District News

కొవ్వాడ అణుపార్కు భూసేక‌ర‌ణ‌ను ప్ర‌తిఘ‌టిండి
అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్ర‌మాద‌క‌రం
---సిఐటియు రాష్ట్ర ఉపాధ్య‌క్షులు సి.హెచ్‌.న‌ర్సింగ‌రావు

     కొవ్వాడ అణుపార్కు భూసేక‌ర‌ణ‌ను ప్ర‌తిఘ‌టించాల‌ని సిఐటియు రాష్ట్ర ఉపాధ్య‌క్షులు సి.హెచ్‌.న‌ర్సింగ‌రావు పిలుపునిచ్చారు. ర‌ణ‌స్థ‌లంలో దేవిశ్రీ క‌ళ్యాణ మండ‌పంలో కొవ్వాడ అణుపార్కుకు వ్య‌తిరేకంగా ప్ర‌జాసంఘాల ఆధ్వ‌ర్య‌ములో రౌండ్ టేబుల్ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఆయ‌న ముఖ్య వ‌క్త‌గా మాట్లాడుతూ అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్ర‌మాద‌క‌రమ‌ని అన్నారు.కొవ్వాడ అణుపార్కు జిఓల‌ను ర‌ద్దుచేయాల‌ని డిమాండ్ చేసారు.అణువిద్యుత్ కార్మాగారంలో లీకులు అత్యంత స‌హ‌జ‌మ‌ని అన్నారు.అణువిద్యుత్...

అధ్యయనం పేర నగరానికి చెందిన తెలుగుదేశం, బిజెపి ఎంఎల్‌ఏలు  అమెరికా పర్యటన చేసి అక్కడి నగరాల  గురించి ప్రచారం చేస్తున్నారు. విశాఖ నగరాన్ని కూడా శాన్‌ఫ్రాన్సిస్‌కో, న్యూయార్క్‌, వాషింగ్‌టన్‌లగా మారుస్తామని అంటున్నారు. నగరాలు  బాగా అభివృద్ది చెందాయని, అక్కడ రోడ్‌మీద కాగితం కూడ ఉండదని, ప్రతి నీటిబొట్టుకి డబ్బుచెల్లిస్తారని, ట్రాఫిక్‌, పొల్యుషన్  సమస్యలేదని, డ్రైనేజివ్యవస్థ బాగుంటుదని, ప్రతిసేవకు యూజర్‌ చార్జీలు  వసూలు  చేస్తారని తెలియజేస్తున్నారు.
    ఎంఎల్‌ఏల   ప్రకటను చాలా హాస్యాస్పధంగా ఉన్నాయి. వారి చేప్పేవిషయాలు విశాఖనగర ప్రజలకు తెలియనవికావు. ఆనగరాల్లో స్థానిక ప్రభుత్వవలు  ప్రజల  ఎడల  ఎలాంటి బాధ్యతు నిర్వర్తిస్తున్నాయో వాటిని...

    విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2016-17కి సంబంధించి  ఆదాయము, వ్యయముల‌పై సమర్పించిన నివేదికలో ప్రతిపాదించిన టారిఫ్‌పై విద్యుత్‌ రెగ్యులేటరీ కమీషన్‌ బహిరంగ విచారణలో  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యు సిహెచ్‌.బాబూరావు  ప‌లు అంశాలు అధికారులు తీసుకెళ్ళారు. విద్యుత్‌ వినియోగదారులపై 783 కోట్ల రూపాయ భారాన్ని మోపే ప్రతిపాదనల‌ను ఉపసంహరించుకోవాలి. గృహవినియోగదారులు, చిరువ్యాపారులు, స్థానిక సంస్థలు, రైల్వేట్రాక్షన్‌, కుటీరపరిశ్రమల‌పై ఈ భారం పడుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతిమంగా ప్రజలే వీటిని మోయాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా సహజవాయువు, బొగ్గు ఇతర ఇందన వనరులు తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఛార్జీల పెంపు అన్యాయం. ఢల్లీిలో 50శాతం విద్యుత్‌ చార్జీలు...

రాష్ట్రంలో పిసిపిఐఆర్‌ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణ ఆపాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.క్రాంతి డిమాండ్‌ చేశారు. ఈ నెల 9న జరగనున్న చలో విజయవాడ కార్యక్రమానికి భూ సేకరణ బాధితులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల భూమిని బడా కంపెనీలకు, పెట్టుబడుదారులకు దారాదత్తంచేసేందుకు పూనుకుంటోందన్నారు. నక్కపల్లి మండలంలో పిసిపిఐఆర్‌ పేరుతో చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం రైతాంగం కోర్టును ఆశ్రయించారని చెప్పారు. కోర్టులో స్టే వుండగా ఇటు ప్రభుత్వం, అటు అధికారులు రైతులు వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడం దారుణమన్నారు. రైతులు, వృత్తిదారులు, పేదలు...

            అర్హులైన పేదలందరికీ జిఒ 298 ప్రకారం ఇళ్ళపట్టాలు ,స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యాన శనివారం శాంతానగర్‌, అంబేద్కర్‌నగర్‌, గాంధీనగర్‌, కార్మికనగర్‌, జ్యోతినగర్‌, వుడాకాలనీ ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్‌ బి గంగారావు మాట్లాడుతూ జిఒ 296 ప్రకారం వంద గజాల లోపు ఇళ్లను, స్థలాను ఉచితంగా క్రమబద్దీరకణ చేస్తామని ప్రకటించి, దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వాటిల్లో అనేకం గెడ్డలు, కొండలు, చెరువులని చెప్పి తొలగించాలరన్నారు. పేదలకు జి+1 ఇళ్లు ఇవ్వాలని, హుదూద్‌ నిర్వాసితులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 
సిసిఐ జిల్లా కార్యదర్శి ఎజె స్టాలిన్‌ మాట్లాడుతూ జివిఎంసి పరిధిలో...

- పుష్కర లింక్‌, పోలవరం ఎడమ కాలువ పనులను తక్షణమే ప్రారంభించాలి
- రైవాడ రైతులకు అన్యాయం

ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి కొరతకు ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. పుష్కర లింకు, పోలవరం ఎడమ కాలువ పనులను తక్షణమే ప్రారంభించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి కోసం విశాఖ నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మంచినీటి సరఫరా సమయం తగ్గించారని, కొండ ప్రాంతాలకు నీరు ఎక్కడం లేదని, ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయడం లేదని పేర్కొన్నారు....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం తప్పుబట్టింది. ప్రజలపై భారాలు మోపడం సరికాదని పేర్కొంది. ఈ ఛార్జీల పెంపును సీపీఎం, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా చేపట్టింది. ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమని, పెద్ద పెద్ద కంపెనీలపై పన్నులు వేసి డబ్బులు వసూలు చేస్తే ఛార్జీలు పెంచాల్సినవసరం లేదన్నారు. నాలుగు శాతం అనేది చాలా ఎక్కువని, ఛార్జీలు పెరగడం వల్ల ప్రతి వస్తువు ధర కూడా పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి మిగులు విద్యుత్ ఉండడమే కాకుండా 24గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చన్నారు. దాదాపు 1650 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని,...

 క‌నీస వేత‌నం అడిగితే ఇలా అక్ర‌మ అరెస్టులా?  ఇదేమి ప్ర‌జాస్వామ్యం?  పోలీసుల‌తో ప్రభుత్వ పాల‌నా సిగ్గు, సిగ్గు!!

       విద్యుత్‌ ఛార్జీలు పెంచితే ఆందోళన ఉధృతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు హెచ్చరించారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యాన కార్యకర్తలు, ప్రజలు గురువారం ఇపిడిసిఎల్‌ కార్యాలయం ధర్నా నిర్వహించారు. దీనికిముందు ద్వారకానగర్‌ కూడలి నుంచి ఎపిఇపిడిసిఎల్‌ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలకు రాయితీలిస్తూ వినియోగదారులపై ఛార్జీల మోపి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఆరిలోవ కొండవాలు ప్రాంతంలోని బిఎన్‌ఆర్‌ నగర్‌లో 400 ఇళ్లకు విద్యుత్‌ సరఫరా లేదన్నారు. చాలాసార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందన్నారు. వెంటనే ఆ ప్రాంతానికి విద్యుత్‌ సరఫరా చేయాలని...

                 భీమిలి మండలంలోని దివీస్‌ లేబొరేటరీస్‌ స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించి బాధిత భూ సాగుదారులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. సమస్య పరిష్కారమయ్యే వరకూ ఆ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కోసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు వివి.శ్రీనివాసరావులు గురువారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ వివరాలు....
దివీస్‌ లేబొరేటరీస్‌ భూ సమస్య, కాలుష్యం, ఇతర సమస్యలపై ఫిబ్రవరి 22న మీకు విన్నవించాం. నాలుగు పంచాయతీల్లోని 17 గ్రామాలకు చెందిన 16 వేల మంది ప్రజల...

Pages