మళ్లీ చింతమనేని హల్‌చల్‌

దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కొల్లేరు అభయారణ్యం నడిబొడ్డున అక్రమంగా రహదారి నిర్మాణం ఈసారి వివాదానికి కారణమైంది. జిల్లా అటవీశాఖ అధికారులు దీనిని అడ్డుకోగా వారిపై ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా మండవల్లి మండలం చింతపాడు నుండి పశ్చిమ గోదావరి జిల్లా యాగనమిల్లి వరకు రహదారి నిర్మాణం చేయడానికి ప్రభాకర్‌ ఇటీవల ప్రయత్నించారు. దీనిని చింతపాడు గ్రామస్తులు అడ్డుకున్నారు.