District News

  (visakha rural)          అచ్యుతాపురం బ్రాండిక్స్‌ కార్మికులపై యాజమాన్యం, ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని, వారి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన సోమవారం అడ్డురోడ్డు కూడలి వద్ద చేతులకు సంకెళ్లు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం బ్రాండిక్స్‌ యాజమాన్యానికి తొత్తుగా మారారని విమర్శించారు. బ్రాండిక్స్‌ కార్మికులకు మద్దతు తెలిపిన సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించడం దారుణమన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.అప్పలరావు మాట్లాడుతూ కార్మికుల శ్రమను దోచుకుంటున్న బ్రాండిక్స్‌...

(visakha rural)

             పెట్రో కారిడార్‌ కోసం చేపడుతున్న భూసేకరణపై 'యథాతదస్థితి' (స్టేటస్‌కో)ని కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం పట్ల సిపిఎం, ఇండిస్టియల్‌ పార్కు నిర్వాసితుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు సిపిఎం, నిర్వాసితుల సంఘం నాయకులతో కలిసి విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడారు. నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో పిసిపిఐఆర్‌ పేరిట 2010లో ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందని, దీనినే నేడు విశాఖ-చెన్నై కారిడార్‌గా మార్పు చేశారని తెలిపారు. 2,600 ఎకరాల జిరాయితీ భూముల సేకరణకు 4(1) నోటీసులు ఇచ్చిందని, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పరిసర...

మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబీవీకే), ప్రజాశక్తి బుకహేౌస్‌ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని ఐవి ప్యాలెస్‌లో '25 ఏళ్ల సంస్కరణలు - ఫలితాలు' అనే అంశంపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ మాకినేని బసవపున్నయ్య స్మారకోపన్యాసం చేశారు.సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభానికి గురైందన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గాయన్నారు. విదేశీ ఉత్పత్తులను స్వేచ్ఛగా అనుమతించటంతో దేశీయ వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లభించటంలేదన్నారు. సరళీకరణ వల్ల దేశంలో పారిశ్రామికాభివృద్ధి క్షీణించిందన్నారు. బీహెచ్‌ఈఎల్‌ వంటి సంస్థల్లో ఉత్పత్తి తగ్గినట్లు తెలిపారు.

 25 ఏళ్ల సరళీకరణ విధానాల వల్ల దేశంలో అన్ని రంగాల్లోనూ అసమానతలు తీవ్రంగా పెరిగాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటంతోపాటు భారత దేశానికి అనుకూలమైన సోషలిస్టు ప్రత్యామ్నాయం కోసం కృషి చేయటం ప్రజలముందున్న కర్తవ్యమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ స్పష్టం చేశారు. మార్క్సిస్టు మేథావి మాకినేని బసవపున్నయ్య తన జీవితాంతం సోషలిజం కోసం పని చేశారని, దేశంలో సోషలిస్టు ప్రత్యామ్నాయాన్ని సాధించటమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళని కరత్‌ చెప్పారు. 25 ఏళ్లలో సరళీకృత ఆర్థిక విధానాల అమలు దేశ ఆర్థిక రంగం మీదే కాకుండా రాజకీయ, సామాజిక, సాంస్కృక రంగాలన్నింటిపైనా తీవ్ర ప్రభావాన్ని చూపించాయన్నారు. సరళీకరణ ఆర్థిక విధానాలను వ్యతిరేకించటంతోపాటు ప్రత్యామ్నాయాన్ని...

( visakha rural) ;   బ్రాండిక్స్‌ యాజమాన్యం మహిళలు పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కార్మికులు ఉద్యమించారు. చాలీచాలని వేతనాలతో సంవత్సరాలు తరబడి పనిచేస్తున్నప్పటికీ నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని బ్రాండిక్స్‌ మెయిన్‌ గేట్‌ వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. పిఎఫ్‌, గ్రాట్యూటీ, జీతాల పెంపు వంటి సమస్యలను పట్టించుకోలేదన్నారు. కార్మికశాఖ అధికారులు యాజమాన్యానికి తలొగ్గారన్నారు. పలు పర్యాయాలు జీతాలు పెంచాలని డిమాండ్‌ చేసిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం మొండి వైఖరి నశించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. టార్గేట్ల పేరుతో రోజురోజుకు పనిభారం పెంచుకుంటూ పోతున్నారని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులలో, క్యాంటిన్‌లో...

నిన్న అంబేద్కర్ కి 125అడుగుల విగ్రహం కడతామని గొప్పలు చెప్పి . . . ఈరోజు రాజ్యాంగ విరుద్దంగా CRDA పరిధిలో ఇచ్చే ఉద్యోగాలకు రిజర్వేషన్స్ వర్తించవు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం దారుణం .  విజయవాడలో సీపీఎం నిరశన .

visakha rural

- నిద్రహారాలు మాని ఆందోళన కొనసాగించిన మహిళలు
- బెదిరింపులకు దిగిన యాజమాన్యం
- తాగునీరు నిలుపుదల
- భారీగా పోలీసు పికెట్‌ 
- అయినా వెనక్కు తగ్గని కార్మికులు
- ఈ నెలాఖరు వరకూ గడువు కోరిన మేనేజ్‌మెంట్‌ ఆందోళన తాత్కాలిక విరమణ

సుమారు 3 వేల మంది మహిళా కార్మికులు. వీరిలో శుక్రవారం ఉదయం 4 గంటల షిఫ్ట్‌కు హాజరైన వారు ఉన్నారు. ఇంటి దగ్గర పిల్లలు ఉండిపోయారు. తిండీ తిప్పలు లేవు. అయినా వారి పట్టుదల ముందు అవేవీ కనిపించలేదు. అతి తక్కువ జీతాలిస్తూ తమ చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్న,...

 (విశాఖ రూరల్)            ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్ట లేదని సిపిఎం జిల్లా నాయకులు జి.కోటేశ్వరరావు విమర్శించారు. నర్సీపట్నంలో డివిజన్‌ స్థాయి సిపిఎం కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రైతులకు గిట్టుబాటు ధర కల్పించ లేదని, కార్మికులకు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వలేదన్నారు. బ్రాండిక్స్‌ కంపెనీలో కనీస వేతనాలు ఇవ్వాలని, నర్సీపట్నం పరిసర గ్రామాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. 12 గంటలు పని చేయించుకొని కేవలం రూ.4వేలు మాత్రమే వేతనం ఇస్తుండటంతో బ్రాండిక్స్‌ కార్మికులు ఆందోళనకు దిగారన్నారు. ఈ విషయమై...

పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్‌లో ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారని, ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. రేంపెక్స్‌లో ఇద్దరు, మైలాన్‌లో ఇద్దరు ప్రమాదానికి గురయ్యారని, లోహిత్‌ ఫార్మాలో బాయిలర్‌ లీకేజ్‌ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని, ఎస్‌ఇజెడ్‌ అలివెరాలోనూ ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు నివారించకుండా కోస్తా తీరమంతా ఫార్మా, పెట్రో, కార్బన్‌ తదితర విష కంపెనీలు, ప్రమాదకర కంపెనీలను ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల లాభాల కోసం స్థానికులను బలిచేయడం దుర్మార్గమన్నారు. ఫార్మా కంపెనీల్లో భద్రతా చర్యలు చేపట్టే వరకు అన్ని కంపెనీల్లో అందోళనలు చేయాలని...

ఈ రోజు అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా డబగార్డెన్ వద్ద పుష్పంజిలి గట్టించారు. ఈ సందర్భంగా సిపియం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్.నరసింగరావు గారు మాట్లాడుతూ..

డా.. బి.ఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కట్టుదిట్టంగా అమలు చేయాల్సి వున్న వాటిని అమలు చేయకపోవడం దుర్మార్గం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు అవుతోంది. పాలకులు మారారు, ప్రభుత్వాలు మారాయి. ఎస్సీ, ఎస్టీల అభివ్రద్ధి అంటూ అనేక వాగ్ధానాలు, హామీల వర్షం కురిపిస్తున్నారు. ఆచరణలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి...

Pages