50 లక్షల మందితో వెట్టిచాకిరి..

రాష్ట్రంలో 65 రకాల ఉత్పత్తి రంగాల్లో 50 లక్షలకుపైగా కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుని ఏడాదికి రూ.500 కోట్ల శ్రమను యజమానులు దోచుకుంటు న్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ తెలిపారు. సిఐటియు కర్నూలు జిల్లా 10వ మహాసభలో పాల్గొనేందుకు ఆదోనికి వచ్చిన ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మిక శాఖ రెండేండ్ల పెరిగే ధరలకను గుణంగా వివిధ సెక్టార్లలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేత నాలు పెంచాలని కోరారు. 15 ఏళ్లుగా కార్మిక శాఖ వేతనాల పెంపుదల జోలికే వెళ్లలేదన్నారు.