2015

సుప్రీం కోర్టు సంచలన తీర్పు

రేప్‌ కేసులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అత్యాచార కేసుల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రొత్సహించడం ఆమోదయోగ్యం కాదని బుధవారం సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అలా చేయడం పెద్ద తప్పిదం అవుతుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పైగా అది మహిళల గౌరవానికి భంగం కలిగించడమేనని సుప్రీం స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పు పట్టింది. మద్రాస్‌ హైకోర్టు రేప్‌ కేసులో నిందితుడికి బైయిల్‌ ఇచ్చింది. బాధితురాలితో మధ్యవర్తిత్వం కుదుర్చుకునేందుకు వీలుగా బెయిల్‌ ఇస్తున్నట్లు న్యామూర్తి ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

నిబద్ధతే సాహూ మహరాజ్‌ సామాజిక తత్వం

మహారాష్ట్ర సంస్థానాలన్నింటా బలవంతంగా ఆమోదింపక తప్పని ఉచ్ఛస్థితిలో అగ్రకుల బ్రాహ్మణ ఆధిపత్య భావజాలం ఉన్న రోజులవి. ఛత్రపతి శివాజీ వంశీయులు, ఘాట్గే వంశీయులైన జయంతిసింగ్‌ అబాసాహెబ్‌, రాధా బాయిలు సాహూ మహరాజ్‌ తల్లిదండ్రులు. వీరు క్షత్రియులా? కాదా? అన్న శీలపరీక్షకు గురిచేసింది ఆనాటి బ్రాహ్మణ వర్గం. సాహూ మహరాజ్‌ 1874 జూన్‌ 26న జన్మించారు. 1894లో తన ఇరవయ్యవ ఏట పాలనా బాధ్యతలు చేపట్టి ఎన్నో సామాజిక ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు. బ్రాహ్మణ మనువాద తాత్వికతను క్షుణ్ణంగా పరిశీలించారు. అవరోధంగా ఉన్న వాటిని వదిలి ప్రజల సానుకూల అంశాలను పాలనా వ్యవస్థలో ఇమిడ్చారు.

మోసపూరిత మోడీ

           ''అఖిల భారత ఇమామ్‌ సంస్థ'' ముఖ్యులు ఇమామ్‌ ఉమర్‌ అహ్మద్‌ ఇల్యాసీ 30 మంది అనుచరులతో కేంద్ర సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వి ఆధ్వర్యంలో ప్రధాని మోడీని కలిశారు. ఆ సందర్భంలో, ''... మతపరమైన భాషను నేను ఎప్పుడూ ఉపయోగించ లేదు. ... అర్ధరాత్రి కూడా మీ ఆర్తనాదాలు వింటాను'' అన్నారు మోడీ. మోడీయంలో గడిచిన వసంతమొక్కటే. గడవనున్న వత్సరాలలో నేతి బీరకాయ పటాటోప ప్రగల్భ ప్రకటనలెన్నో ప్రారంభం కానున్నాయి. అస్మదీయుల మత దాడులను, పరమత ద్వేష ప్రచారాలను సహించి, మౌనం పాటిస్తున్నందుకు మోడీని అంతర్జాతీయ సమాజం అసహ్యించుకుంటున్నది.

నీతి బాహ్య రాజకీయాలు- నిరర్థక వివాదాలు

ఓటుకు కోట్ల కేసు నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చారు. ఈ సందర్భంగానూ, అంతకు ముందూ కూడా కేంద్రం నుంచి ఏవో నాటకీయ ఆదేశాలు అందుతాయని, సంచలన పరిణామాలు కలుగుతాయని కథలు చెప్పిన వారికి నిరాశే మిగిలింది. గవర్నర్‌ పర్యటనకు చాలా రోజుల ముందు నుంచి కేంద్ర హోం శాఖ ఆదేశాల పేరిట చాలా కథనాలు వచ్చాయి. అటార్నీ జనరల్‌ సలహా పేరిట మరికొన్ని కథనాలు కాలక్షేపం ఇచ్చాయి. అసలు కేంద్రం ఆగ్రహించిన మీదట ఉభయ రాష్ట్రాలూ వివాదాన్ని వెనక్కు పెట్టేశాయని కొందరు మీడియాధిపతులు భాష్యాలు చెప్పారు.

యోగా క్లాసులపై నిషేధం..

 ఓ వైపు భారత దేశం నేతృత్వంలో ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొని కొద్ది రోజులు కూడా గడవక ముందే సెంట్రల్ రష్యాలోని నిజ్నెవర్టొవిస్క్ నగరంలో అధికారులు మతపరమైన మూఢత్వం వ్యాప్తిని అరికట్టడం కోసమని చెప్తూ యోగా తరగతులపై నిషేధం విధించారు. పరమ శివుడు మొట్టమొదట పాటించినట్లు భారతీయ పురాణాలు చెప్తున్న కఠినమైన ఆసనాలు కలిగి ఉన్న హఠయోగ తరగతులు నిర్వహిస్తున్న రెండు స్టూడియోలపై అధికారులు ఈ నిషేధాన్ని విధించారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా హఠయోగానికి ఎంతో ప్రజాదరణ ఉంది.

పోరాటాలకు సిద్దం..పి మధు

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా , ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆగస్ట్ 1వతేదీ నుండి 14వతేదీ వరకు దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు తెలిపారు. విజయవాడ సిపిఎం పార్టీ కార్యలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మధు మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమం అరకొర ఉందని , చిరుద్యోగులు , కార్మికుల హక్కులపైదాడి ఈ కాలంలో బాగా పెరిగిపోయిందని, పాలనలో ఏకపక్షం తెలుగుదేశం పార్టీ వ్యవహారిస్తుందని మధు అన్నారు.

సొమ్ములిస్తేనే సేవలు..!

'ఆరధ్రప్రదేశ్‌కు ఇక సేవలు అరదిచాల్సిన అవసరం లేదు. వారు డబ్బులు చెల్లిస్తేనే సేవలు అరదిరచండి.'' అరటూ తెలంగాణ అదధికారులు తీసుకున్న కొత్త నిర్ణయం మరో సరికొత్త వివాదానికి తెరతీస్తోరది. ఉన్నత స్థాయిలో అనుమతి లేకుండా బయట శాఖల అధికారులతో మాట్లాడవద్దని, వారి కార్యాలయాలకు వెళ్లవద్దని తెలంగాణ ప్రభుత్వం నియమిరచిన సెరటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ శివశంకర్‌ ఇచ్చిన ఆదేశాలపై ఆరదోళనన ప్రారంభమైరది. అది కూడా భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్ర పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే ఈ ఆదేశాలు విడుదల కావడం గమనార్హం.

గ్రీస్ సంక్షోభం

తాకస్థాయికి చేరిన గ్రీస్‌ రుణ సంక్షోభంతో ప్రభుత్వం విధించిన ఆర్థిక ఆంక్షల అనంతరం వివిధ దేశాలకు చెందిన పెట్టుబడి మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ సంక్షోభ పరిస్థితులతో అప్రమత్తమైన ఫ్రాన్స్‌ తన కరెన్సీ మారకం విలువను తగ్గించి నష్టనివారణ చర్యలు తీసుకోవటంతో ఐరోపా కూటమి దేశాలు అదే బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. వాస్తవానికి రెండేళ్ల క్రితమే తలెత్తిన ఈ ముప్పును గుర్తించటంలో విఫలమైన యూరోజోన్‌ దేశాలకూటమి ఇప్పుడు గుర్తించి గ్రీస్‌పై ఎదురుదాడికి దిగింది. అత్యవసర సాయాన్ని కొనసాగించకూడదని నిర్ణయించిన ఐరోపా సెంట్రల్‌ బ్యాంక్‌ గ్రీస్‌ బ్యాంకులకు అత్యవసర నగదు సరఫరాను నిలిపివేసింది.

కొవ్వాడ అణుపార్కు... ఆంధ్రలో ఆటం బాంబే..

ప్రపంచ దేశాలన్నీ అణువిద్యుత్కేంద్రాలను మూసివేసి, ప్రత్యామ్నాయాల వైపు వెళ్తుంటే భారత్‌లో మాత్రం అణు విద్యుత్కేంద్రాలను ఎందుకు పెడుతున్నారు? భారతదేశంలోని కార్పొరేట్‌ సంస్థలు, బడా పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేయడానికి అమెరికా పెట్టిన షరతులను ప్రభుత్వం అంగీకరించింది.

Pages

Subscribe to RSS - 2015