District News

               విశాఖలో మంచినీటి వ్యాపారం కోసం రైతుల పొట్టగొట్టి రైవాడ నుంచి అదనంగా 150 క్యూసెక్కుల నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకొనేది లేదని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న హెచ్చరించారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో రైతులతో ఆదివారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైవాడ నుంచి విశాఖకు అదనంగా నీటిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రైవాడ నీటిని రైతులకే పూర్తిగా అందిస్తామని, రిజర్వాయర్‌ను రైతులకు అంకితం చేస్తామని అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, అదనంగా నీటిని తరలించుకుపోవడానికి నిర్ణచయించడం దారుణమన్నారు. ఒక పక్క అదనపు ఆయకట్టు 6 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని రైవాడ...

               ఓలం జీడిపిక్కల ఫ్యాక్టరీ యాజమాన్యం అన్యాయంగా తొలగించిన 9 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అమలాపురం ఫ్యాక్టరీ కార్మికులు ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నర్సీపట్నం డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.రాజు మాట్లాడుతూ నర్సీపట్నం మండలం అమలాపురంలోని ఓలం జీడిపిక్కల కర్మాగారంలో 13 సంవత్సరాల నుండి మహిళలు, అనేక మంది కార్మికులుగా పని చేస్తున్నారని తెలిపారు. వీరిలో 9 మందిని మార్చి 20వ తేదీ నుండి ఫ్యాక్టరీలో పని చేయడానికి ప్రవేశం లేకుండా సెక్యూరిటీ సిబ్బందితో ఆటంకపర్చారని చెప్పారు. ఎటువంటి కారణం లేకుండా ఈ 9 మంది కార్మికులను తొలగించారని, దీనిపై ప్రశ్నిస్తే వయస్సు మీరిందని, అందువల్ల...

కమ్యూనిస్టులు బలపడితేనే భారతదేశ పురోగతి, అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. పెదనందిపాడు మండలంలోని పాలపర్రులో ఆదివారం పాత బాపట్ల తాలూకా మృతవీరుల స్మారక సభ నిర్వహించారు. ముందుగా జడ్‌పి పాఠశాల నుంచి అమరవీరుల స్థూపం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీరతెలంగాణ సాయుధ పోరాటంలో నేలకొరిగిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. భూమికోసం భుక్తి కోసం బడుగు, బలహీనులు సాగించిన పోరాటంలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జంపని వెంకటేశ్వర్లు కళావేదికపై నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిధిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ కార్మికులు, శ్రామికులు, పేద బడుగు వర్గాల హక్కుల కోసం...

దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కొల్లేరు అభయారణ్యం నడిబొడ్డున అక్రమంగా రహదారి నిర్మాణం ఈసారి వివాదానికి కారణమైంది. జిల్లా అటవీశాఖ అధికారులు దీనిని అడ్డుకోగా వారిపై ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా మండవల్లి మండలం చింతపాడు నుండి పశ్చిమ గోదావరి జిల్లా యాగనమిల్లి వరకు రహదారి నిర్మాణం చేయడానికి ప్రభాకర్‌ ఇటీవల ప్రయత్నించారు. దీనిని చింతపాడు గ్రామస్తులు అడ్డుకున్నారు. 

కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు నిర్మించ తలపెట్టిన వివాదాస్పద రంగారెడ్డి -పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో నిర్వహించిన మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. ప్రకాశం బ్యారేజీ వద్దకు ర్యాలీగా బయలుదేరిన నాయకులను పోలీసులు అడుగడుగునా అరెస్టులు చేశారు. దీంతో విజయవాడ అలంకార్‌ కూడలి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు రణరంగంలా మారింది. బ్యారేజీ సందర్శనకు అనుమతి లేదంటూ వందలాది మంది పోలీసులు నాయకులను అడ్డుకున్నారు. 

రాష్ట్రంలో 65 రకాల ఉత్పత్తి రంగాల్లో 50 లక్షలకుపైగా కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుని ఏడాదికి రూ.500 కోట్ల శ్రమను యజమానులు దోచుకుంటు న్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ తెలిపారు. సిఐటియు కర్నూలు జిల్లా 10వ మహాసభలో పాల్గొనేందుకు ఆదోనికి వచ్చిన ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మిక శాఖ రెండేండ్ల పెరిగే ధరలకను గుణంగా వివిధ సెక్టార్లలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేత నాలు పెంచాలని కోరారు. 15 ఏళ్లుగా కార్మిక శాఖ వేతనాల పెంపుదల జోలికే వెళ్లలేదన్నారు.

నాలుగొందల శతాబ్ధాల చరిత్రకలిగిన హైదరాబాద్‌ ఆర్ధిక వివర్తన, అమరావతిలో ఆచరణసాధ్యం కాదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఒంగోలులో జరిగిన అఖిల భారత అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా అంశంపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో మాట్లాడిన రాజకీయ పార్టీలు ఇప్పుడెందుకు ప్రత్యేక హోదాపై మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్‌ కేటగిరి అవసరంలేదనే వాదన అర్థంలేనిదని అన్నారు.

సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపీ దాడిని ఖండిస్తూ సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేరళలో లెఫ్ట్ పార్టీల విజయాన్ని తట్టుకోలేకే బీజేపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దేశ సమగ్రత, సమైక్యతల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న సిపిఎంపై కుట్ర చేయటానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌, బిజెపి శక్తులు యత్నిస్తున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్‌.పుణ్యవతి అన్నారు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌.ఎస్‌.ఎస్‌, బిజెపి, ఎబివిపి గూండాలు దాడికి యత్నించటాన్ని నిరసిస్తూ ఆదివారం పాతగుంటూరు సిఐటియు కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ బస్‌స్టేషన్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. పుణ్యవతి మాట్లాడుతూ పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి జరగటం ప్రధానికి తెలియకుండా జరగే అవకాశం లేదని, మోడీ ప్రోద్భలంతోనే ఇది జరిగిందన్నారు. గాంధీని చంపిన గాడ్సే వారసులు రాజ్యమేలడం దేశ లౌకిక విధానానికి తీవ్ర విఘాతమని లౌకిక, ప్రజాతంత్ర...

చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతనే జిల్లాలలో పర్యటించాలని లేదంటే చంద్రబాబు నాయుడు పర్యాటనను అడ్డుకుంటామని సిపిఎం నాయకులు కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నాకార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఏ జిల్లా పర్యటనకు వెళ్లిన అక్కడ సమస్యలను పరిష్కరించాలని కోరిన వారిని అరెస్టులు చేయడం పరిపాటిగా మారిందని అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని..తాము సిపిఎం గా సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని జిల్లా కార్యదర్శి శేషబాజ్జి తెలియజేశారు.

Pages