October

రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితులు - ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై కర్నూలులో రాష్ట్ర సదస్సు

సమగ్రాభివృద్ధికై నవంబర్‌ 7న భారీ బహిరంగసభ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

సామాజిక, ప్రాంతీయ అసమానతలు లేని సమగ్రాభివృద్ధికోసం ప్రత్యామ్నాయ విధానాలతోకూడిన ప్రజా ప్రణాళికలు రూపొందిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నెల 7న విజయవాడ నగరంలో రాష్ట్ర సమగ్రాభివృద్దికోసం భారీ బహిరంగ సభ జరుగుతుందని, దీనికి సిపిఎం అఖిలభారత ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతారని తెలిపారు. విజయవాడలోని ఎంబివికెలో సిపిఎం ఆధ్వర్యంలో అసమానతలు లేని అభివృద్ది కోసం ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ది, ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో ఆయన ముగింపు ఉపన్యాసం చేస్తూ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. .

అసమానతలు లేని అభివృద్ధి కోసం '' ఆంధ్ర ప్రదేశ్ సమగ్రాభివృద్ధి - ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై సెమినార్...

బిజెపి, వైసిపి పాలనలో నిరుద్యోగులకు తీవ్ర ద్రోహం

కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు నిరుద్యోగులకు తీరని ద్రోహం చేశాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రరవంలోని హోటల్‌ రివర్‌బేలో బుధవారం రాష్ట్ర స్థాయి నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ సభికులను వేదికపైకి ఆహ్వానించారు. వి.శ్రీనివాసరావు ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు.

దేశ సంపదను కాపాడేందుకు బిజెపిని ఓడించాలి

దేశ ప్రజల సంపదైన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలంటే కేంద్రంలో బిజెపిని 2024 ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. అప్పుడే రాజ్యాంగాన్ని కాపాడుకుని మతోన్మాదులను తరిమికొట్టిన వాళ్లమవుతామన్నారు. గురువారం సాయంత్రం కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద సిపిఎం ఆధ్వర్యాన జరిగిన 'ఉక్కు రక్షణ బహిరంగ సభ'కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన 'ఇండియా' వేదికలో పార్టీలను పోరుకు తాను సిద్ధం చేస్తానని ఆయన ప్రకటించగానే సభకు హాజరైన వేలాది మంది ప్రజలు హర్షధ్వానాలు చేశారు.

నవంబర్‌ 7న విజయవాడలో భారీ సభ.... మరో చారిత్రాత్మక ఉద్యమానికి సిద్ధం కావాలి...సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

మోడీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కులు, ప్రజా రక్షణకు మరో చారిత్రాత్మక పోరాటం నిర్వహించాల్సిన సమయం వచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. గతంలో ఎమర్జెన్సీకాలంలో నాయకులను జైళ్లలో పెట్టినప్పుడు, 1984లో ఎన్‌టిఆర్‌ను అప్రజాస్వామికంగా పదవీచ్యుతుడిని చేసినప్పుడు... ఇలా అనేక సందర్భాల్లో చారిత్రాత్మక ఉద్యమాలు ఆవిర్భవించాయని గుర్తుచేశారు. ఆదివారం విజయవాడలోని ఎంబి విజ్ఞానకేంద్రంలో సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా విస్త్రుతస్థాయి సమావేశం జరిగింది. ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వి శ్రీనివాసరావు మాట్లాడారు.

Pages

Subscribe to RSS - October