్రెస్,బిజెపి తదితర జాతీయ పార్టీలతో పాటు టిఆర్ఎస్, తెలుగుదేశం, అన్నా డిఎంకె, డిఎంకె, సమాజ్వాదీ, ఆమ్ఆద్మీ లాంటి మెజారిటీ ప్రాంతీయ పార్టీల ఆర్థిక రావాదేవీలన్నీ బట్టబయలవుతాయి. అందుకే ఆయా పార్టీల నాయకుల గుండెల్లో గుబులుపుట్టింది.