District News

బిసి సబ్‌ ప్లాన్‌ అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బిసి సబ్‌ప్లాన్‌, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ కె.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. పెదబొడ్డేపల్లి రామకోవెల వద్ద ఆదివారం జరిగిన డివిజన్‌ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో 50 శాతంపైగా ఉన్న బిసిల్లో అత్యధిక మంది ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు. నిర్థిష్ట, స్థిర ఆదాయాలు లేక దయనీయ పరిస్థితిని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో చేతివృత్తులు, వ్యవసాయం దెబ్బతినడంతో జీవనోపాధి కోల్పోయి దారిద్య్రంలోకి నెట్టబడుతున్నారని వాపోయారు. 
    సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా ప్రభుత్వ రంగం నిర్వీర్యమవుతుందని...

 రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ విమర్శించారు. శుక్రవారం స్థానిక కళాజ్యోతి సర్కిల్‌ వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జీపుజాత ధర్మవరం నుంచి గొల్లపల్లి, ఉప్పునేసినపల్లి, చిగిచెర్ల, ముష్టూరు, బత్తలపల్లి, తాడిమర్రి, రామాపురం మీదుగా ముదిగుబ్బకు చేరుకుని అక్కడినుంచి ధర్మవరానికి చేరుకుంటుందన్నారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాయలసీమను పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ...

రాయలసీమ అభివృద్ధి కోసం ఉధృత పోరాటాలు చేయనున్నట్లు సిపిఎం, సిపిఐ నాయకులు తెలిపారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శనివారం పుట్టపర్తి నియోజకవర్గంలోని పుట్టపర్తి, ఓబుళదేవరచెరువు, నల్లమాడ, బుక్కపట్నం మండలాల్లో కొనసాగింది. 
పుట్టపర్తి అర్బన్‌:రాయలసీమ అభివృద్ధి, ప్రత్యేక ప్యాకేజీ కోసం మార్చి 15న అసెంబ్లీని ముట్టడిస్తామని, ఇందులో అరెస్ట్‌లకు కూడా సిద్ధమని సిపిఎం, సిపిఐ రాష్ట్ర నాయకలు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం బస్సు యాత్ర పుట్టపర్తికి చేరుకుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, రాయలసీమ అభివృద్ధి సబ్‌కమిటీ కన్వీనర్‌ జి.ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ ప్రజలను ఉద్ధేశించి...

నిత్యమూ కరువు దుర్భిక్షానికి నిలయమైన అనంతపురం జిల్లా సమస్యలపై నిలదీసేందుకు తమతో కలసి రావాలని సిపిఎం, సిపిఐ ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. రాయలసీమ వెనుకబాటుతనంపై రెండు పార్టీలు సంయుక్తం చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం రాత్రికే కదిరి పట్టణానికి చేరుకుంది. శనివారం ఉదయం కదిరి పట్టణంలో ప్రారంభమైన బస్సు యాత్ర ఓబుళదేవరచెరువు, నల్లమాడ, బుక్కపట్నం మీదుగా రాత్రికి పుట్టపర్తి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు బస్సుయాత్ర వెళ్లిన సందర్భంలో స్థానిక నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రజానాట్యమండలి కళాకారులు చేపట్టిన ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఓబుళదేవరచెరువులో అంబేద్కర్‌...

రాయలసీమకు తక్షణమే లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం వామపక్షాలు చేపట్టిన బస్సు యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన హక్కు చట్టంలో పేర్కొన్న విధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. వెనుకబడిన రాయలసీమలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ఒకే ఏడాదిలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని...

దేశంలో నెలకొన్న అసహనాన్ని నిరసిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు సాగిన ఈ ర్యాలీలో సిపిఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఒ.నల్లప్ప, సిపిఐఎంఎల్‌ జిల్లా కార్యదర్శి పెద్దన్న, సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్లప్రభాకర్‌ రెడ్డి, ఎస్‌యుసిఐ రాష్ట్ర నాయకురాలు లలితమ్మ, ఆర్‌ఎస్‌పి నాయకులు బాషాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. రాజకీయ స్వార్థం, అధికారం దాహం కోసం మతచిచ్చు, కుల చిచ్చు...

పార్లమెంట్‌ సమావేశాల్లో  ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ మన రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా వుందని,  లైన్లు, స్టేషన్ల ఆధునీకరణకు నిధులు కేటాయింపు లేవ‌ని  సిపిఎం రాష్ట్రకార్య‌ద‌ర్శి వ‌ర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా బెబుతున్న రాజధాని అమరావతికి అన్ని వైపుల‌ నుండి రైల్వే సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుబుతున్న మాటలు భూటకమని ఈ బడ్జెట్‌తో తేటత్లెమయింది. అమరావతికి, గుంటూరు, విజయవాడ తదితర ప్రధాన ప్రాంతాల‌ నుండి కొత్త ట్రైన్స్‌, లైన్లుకు బడ్జెట్‌లో చోటు దక్కలేదు. విజయవాడ నుండి  నాగపట్నం, బెంగులూరు, షిరిడి, ముంబై తదితర ప్రాంతాకు కొత్త రైళ్ళు వస్తాయని ఆశించిన ప్రజకు నిరాశే మిగిల్చింది. రైల్వే ఉద్యోగుల‌ను...

పార్లమెంట్‌ సమావేశాల్లో  ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ మన రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా వుందని,  లైన్లు, స్టేషన్ల ఆధునీకరణకు నిధులు కేటాయింపు లేవ‌ని  సిపిఎం రాష్ట్రకార్య‌ద‌ర్శి వ‌ర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా బెబుతున్న రాజధాని అమరావతికి అన్ని వైపుల‌ నుండి రైల్వే సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుబుతున్న మాటలు భూటకమని ఈ బడ్జెట్‌తో తేటత్లెమయింది. అమరావతికి, గుంటూరు, విజయవాడ తదితర ప్రధాన ప్రాంతాల‌ నుండి కొత్త ట్రైన్స్‌, లైన్లుకు బడ్జెట్‌లో చోటు దక్కలేదు. విజయవాడ నుండి  నాగపట్నం, బెంగులూరు, షిరిడి, ముంబై తదితర ప్రాంతాకు కొత్త రైళ్ళు వస్తాయని ఆశించిన ప్రజకు నిరాశే మిగిల్చింది. రైల్వే ఉద్యోగుల‌ను...

ఢిల్లీ జె.ఎన్.యు.లో స్టూడెంట్ అధ్య‌క్షుడు క‌న్హ‌య్ కుమార్‌ను విడుద‌ల చేయాల‌ని, విద్యార్ధుల‌పై పెట్టిన అక్ర‌మ కేసులు ర‌ద్దు చేయాల‌ని వామ‌ప‌క్ష పార్టీల ఆధ్వ‌ర్యంలో ర్యాలీ, స‌భ నిర్వ‌హించారు. క‌ళాక్షేత్రం వ‌ద్ద నుండి జ‌రిగిన ర్యాలీలో  వామ‌ప‌క్ష పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు,  అభ్యుద‌య వాదులు, ప్ర‌జలు పెద్ద సంఖ్య‌లో పాల్గొని నిర‌స‌న తెలియ‌చేశారు.   విద్యార్దుల‌పై పెట్టిన అ్ర‌క‌మ కేసులు ర‌ద్దు చేయాల‌ని, క‌న్హ‌య్ కుమార్‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని,  యూనివ‌ర్సీటీల‌లో కేంద్ర‌ప్రభుత్వ జోక్యం ఉండ‌రాద‌ని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.   అనంత‌రం లెనిన్  సెంట‌ర్‌లో జ‌రిగిన స‌భ‌లో వామ‌ప‌క్ష పార్టీల నాయ‌కులు మాట్లాడారు. బిజెపి  ప్ర‌భుత్వం  కావాల‌నే...

Pages