ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు మొండివైఖరిని కొనసాగిస్తే... ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం ద్వారా ప్రభుత్వ మెడలు వంచుతామని వామపక్షాలు హెచ్చరించాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్ మండలంలోని బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల పేరుతో భూసేకరణ నోటిఫికేషన్ ప్రకటించిన గ్రామాలైన మంగినపూడి, బుద్దాలపాలెం, గుండుపాలెంలో గురువారం సభలు నిర్వహించగా అందులో తొమ్మిది వామపక్ష అగ్రనేతలు పాల్గొన్నారు.