2015

రాజకీయ వ్యూహాలకు రాష్ట్రాలే పాచికలా?

ప్రజలు పరిపక్వతతో విభజన వాస్తవాన్ని ఆమోదించారు. భవిష్యత్తులో తమకు జరిగే మేలేమిటని చూస్తున్నారు. రెండు ప్రభుత్వాలూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే కొరత కూడా వారిని వెన్నాడుతున్నది. ఇందుకు రెండే పరిష్కారాలు- ఒకటి రాజకీయ విజ్ఞతతో ఉభయులూ మాట్లాడుకోవడం. రెండు-కేంద్రం చొరవతో పరిష్కరించుకోవడం. ఇందులో కేంద్రం కూడా ఆసక్తిచూపడం లేదు. కనుకనే స్నేహపూర్వకంగా జరగాల్సిన ప్రథమ వార్షికోత్సవం వివాద సందర్భమై కూచుంది. 

మార్గదర్శి కొరటాల..

               భూస్వామ్య కుటుంబంలో పుట్టి విద్యార్థి దశలోనే ఉద్యమాలు నడిపిన నేత కొరటాల సత్యన్నారాయణ. ఆనాటి విద్యార్థి సంఘం జిల్లా నాయకులైన ఎంబి, ఎంహెచ్‌, ఎల్‌బిజిల సాన్నిహిత్యంతో కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులై పేద ప్రజల శ్రేయస్సుకై జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి. ఆయన రేపల్లె డివిజన్‌ పార్టీ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యులుగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా అంచెలంచెలుగా ఎదిగిన ప్రజానాయకులు. రేపల్లె ఏరియాలో చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం అలుపెరగని కృషి చేశారు.

సంక్షోభంపై హెచ్చరిక

             ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితినీ, పరిణామాలనూ 1930 నాటి ఆర్థిక సంక్షోభ పరిణామాలతో పోల్చుతూ.. ఇటీవల లండన్‌ బిజినెస్‌ స్కూలులో జరిగిన సదస్సులో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్‌ రఘురాం రాజన్‌ చేసిన ప్రసంగం సంచలనాన్నే సృష్టించింది. జాగ్రత్త వహించకపోతే 1930 నాటి పరిణామాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఐఎంఎఫ్‌ మాజీ ఆర్థిక సలహాదారుగానూ, పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న భారతదేశ రిజర్వు బ్యాంక్‌కు గవర్నర్‌గానూ ఉన్న వ్యక్తి చెప్పిన ఏ వ్యాఖ్యలకైనా విలువ ఉంటుంది.

ఆర్థిక సంక్షోభంలో ఏపీ..

అరకొర ఆదాయం! పెరుగుతున్న ఖర్చులు! కేంద్ర సాయం శూన్యం! నిధుల సర్దుబాటుకు తిప్పలు! తప్పని ఓవర్‌ డ్రాఫ్టులు! ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇది! దీంతో నిధులు సర్దుబాటు చేయలేక ఆర్థిక శాఖాధికారులు తలపట్టుకుంటున్నారు. వారానికోసారి ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. రూపాయి కూడా విదల్చకుండా చూద్దాం చేద్దాం అంటూ దాటవేస్తున్నారు. ఇక, బడ్జెట్‌లో పన్ను ఆదాయాన్ని రూ.3200 కోట్లుగా నిర్దేశించినా.. ఏ నెలా రూ.2800 కోట్లు మినహా రాలేదు. వసూలుకు, లక్ష్యానికి రూ.400 కోట్లు తేడా ఉంది.

ప్రాణాలు తీస్తున్న వ్యాపం..

వ్యాపం కుంభకోణంతో సంబంధమున్న వారు ఒక్కొరొక్కరూ మరణి స్తుండటం అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. తాజాగా ఈ అంశంపై వార్తలు రాస్తు న్న జర్నలిస్టు, జబల్పూర్‌కు చెందిన వైద్య కళాశాల డీన్‌ మరణించారు. డీన్‌ డాక్టర్‌ అరుణ్‌ శర్మ మృతదేహాన్ని న్యూఢిల్లీలోని ఓ హోటల్లో ఆదివారం ఉదయం కనుగొ న్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వైద్య కళాశాలకు ఆయన డీన్‌గా వ్యవహరి స్తున్నారు. వ్యాపం కుంభకోణాన్ని ఆయన పరిశోధిస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఇన్చార్జి డీన్‌ అయిన డాక్టర్‌ డి.కె. సక్కలే 90శాతం కాలిన గాయాలతో చనిపోయి కనిపించారు. డాక్టర్‌ శర్మ మృతిపై ప్రస్తుతం ఏమీ వ్యాఖ్యానించలేమని ఢిల్లీ పోలీసు లు చెప్పారు.

Pages

Subscribe to RSS - 2015