
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 13 అక్టోబర్, 2024.
ప్రొఫెసర్ సాయిబాబా మృతికి సిపిఐ(యం) శ్రద్దాంజలి
ప్రముఖ విద్యావేత్త, పౌర హక్కులనేత ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మృతిపట్ల
సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేసింది. వారి కుటుంబ
సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది. భౌతికంగా నడవలేని స్థితిలో చక్రాల
కుర్చీకే పరిమితమైన సాయిబాబా టెర్రరిస్టు నెపంతో దీర్ఘకాలం ఉపా చట్టం
క్రింద చేయని నేరానికి జైలులో మగ్గిపోయారు. బెయిలుపై విడుదలైన కొద్ది
నెలలకే మరణించడం దురదృష్టకరం. ఇది సహజ మరణం కాదు. ప్రభుత్వ నిర్బంధ ఫలితం.
అర్బన్ నక్సల్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామిక వాదులను,
మేధావులను వేధించడం తక్షణం నిలిపివేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్
చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org