ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రసిద్ధ రచయిత సుకోమల్ సేన్ బృహత్తర రచన 'భారత కార్మిక వర్గం -ఆవిర్భావం, ఉద్యమం, 1830-2010'. క్షుణ్ణంగా సవరించి, విస్తరించిన తృతీయ ప్రతికి తెలుగు అనువాదం ఇది. రచయిత తొలి ప్రతి ముందు మాటలో పేర్కొన్నట్లు ఇది సంప్రదాయ సిద్ధమైన ట్రేడ్ యూనియన్ చరిత్రలకు భిన్నమైనది. విస్తృతమైన జాతీయ, అంతర్జాతీయ నేపథ్యంలో భారత కార్మిక వర్గ పోరాటాలను రాజకీయాలు ఆర్థికాంశాల పరస్పర ప్రభావాలను గమనంలోకి తీసుకొని సాగిన రచన ఇది. భారత దేశంలో కార్మిక వర్గ ఆవిర్భావం, సంపన్న దేశాలలో కార్మిక వర్గ ఆవిర్భావానికి భిన్నమైన రీతిలో వలస పాలకులు పూర్తి ఆధిపత్యం కొనసాగుతున్న సమయంలో జరిగింది.