ఆర్టికల్స్
ఇదేనా జవాబుదారీతనం?
Sat, 2016-03-05 12:26
ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నిరంకుశ చర్యలపై కాంగ్రెస్, వామపక్షాలు సంధించిన విమర్శనాస్త్రాలతో పూర్తిగా ఆత్మరక్షణలో పడిన ప్రధాని నరేంద్ర మోడీ ఎదురు దాడికి దిగడం దారుణం. పార్లమెంటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని గురువారం లోక్సభలో ఇచ్చిన సమాధానం ప్రతిపక్షాలను కవ్వించే రీతిలో సాగింది. సాధారణంగా ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసేదిగా ప్రధాని సమాధానం వుంటుంది. కానీ, గురువారం నాటి మోడీ సమాధానం దీనికి పూర్తి భిన్నంగా వుంది. విమర్శకు ప్రతి విమర్శ ఎప్పుడూ సమాధానం కాదు. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన వాటిలో అసంబద్ధమైనవి, నిర్హేతుకమై నవి ఏమైనా వుంటే అది వేరు. వాళ్లు...
రాష్ట్రం పట్ల ఎందుకీ వివక్ష?
Wed, 2016-03-02 12:08
మొన్నటికి మొన్న రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రం, నిన్న జనరల్ బడ్జెట్లోనూ అదే తీరున వ్యవహరించింది. రాష్ట్రం పట్ల కేంద్రానికి ఎందుకింత వివక్ష? రాష్ట్రంలో వున్నది తన మిత్రపక్షమైన తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమానా? లేక ఆంధ్రప్రదేశ్ అంటే ఖాతరులేనితనమా? కేంద్రం అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు ఒక ఎత్తు అయితే, ఇది అన్యాయమని తెలిసినా నోరు మెదపకుండా మిన్నకుండిన రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్తత మరో ఎత్తు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి తరువాత మాట్లాడతానని చెప్పడం శోచనీయం. ఇప్పుడు ప్రశ్నించకుండా తరువాత ఎప్పుడో మాట్లాడి ఉపయోగమేమిటి? దేశంలోకెల్లా అత్యంత సమర్థతకలిగిన ముఖ్యమంత్రినని...
జాతి వ్యతిరేకులెవరు?
Fri, 2016-02-19 10:46
ప్రఖ్యాతి గాంచిన ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యా లయంలో వారం రోజుల క్రితం జరిగిన కొన్ని ఘటనలను ఆధారం చేసుకొని విద్యార్థి ఉద్యమాలపైనా, వామపక్షాలపైనా ఆర్యస్ యస్ నాయకత్వంలోని సంఘపరివారం భౌతికంగా, భావజాలపరంగా దాడులు చేస్తోంది. మరో నాలుగురోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ మరణంతో ఉత్పన్నమైన సమస్యల నుంచి తమను తాము కాపాడుకోడానికి ఒక రాజకీయ ఎత్తుగడగా జెఎన్యు ఘటనలకు మసిపూసి మారేడుకాయ చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోం ది. తనను కాదన్న ప్రతి ఒక్కరినీ దేశద్రోహులుగా ముద్రవేసి, తమకు తాము దేశభక్తులుగా ముద్రవేసుకొంటోంది. వారిచ్చే సర్టిఫికెట్తోనే ఈ దేశంలో ఎవరైనా దేశభక్తులుగా చెలామణి కావాలని...
దళితులకు అందని రాజ్యాంగ ఫలాలు..
Wed, 2016-02-10 11:42
ప్రతి భారతీయుడి కంట తడిని తుడిచివేయాలన్న స్వాతంత్య్ర సమరయోధుల ఆకాంక్షలను నెరవే ర్చేందుకు ప్రతి పౌరునికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పిం చాలనే లక్ష్యంతో మన రాజ్యాంగం ఏర్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కులు, రాజ్యాంగ ఫలాలు దళితులకు అందాయా అని ప్రశ్నించుకుంటే ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంది. రాజ్యాంగ ఫలాలు అందక పోగా మిగతా హక్కులను కూడా గుంజుకుం టున్నారని స్పష్టమౌతోంది. దళితులు నేటికీ అమానుషమైన కులవివక్ష, అంటరానితనం, దాడులు, అవమానాలు, సాంఘిక బహిష్కరణలు, హత్యలు, అత్యాచారాలకు గురవుతున్నారు. అగ్రకుల అహంకారానికి బలౌతున్నారు. ఇష్టపడి ఆహారం తినడానికిలేదు. తన భావాలను చెప్పుకునే స్వేచ్ఛలేదు. బయటకు వస్తే దాడులు, అవమానాలు. వీటికి...
చంద్రబాబుకు 'తుని' ఒక హెచ్చరిక
Tue, 2016-02-09 15:41
సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఎదురు దాడికి మించిన ఆత్మరక్షణ లేదన్న సూత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో బాగా ఉపయోగిం చుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఏ సమస్యనైనా తీసుకోండి, అది రాజధాని సమస్యా, పోలవరం సమస్యా లేక రాయలసీమ అభివృద్ధి సమస్యా... ఏదైనా మంచి అంతా తన ఖాతాలో వేసుకోవడం చెడు జరిగితే అధికారుల మీద తోసేయడం, విమర్శలొస్తే ఎదురుదాడికి దిగడం ముఖ్యమంత్రి అనుసరి స్తున్న వ్యూహం. తాజాగా కాపుసామాజిక వర్గం ఆందోళన విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అదే వ్యూహం అనుసరిస్తున్నారు.
రిజర్వేషన్ల పేరుతో రాష్ట్రంలోని కాపులను కూడ దీయడానికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపునకు వచ్చిన స్పందన రాజకీయ పండితులను కూడా ఆశ్చర్యపరిచిందని...
రాజధాని యువత - భరోసా లేని భవిత
Tue, 2016-02-09 15:36
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని శంకుస్థాపన సభలో ''మీరు చేసిన త్యాగానికి ఏం చేసినా తక్కువే'' అని ఆ ప్రాంత ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. వాస్తవంగా కూడా భూమినే నమ్ముకున్న 29 గ్రామాల రైతులు, ఆ భూములపై ఆధారపడ్డ కూలీలు, సంబంధిత ఉత్పత్తితో ముడిబడ్డ చేతివృత్తిదారులు, చిరు వ్యాపారులు మొత్తం ప్రజానీకం తమ భూములను, ఉపాధిని, జీవనాన్ని రాజధాని నిర్మాణం కోసం వదులుకొని (బలవంతంగా అయినా) త్యాగం చేశారు. కానీ నేడు అదే ముఖ్యమంత్రి త్యాగాలకు ప్రతిఫలంగా ఇస్తామన్న హామీలు నెరవేర్చమని ఆందోళన చేస్తున్న వారి పట్ల, మా రాజధానిలో మాకు చోటివ్వండని, మా ఇళ్ళను తొలగించొద్దని కోరుతున్న ప్రజల పట్ల అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ప్రజలనే పనికిమాలిన వాళ్లుగా, అభివృద్ధి...
పెద్దలకు కట్టబెట్టేందుకే...
Mon, 2016-02-08 12:47
గత సంవత్సర కాలంగా 9/77 అసైన్డ్ చట్ట సవరణపై చర్చ జరుగు తున్నది. ముఖ్యమంత్రి, మంత్రులు నిరంతరం ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. త్వరలో ఈ చట్టాన్ని సవరిస్తామని, అసైన్డ్ భూములకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని కలెక్టర్లకు ఉత్తర్వులు అందినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చట్ట సవరణపై చర్చిస్తామని ముఖ్య మంత్రి ప్రకటించటంతో మరీ వేడెక్కింది. ఈ చట్టం ఉద్దేశం ఏమిటి? ఎవరి రక్షణ కోసం ఈ చట్టం వచ్చింది? ఇప్పుడు ఈ చట్టాన్ని ఎందుకు సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉబలాట పడుతోందనేదాన్ని పరిశీలించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం 9/77 చట్టాన్ని సవరించింది. నాడు ఈ చట్ట సవరణకు సిపిఐ(యం) శాసనసభ్యులు అసెంబ్లీలో గట్టిగా...
ఆర్ఎస్ఎస్ను ప్రజలే తిరస్కరించాలి..
Thu, 2016-02-04 11:13
స్వాతంత్రనంతర చరిత్రలో సత్ప్రవర్తనతో ఉంటానని వ్రాత పూర్వకమైన హామీ ప్రభుత్వానికిచ్చి పనిచేస్తున్న ఒకే ఒక్క సంస్థ ఆర్ఎస్ఎస్. సరిగ్గా 68 సంవత్సరాల క్రితం 1948 ఫిబ్రవరి 4న ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు)ను నాటి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత మరి రెండుసార్లు ఆర్ఎస్ఎస్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఒకసారి 1975 అత్యవసర పరిస్థితిలో, 1993లో బాబరీ మసీదును కూల్చినప్పుడు. పైకి ఏమి చెప్పినా, వ్రాత పూర్వకంగా క్షమార్పణలు చెప్పినా ఆర్ఎస్ఎస్ స్వభావంలో ఎటువంటి మార్పులేదని చరిత్ర నిరూపిస్తున్నది. ప్రస్తుతం అది మరింత శక్తివంతంగా తయారై తన ఫాసిస్టు భావజాలాన్ని విరజిమ్ముతున్నది. అనేక మంది మధ్యతరగతి మేధావులు దాని...
అభివృద్ధి మంత్రం - అసలు తంత్రం!
Mon, 2016-01-25 13:05
ఈ మధ్య విజయవాడ పుస్తక ప్రదర్శనలో ప్రసంగించిన తర్వాత నాతో మాట్లాడిన వారిలో ఇద్దరు విద్యాధికులు ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగం ప్రధాన భాగాన్ని అభినందిస్తూనే అమరా వతిని భ్రమరావతి అని వర్ణించడం ఎందు కని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేస్తే మంచిదే కదా అని అడిగారు. అమరావతిపై అనేకసార్లు ఈ శీర్షికలో చెప్పుకున్నాం. మొన్నటి మంత్రి వర్గ సమావేశం తర్వాత ఒక సీనియర్ మంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రి సింగపూర్పై చాలా ఆశలు పెట్టుకున్న మాట నిజమైనప్పటికీ వారి నుంచి అంత సహకారం రాలేదని చెప్పారు. ఈ కారణంగా హడ్కో రుణ సహాయంతో తామే నిర్మాణం చేపట్టవచ్చని సూచించారు. సింగపూర్పై ఆయన పెట్టుకున్న భ్రమలే పటాపంచలైనప్పుడు ఆయన ప్రజలకు...
రాయలసీమ వెనుకబాటుకు కారకులెవరు?
Fri, 2016-01-22 10:35
స్వార్థ రాజకీయమే సీమకు శాపం అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం ప్రచురిత మైంది. శీర్షికకు పెట్టిన పేరు అక్షరసత్యం. అయితే రచయిత వ్యాసం నిండా అర్థసత్యాలు, అసత్యాలు తప్ప ఏ ఒక్కటీ నిజం కాదు. చంద్ర బాబు అధికారానికి వచ్చిన తర్వాత అహరహం వెనుకబడిన సీమ అభివృద్ధి కోసమే కష్టపడుతు న్నట్లు చెప్పారు. ఆర్థిక, పారిశ్రామిక, మౌళిక సదుపాయాల కొరకు ఆర్థిక ఇబ్బందులలో కూడా అడ్డంకులను అధిగమించి కృషి చేస్తున్నార న్నారు. ఆర్థిక వికేంద్రీకరణను గురించి ప్రస్తావిస్తూ రాయల సీమలో పారిశ్రామికీకరణకు కృషి చేస్తున్నట్లు అందులో పేర్కొ న్నారు. గతంలో చంద్రబాబు పాలనలోనే రాయలసీమ లోని భారీ పరిశ్రమలైన సహకార చక్కెర ఫ్యాక్టరీలు, కార్బైడ్ ఫ్యాక్టరీ లు, పేపర్ మిల్లులు, నిజాం...
బలమైన సిపిఐ(ఎం)ను నిర్మిద్దాం..
Tue, 2016-01-12 13:03
ఇరవైఒకటవ పార్టీ మహాసభ ఆదేశాల మేరకు సిపిఐ(ఎం) ప్లీనం సమావేశమయింది. తన పనిని '2015 చివరికల్లా' పూర్తిచేసింది. కేవలం ఎనిమిది నెలల కాలంలో పార్టీ మహాసభ ఆదేశాలను సిపిఐ(ఎం) నెరవేర్చ గలగటం గౌరవప్రదమైన విజయం. ప్లీనం నిర్వహించటానికి ఒక సమగ్రమైన, సవివర మైన విధానాన్ని, టైంటేబుల్ను పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత పార్టీ నిర్మాణం, పనితీరులను గురించి రాష్ట్ర కమిటీల నుంచి విస్తృత సమాచారాన్ని సేకరించటం కోసం ఒక వివరణాత్మక మైన ప్రశ్నావళిని పార్టీ కేంద్రం రూపొందించింది. రాష్ట్ర కమిటీ లు పంపిన సమాధానాలను పరిశీలించిన మీదట వాటి ఆధారంగా నిర్మాణంపై 'ముసాయిదా నివేదిక', 'ముసాయిదా తీర్మానం'లను తయారు చేసింది. పార్టీ మహాసభకు, ప్లీనం జరగటానికి మధ్యకాలంలో...
నల్లధనమా! నువ్వెక్కడీ
Tue, 2016-01-12 12:43
నల్ల కుబేరులు, స్విస్ బ్యాంకు, హవాలా, విదేశీ బ్యాంకు ఖాతాలు వగైరా మాటలు రోజూ పేపర్లు, టీవీ ఛానెళ్లలో చూసీ చూసీ, వినీ వినీ నవ్వాలో, ఏడవాలో తెలియని స్థిలో ఉన్నాం మనం. నేను ఒక పల్లెటూరి రైతును నల్ల ధనం అంటే ఏమిటని అడిగితే దొంగ నోట్లు అని ఠక్కున సమాధానమిచ్చాడు. ఆయన్ని చూసి నవ్వుకునే పరిస్థితిలో మనమేమీ లేము. ఎందుకంటే మనమూ అంతే అమాయకత్వంతో, తెలివితక్కువతనంతో ఆలోచిస్తు న్నాం. నేను ఇంటర్ విద్యార్థిగా ఉన్న రోజుల్లో (1996) మధ్యతరగతి అభిమాన నాయకులు వాజ్పేయి తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారి పేర్లు బయటపెడతామంటే నమ్మి తెరిచిన నోరు ఇప్పటికీ మూతబడలేదు. నాటి నుంచి నేటి దాకా నోరు తెరుచుకుని మనం చూస్తూనే...