District News

- ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించాలి....

- సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి....

 (విశాఖ రూరల్)  ఈ రోజు విశాఖ జిల్లా సిపియం కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో సిపియం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్.నరసింగరావు గారు మాట్లాడుతూ..

డా.. బి.ఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కట్టుదిట్టంగా అమలు చేయాల్సి వున్న వాటిని అమలు చేయకపోవడం దుర్మార్గం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు అవుతోంది. పాలకులు మారారు, ప్రభుత్వాలు మారాయి. ఎస్సీ, ఎస్టీల అభివ్రద్ధి అంటూ అనేక వాగ్ధానాలు, హామీల వర్షం...

 చిత్తశుద్దితో రాజ్యాంగం అమలుతోనే సామజిక న్యాయం సాధ్యం అని ప్రముఖ రచయిత శ్రీ కంచే ఐలయ్య అన్నారు ఈ రోజు విశాఖపట్నంలో ఉక్కునగరం లో కులవివక్షత వితిరేక పోరాట సంగం,ఆంధ్రప్రదేశ్ గిరిజన సంగం మరియు డి ఐ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో సామజిక న్యాయం అనే అంశంపై జరిగిన జాతీయసదస్సు లో అన్నారు

ఒక పక్కన అధికారుల‌తో నోటీసు ఇప్పిస్తూ, ఇళ్లు ఖాళీ చేయాల‌ని బెదిరిస్తూ మరోపక్కన మీరెవ్వరూ నోటీసులు తీసుకోవద్దు మీకు మేము అండగా వుంటామని చెబుతున్న తొగుదేశం ప్రజాప్రతినిధు ప్రజల‌ను మోసగించవద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు సి.హెచ్‌. బాబూరావు అన్నారు. ఆదివారం భవానీపురం పున్నమి హాోటల్‌ వద్ద నుండి ప్రారంభమైన పాదయాత్రలో బాబూరావు పాల్గొని కరకట్ట వాసుతో మాట్లాడారు. నోటీసులు తీసుకోవద్దని చెప్పే ప్రజాప్రతినిధులు తమ అధికార పార్టీ అధినేతతో మాట్లాడి నోటీసు రద్దుచేయిస్తే ఈ సమస్య ఉండదన్నారు. ఆ పనిచేయకుండా ఇక్కడకు వచ్చి ఈ రకంగా మాట్లాడటం ప్రజను మోసగించటమే అవుతుందన్నారు. ఇప్పటికైనా తొగుదేశం పార్టీ కరకట్ట ఇళ్లు తొగించానుకుంటున్నారా, ఇక్కడే...

రాజీవ్‌ ఆవాజ్‌ యోజన (రే) తాత్కాలిక గృహ నిర్మాణాపై విచారణ జరపాలి.లబ్ధిదారుకు నెలకు 5 వేలరూపాయిఅలు చొప్పున ఇంటి అద్దె చెల్లించాలి.
    
    రాజీవ్‌ ఆవాజ్‌ యోజన (రే) తాత్కాలిక గృహ నిర్మాణ పథకాన్ని రాష్ట్రంలోనే మొదటి మోడల్‌ కాలనీగా 2వార్డులో గల  సూర్యతేజనగర్‌ ను ఎంపిక చేయడం జరిగింది. రే ఇళ్ళు నిర్మించేవరకు ఆ కాలనీ ప్రజానీకం నివాసం ఉండడానికి తాత్కాలిక గృహాలు  నిర్మించి ఇవ్వాలని నిర్ణయం చేశారు. దీనిలో భాగంగా ఆరిలోవలో ప్రభుత్వం నిర్మిస్తున్న 208 ఇళ్ళను సిపిఎం నగర కార్యదర్శి డా॥ బి. గంగారావు నాయకత్వంలోని బృందం ఈరోజు పరిశీలించడం జరిగింది.
    ఈ సందర్భంగా గంగారావుగారు మాట్లాడుతూ రే లబ్ధిదారుకు...

రాష్ట్రంలో దళితుల సమస్యలు పరిష్కారం కాకపోగా హక్కులనూ కాలరాస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. నేటికీ అంటరానితనం సమాజంలో వేళ్లూనుకుని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విగ్రహాలు పెట్టి ప్రజల కళ్లుగప్పేందుకు పాలకులు పూనుకుంటున్నారని, ఆయనకు నిజమైన నివాళులర్పించాలంటే రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని, సామాజిక న్యాయం అందేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులతో భర్తీ చేయాల్సిన బ్యాక్‌లాగ్‌ పోస్టులను అర్హులు లేరనే పేరుతో ఇతరులకు దారాదత్తం చేస్తున్నారని, అంబేద్కర్‌ ఆశించిన పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయడం లేదని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌కు చైర్మన్‌, కమిటీ సభ్యులను నియమించాలని డిమాండ్‌ చేశారు. దళితులపై...

విమ్స్‌ స్థలం ప్రైవేట్‌ కు ధారాదత్తానికి కుట్ర
కార్పొరేట్‌ హాస్పటల్స్‌తో తొలుగుదేశం - బిజెపి కుమ్మక్కు
విమ్స్‌ నిర్వీర్యానికీ ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి అప్పగింత
    
    విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికెల్‌ సైన్స్‌ (విమ్స్‌) హాస్పటల్‌ అవుట్‌ పేషెంట్‌ (ఒ.పి) సేవలను ఏప్రిల్‌ 11న ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విమ్స్‌లో వైద్య సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభించకుండా కేవలం ఓపి సేవాలు  ప్రారంభించడం వెనుక తెలుగుదేశం, బిజెపిలు పెద్ద కుట్రకు పల్పపాడ్డాయి. ఈ చర్యను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) గ్రేటర్‌ విశాఖ నగర కమిటి తీవ్రంగా ఖండిస్తున్నది.
    విమ్స్‌ ఆధీనంలో 100 ఎకరాల స్థలం ఉంది. అందులో...

- ముగ్గురు కార్మికులకు గాయాలు
- ఆందోళనలో కార్మికులు, స్థానికులు
- సంఘటనాస్థలాన్ని పరిశీలించిన సిపిఎం, సిఐటియు నేతలు 
- దివీస్‌ ప్రమాదఘటనపై సమగ్రదర్యాప్తు సిపిఎం, సిఐటియు డిమాండ్‌ 
            విశాఖ జిల్లా భీమిలి మండలం చిప్పాడ దివీస్‌ లేబొరేటరీస్‌లోని హెచ్‌ బ్లాక్‌లో బుధవారం సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్‌లో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తి, రా మెటీరియల్‌ లోడ్‌ చేస్తుండగా నిప్పురవ్వలు ఎగసిపడి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గణపతి, భాస్కర్‌, అసిరినాయుడు అనే ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి...

సబ్బవరం మండలం వంగలి సర్వేనెంబర్‌ 109, 135, 240, 241, 242లోగల అసైన్డ్‌ భూములను బలవంతంగా లాక్కొనే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న డిమాండ్‌ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సేకరణకు సంబంధించి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన భూహక్కుదారుల జాబితా తప్పుల తడకగా ఉందన్నారు. హక్కుదారులలో కొంతమందికి ఐదు ఎకరాల సాగు భూమి ఉండగా 2, 3 ఎకరాలు ఉన్నట్లుగా చూపిస్తున్నారని తెలిపారు. మరికొంత మంది హక్కుదార్ల పేర్లు జాబితాలో లేవన్నారు. 30 ఏళ్లుగా సాగుచేస్తున్న రైతుల ఆమోదం లేకుండా భూ సేకరణ చేయడం సరికాదన్నారు....

ప్ర‌జాస‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుండా జీతాలు పెంచుకోవ‌డం సిగ్గుచేటు. 
    -  సిపిఎం న‌గ‌ర కార్య‌ద‌ర్శి దోనేపూడి కాశీనాథ్‌ 
      ప్ర‌జా స‌మ‌స్య‌లు   ప‌క్క‌న పెట్టి కార్పొరేట‌ర్ల జీతాలు, అల‌వెన్సులు పెంచుకునే ప‌నిలో అదికాప‌క్షం వుంద‌ని, మ‌రో ప్ర‌క్క జీతాలు పెంచ‌మ‌ని ఆందోళ‌న చేస్తున్న కార్మికులను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఇది సిగ్గుప‌డాల్సిన విష‌యం అని కాశీనాథ్ అన్నారు. సోమ‌వారం జ‌రిగే కౌన్సిల్ స‌మావేశంలో ఈ విష‌యం సిపిఎం కార్పొరేట‌ర్ నిల‌దీయ‌నున్నార‌ని తెలిపారు. దీనితో పాటు ప‌లు అంశాల‌పై కౌన్సిల్  చర్చించాల‌ని ఆయ‌న కోరారు.  మేయర్‌ ఏకపక్షంగా కౌన్సిల్‌ నిర్వహించినట్లయితే కౌన్సిల్‌ లోప, బయట ఆందోళన చేపట్టాల్సి వస్తోందని  హెచ్చ‌రించారు.  ...

శ్రీ‌కాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లం మండ‌లం పైడిభీమ‌వ‌రం వ‌ద్ద గ‌ల  అర‌బిందో ఫార్మా ప‌రిశ్ర‌మలో ప‌నిచేస్తున్న వేలాది మంది  కార్మికులు సిఐటియు ఆద్వ‌ర్య‌ములో చేసిన   సాధించింది. నూత‌న వేత‌న ఒప్పందం జ‌రిగింది. అర‌బిందో కార్మికుల విజ‌యోత్స‌వ స‌భ‌లో  సిఐటియు రాష్ట్ర ఉసాధ్య‌క్షులు, అర‌బిందో ఫార్మా వ‌ర్కర్స్ యూనియ‌న్ గౌర‌వ అధ్య‌క్షులు సి.హెచ్.న‌ర్సింగ‌రావు మాట్లాడారు.ఇదే స్ఫూర్తిని కొన‌సాగిస్తూ మ‌రింత ఐక్య‌త‌తో మందుకెళ్ళాల‌ని పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే హ‌క్కులు సాధ్య‌మ‌వుతాయ‌ని అన్నారు .ఐక్య‌తే ఆయుధం.పోరాట‌మే మార్గం అని అన్నారు.కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు కార్మిక హ‌క్కుల‌ను కాల‌రాస్తున్నాయ‌ని అన్నారు.

Pages