October

దేశ సంపదను కాపాడేందుకు బిజెపిని ఓడించాలి

దేశ ప్రజల సంపదైన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలంటే కేంద్రంలో బిజెపిని 2024 ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. అప్పుడే రాజ్యాంగాన్ని కాపాడుకుని మతోన్మాదులను తరిమికొట్టిన వాళ్లమవుతామన్నారు. గురువారం సాయంత్రం కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద సిపిఎం ఆధ్వర్యాన జరిగిన 'ఉక్కు రక్షణ బహిరంగ సభ'కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన 'ఇండియా' వేదికలో పార్టీలను పోరుకు తాను సిద్ధం చేస్తానని ఆయన ప్రకటించగానే సభకు హాజరైన వేలాది మంది ప్రజలు హర్షధ్వానాలు చేశారు.

నవంబర్‌ 7న విజయవాడలో భారీ సభ.... మరో చారిత్రాత్మక ఉద్యమానికి సిద్ధం కావాలి...సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

మోడీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కులు, ప్రజా రక్షణకు మరో చారిత్రాత్మక పోరాటం నిర్వహించాల్సిన సమయం వచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. గతంలో ఎమర్జెన్సీకాలంలో నాయకులను జైళ్లలో పెట్టినప్పుడు, 1984లో ఎన్‌టిఆర్‌ను అప్రజాస్వామికంగా పదవీచ్యుతుడిని చేసినప్పుడు... ఇలా అనేక సందర్భాల్లో చారిత్రాత్మక ఉద్యమాలు ఆవిర్భవించాయని గుర్తుచేశారు. ఆదివారం విజయవాడలోని ఎంబి విజ్ఞానకేంద్రంలో సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా విస్త్రుతస్థాయి సమావేశం జరిగింది. ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వి శ్రీనివాసరావు మాట్లాడారు.

ఫ్లెక్సీల నిషేధంపై అవుట్‌ ఆఫ్‌ హోమ్‌ అడ్వర్టయిజ్‌మెంట్స్‌ ఇండస్ట్రీలోని ఉత్పత్తిదారులతో చర్చించాలని, సముచిత పరిష్కారం కనుగొనేవరకూ నిషేధాన్ని వాయిదా వేయాలని కోరుతూ...

Pages

Subscribe to RSS - October