2015

రాజ్యం-విప్లవం

                లెనిన్‌ రాసిన ప్రసిద్ధ గ్రంథాల్లో ఒకటి 'రాజ్యము-విప్లవము'. దీన్నాయన 1917 ఫిబ్రవరిలో జరిగిన బూర్జువా విప్లవానంతరం అజ్ఞాతంలో వుంటూ, 1917 ఆగస్టు, సెప్టెం బర్‌ నెలల్లో రాశాడు.

వ్యాపంపై 9న విచారణ

మధ్యప్రదేశ్‌లోని వ్యాపం కుంభకోణంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు కోరుతూ కాంగ్రెస్‌ నేత దిగ్విజరు సింగ్‌, ముగ్గురు ఆర్‌టిఐ కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 9న విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు మంగళవారం అంగీకరించింది. ''అన్ని అంశాలు కలిపి ఒకేసారి విచారించాలని నిర్ణయించాం. జులై 9న విచారిస్తా''మని ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.ఎల్‌.దత్తు, జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ అమితవ రారులతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

రాజీలేని తీర్పు..

అత్యాచార కేసుల్లో ఎటువంటి మధ్యవర్తిత్వానికి, రాజీకి తావు ఉండరాదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం హర్షణీయం. ఇవి అపరాధ రుసుముతో చెల్లిపోయేంత స్వల్ప నేరాలు కావనీ, ఏమాత్రం మెతక వైఖరి అవలంబించడానికి ఆస్కారం లేనివనీ కింది కోర్టులకు సుప్రీం స్పష్టం చేయడం అభినందనీయం. మైనర్‌ బాలిక రేప్‌ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సదరు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు చేసిన సంచలన తీర్పు అది.

సెక్షన్‌8కు వ్యతిరేకిని:పవన్‌

సెక్షన్‌-8కి తాను వ్యతిరేకినని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ అందరికీ సొంతిళ్లు వంటిదని, ఉమ్మడి రాజధాని శాంతిభద్రతలను కేంద్రానికి అప్పగించాలనడం సరికాదని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య అంతర్యుద్ధం వచ్చేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తే అప్పుడు సెక్షన్‌ 8 అవసరం వస్తుందని చెప్పారు. సెక్షన్‌ 8ను ప్రవేశపెట్టి కొత్త రాష్ట్రం ఇచ్చిన ఆనందాన్ని హరించొద్దని ఆయన అన్నారు. అవసరమైతే దీనికోసం హైదరాబాద్‌లో ఓ కేంద్ర కార్యాలయాన్ని పెట్టండి. ఓ ఐపీఎస్‌ అధికారికి దాని పర్యవేక్షక బాధ్యతలను అప్పగించండి. నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి జవాబు చెప్పేలా చేయండి..' అని అన్నారు.

మారకపోతే పాతిపెడతారు : మధు

             రాజధాని ప్రాంతంలో రైతులను తప్ప పేదలను, దళితులను, వ్యవసాయ కార్మికులను, మైనార్టీలను, మహిళలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇకనైనా తీరుమార్చుకోకపోతే రానున్న రోజుల్లో రాజధానిలోనే ప్రజలు ప్రభుత్వాన్ని పాతిపెడతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. రాజధానిలో పేదల సమస్యలు పరిష్కరించాలని, ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికీ రూ. 9 వేలు పరిహారమివ్వాలని, అసైన్డ్‌, సీలింగ్‌, చెరువుపోరంబోకు భూముల లబ్ధిదారులకు పరిహారం వెంటనే చెల్లించాలని కోరుతూ వ్యవసాయ కార్మికసంఘం, డ్వాక్రా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తుళ్లూరులో క్రిడా కార్యాలయం ముందు బైఠాయించారు.

కార్పొరేట్ల నుంచి దేశ రక్షణే లక్ష్యం

   దేశాన్ని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల నుంచి రక్షించి ప్రభుత్వరంగాన్ని కాపా డటమే సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్‌యూనియన్లు తలపెట్టిన సమ్మె లక్ష్యమని సిఐటియు ఆలిండియా ప్రధానకార్యదర్శి తపన్‌సేన్‌ ఉద్ఘాటించారు. సోమవారం ఉదయం విశాఖపట్నంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తపన్‌సేన్‌ మాట్లాడుతూ, దేశ ప్రధాని మోడీ 'మేకిన్‌ ఇండియా' పేర దేశ ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వరంగ వినాశనమే మోడీ, బిజెపి ధ్యేయమన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి:ఎమ్మెల్సీ శర్మ

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ డిమాండ్‌ చేశారు. ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు.

రుణ ఘోష..

                  ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విడుదల చేసిన ఎపి వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు ఎంత ఘనంగా ఉన్నా ఆచరణపై అనుమానాలు కలుగుతున్నాయి. అందుక్కారణాలు లేకపోలేదు. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు తొలి సిఎం అయిన చంద్రబాబు గత సంవత్సరం ఆవిష్కరించిన రుణ ప్రణాళిక టార్గెట్లు, సాధించిన ప్రగతిని పరిశీలిస్తే తాజా ప్లాన్‌కూ అదే గతి పడుతుందేమోనన్న సందేహం కలుగుతుంది. 2014-15 ప్రణాళిక లక్ష్యం రూ.91,459 కోట్లు కాగా బ్యాంకులు 85,345 కోట్లే ఇచ్చాయి. అందులో కూడా ప్రాధాన్యతా రంగాలకు బాగా తగ్గించేశాయి. ఈ విషయాన్ని ప్రజలు ఎలా విస్మరిస్తారు?

ఉపాధి కోల్పోయిన వారికి అండగా సిపిఎం..

రాజధాని నిర్మాణం కారణంగా  ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలకు రోజుకు 300చోప్పున నెలకు 9వేల రూపాయలు ఇవ్వాలని, అవి కుడా ఏప్రిల్ నెల నుండి లెక్కకట్టి ఇవ్వాలని, రైతులకు ఏవిధంగా అయితే రాజధాని ప్రాంతంలో సంపూర్ణ రూణమాఫీ చేశారో అదే విధంగా డ్వాక్ర మహిళలకు కూడా సంపూర్ణ రుణమాఫీ చేయాలని సిఆర్ డిఎ కార్యలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతా గ్రామాల ప్రజలు ధర్న కార్యక్రమం నిర్వహించారు..ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు .

 

Pages

Subscribe to RSS - 2015