మోడీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కులు, ప్రజా రక్షణకు మరో చారిత్రాత్మక పోరాటం నిర్వహించాల్సిన సమయం వచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. గతంలో ఎమర్జెన్సీకాలంలో నాయకులను జైళ్లలో పెట్టినప్పుడు, 1984లో ఎన్టిఆర్ను అప్రజాస్వామికంగా పదవీచ్యుతుడిని చేసినప్పుడు... ఇలా అనేక సందర్భాల్లో చారిత్రాత్మక ఉద్యమాలు ఆవిర్భవించాయని గుర్తుచేశారు. ఆదివారం విజయవాడలోని ఎంబి విజ్ఞానకేంద్రంలో సిపిఎం ఎన్టిఆర్ జిల్లా విస్త్రుతస్థాయి సమావేశం జరిగింది. ఎన్టిఆర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వి శ్రీనివాసరావు మాట్లాడారు.