ఆర్టికల్స్

మానవతా మూర్తులు

'ఆరోగ్యమే మహా భాగ్యం' అన్నారు పెద్దలు. ఆ ఆరోగ్యం కాపాడుకోవడమనేది అంత తేలికైన విషయమేమీ కాదు. నేటి ఆధునిక కాలంలో విద్య, ఉద్యోగ వత్తిడులు, సంఘర్షణలు, నగరీకరణ, కాలుష్యం, పర్యావరణ క్షీణత, కల్తీలు వంటి అనేక ఒత్తిడులతో పాటు కార్పొరేటీకరణ తెచ్చిన ప్రమాదం, ప్రకృతి వనరుల దోపిడీ మనిషి అనారోగ్యానికి కారణమౌతున్నాయి. ఆధునిక పోకడలు పెరిగిపోతున్న కొద్దీ మనిషి శరీరంలో రోగనిరోధక శక్తి రోజురోజుకు తగ్గుతోంది. ప్రస్తుతం మానవాళిని వేధిస్తున్న అనేక ఆరోగ్య సమస్యలతో పాటు రోజుకో కొత్త వైరస్‌ పుట్టుకొచ్చి, మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోంది. వీటికి మానవ తప్పిదాలే చాలా వరకు కారణం. ఎవరైనా దగ్గినా తుమ్మినా దూరంగా జరిగే రోజులివి. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ...

ఏ దేవుడూ ఏ వైరస్‌ని నిర్మూలించలేడు !

దేశంలో కేంద్రప్రభుత్వం పౌరసత్వ చట్టం తెచ్చింది. మత ప్రాతిపదికన జనాన్ని విడగొట్టడం ప్రజలకు నచ్చలేదు. కుల, మత, ప్రాంతీయ బేధాలు, ఆర్థిక స్థోమతలు పక్కనపెట్టి దేశమంతా ఒక్క గొంతై తన నిరసనను తీవ్రంగా వెలిబుచ్చింది. మానవత్వమే వెన్నెముకై దేశమంతటా వందల షాహీన్‌బాగ్‌లు వెలిశాయి. వెనువెంటనే దేశంలోకి కరోనా వైరస్‌ వ్యాపిస్తూ వచ్చింది. అన్ని మతాల దేవుళ్ళూ తలుపులు మూసుకున్నారు. అప్పుడు మళ్లీ కుల, మత ప్రాంతీయ బేధాలు, ఆర్థిక స్థోమతలు పక్కకు తొలగిపోయాయి. మనుషులంతా ఒక్కటిగా నిలిచారు. మానవత్వమే వెన్నెముక అయిన వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. విచారించవల్సిన విషయమేమంటే మన పాలకులు గానీ, అధికారులు గానీ, మీడియా గానీ ఎవరూ సూక్ష్మక్రిమి అన్వేషకులను...

పెద్దన్నకు కార్పొరేట్‌ ప్రయోజనాలే ప్రధానం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌! కరోనా వైరస్‌ తీవ్రతను పట్టించుకోని అగ్రరాజ్య అధిపతి!! చైనా, ఇటలీ తరువాత మూడో స్థానంలోకి చేరిన అమెరికా!!! 228 ఏళ్ల న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ చరిత్రలో తొలిసారిగా సోమవారం నాడు వాణిజ్య కేంద్రం మూసివేత. ఉద్దీపన పథకానికి సెనెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. దాంతో ఫెడరల్‌ రిజర్వు (రిజర్వు బ్యాంకు వంటిది) రంగంలోకి అప్పులు, ఇతర ఆస్తులను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దాంతో ఆసియా లోని స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఇది ఎంతకాలం పతనాన్ని ఆపుతుందన్నది ప్రశ్న. ఒకవైపు గంట గంటకూ అమెరికాలో వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. అయినా 'వ్యాధి తీవ్రత కంటే చికిత్స కఠినంగా ఉండకూడదు. పదిహేను రోజుల తరువాత ఏ మార్గంలో...

నిర్లిప్తత వీడండి !

కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం అస్త్ర విన్యాసమెరుగక బరిలోకి దూకిన సైనికుడిని తలపిస్తోంది. లాక్‌డౌన్‌ కష్టాలతో ఆర్థికంగా చితికిపోయిన కష్టజీవులను ఆదుకోవడం మొదలుకొని కరోనా పోరులో కీలకమైన వైద్య సిబ్బందికి అండగా నిలవడం వరకూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కోవిడ్‌పై పోరు సల్పుతూ ప్రజల దృష్టిలో దేవుళ్లుగా మారిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, పోలీసుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సబబుగా లేదు. వైద్యులకు, పారా మెడికల్‌ సిబ్బందికి కనీస రక్షణ కిట్లను కూడా సరిపడ అందించకపోవడం ఆందోళనకరం. సోదర రాష్ట్రమైన తెలంగాణలో వీరి సేవలను ప్రశంసిస్తూ పూర్తి వేతనాన్ని ఇవ్వడంతో పాటు, అదనపు పారితోషికం ఇచ్చి...

చైనాపై తప్పుడు ప్రచారాలు, సమాధానం లేని ప్రశ్నలు!

హాలీవుడ్‌ సినిమాల్లో గొరిల్లాల మాదిరి కరోనా తమ ముంగిటికి వచ్చినప్పటికీ గుర్తించలేని మతి తప్పిన స్థితిలో కొందరు ఉన్నారు. వారిలో ట్రంప్‌ ఒకరు. మన దేశంలో కొందరు మడి కట్టుకున్న మాదిరే ప్రపంచంలో తమను ఏ వైరస్‌లు అంటుకోవు అనే దురహంకారులు ప్రపంచమంతటా ఉన్నారు. చైనాలో దాన్ని అరికట్టినా అక్కడ వెలువడుతున్న కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారిలో తప్ప స్థానికుల్లో కొత్త కేసులు లేవు. అనేక మంది ఈ వార్తలను నమ్మటం లేదు. 'స్వయం కృతం అని, తన గోతిలో తానే పడిందని, తయారు చేసి ప్రపంచం మీదకు వదలింద'ని ఇలా చైనా గురించి తప్పుడు ప్రచారాలన్నీ చేసిన వారు, బుర్రకు పని పెట్టకుండా వాటిని గుడ్డిగా నమ్మినవారు చైనాలో వైరస్‌ను అరికట్టటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇది కరోనా...

జెఎన్‌యు @ కోవిడ్‌-19

కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, మెజారిటీ ప్రయోజనాలకు తలొగ్గిన అయోధ్య తీర్పు, జెఎన్‌యు హాస్టల్‌ ఫీజు పెంపు, క్యాంపస్‌లో విద్యార్థులపై ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాల పాశవిక దాడి, ఢిల్లీ అల్లర్ల మధ్య తీసుకొచ్చిన సిఎఎ-2019 చట్టం...వంటి అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా జెఎన్‌యు తన అసమ్మతిని వ్యక్తం చేసింది. విద్యార్థులు అనేకానేక నిరసన ప్రదర్శనలు, అధికారిక విజ్ఞప్తులు చేశారు. పార్లమెంటు వరకు పాదయాత్రలు చేశారు. విచక్షణా రహితంగా సాగిన పోలీసు లాఠీచార్జి, నీటి ఫిరంగుల ప్రయోగం, నిర్బంధాల నడుమ...మండుటెండలను, వణికించే చలినీ లెక్కచేయక...మిట్టమధ్యాహ్నాలు, అర్థరాత్రుళ్లన్న బేధం లేకుండా...క్యాంపస్‌ లోపల వెలుపల విద్యార్థులు చేసిన నినాదాలు ప్రతిధ్వనించాయి. విభిన్న...

వొట్టి మాటలకే పరిమితమా?

 ముఖ్యమంత్రులతో గురువారంనాడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ లాక్‌డౌన్‌ సందర్భంగా రాష్ట్రాలు చేపట్టిన చర్యలను ప్రశంసిస్తూనే ఉపసంహరణ చర్యలు ఒకే విధంగా వుండాలని కోరడం, మరోవైపు చాలామంది సి.ఎం లు ఆర్థిక కష్టాలను ఏకరువు పెట్టి అదనపు నిధుల కోసం విజ్ఞప్తి చేయడం నేడున్న క్లిష్ట పరిస్థితులకు, గత పది రోజుల పరిణామాలకూ ప్రతిబింబమే! ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రధాని ఏకపక్షంగా జనతా కర్ఫ్యూను, అనంతరం లాక్‌డౌన్‌ను ప్రకటించినా దాన్ని దేశ ప్రజలంతా మంచి స్ఫూర్తితో ఆచరించారు. అయితే ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలనడమేగాక రాష్ట్ర, జిల్లా సరిహద్దులు మూసివేయడంతో కోట్లాదిమంది వలస జీవులకు తీవ్ర ఇక్కట్లు ఎదురు కాగా, నిత్యావసర సరుకుల సరఫరాకు కూడా...

ట్రంప్‌ రాజ్యంలో కరోనా

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ 'కరోనా వైరస్‌ అనేది ఒక సామాన్య ఫ్లూకి సరిసమానం' అని మొదట ప్రకటించారు. మార్చి 4న ఒక టీవీ చానల్‌లో మాట్లాడుతూ.. 'కరోనా వైరస్‌ అనేది ఫ్లూ అంత ప్రమాదకారి కాదు. సాధారణ ఫ్లూ కారణంగా సంవత్సరానికి 27,000 నుంచి 77,000 మంది చనిపోతుంటారు' అని కూడా సెలవిచ్చారు. ఒక వారం తరువాత 'నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌' డాక్టర్‌ ఆంటోని ఫ్లూసీ అమెరికా కాంగ్రెస్‌లో మాట్లాడుతూ 'కరోనా వైరస్‌ వలన మరణాలు సాధారణ ఫ్లూ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటాయని' చెప్పారు. ఫ్లూ వలన జరిగే మరణాలు 0.1 శాతం ఉంటే, కరోనా వైరస్‌ వల్ల 3.4 శాతం ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) వెల్లడించింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు కోవిడ్‌-19 పట్ల ట్రంప్‌ ఎంత...

పేదల ఆశలు, ఆత్మగౌరవాన్ని దిగజారుస్తున్న ప్రభుత్వం

నేను కరోనా వైరస్‌ వల్ల చనిపోను. దానికన్నా ముందు ఖచ్చితంగా ఆకలితో చనిపోతాను' ఈ మాటలు పాత ఢిల్లీలో ఒక చిన్నపాటి సంఘీభావ కార్యక్రమంలో వినబడ్డాయి. కొద్దిమంది మిత్రులతో కలిసి ఒక వెయ్యి మంది అనాథలకు భోజనాలు ఏర్పాటుచేసే ప్రయత్నంలో అనేకమంది ప్రజలు వెలిబుచ్చిన ఈ ద్ణుఖపూరిత మాటలను నేను పన్నెండుసార్లకు పైగా విన్నాను. 'పెద్దనోట్ల రద్దు వలన పడిన బాధలు, ఇప్పుడు మనం అనుభవిస్తున్న బాధతో పోలిస్తే పెద్ద లెక్కలోని విషయమే కాద'ని ఇంకొక వ్యక్తి అన్నాడు.ఒక గంట తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహాయక చర్యల ప్రకటనను నేను ఆందోళనగా చదివి, నిరాశ చెందాను. కరోనా వైరస్‌ సోకకుండా ఉండడానికి చేపట్టిన 'లాక్‌డౌన్‌' ఫలితంగా ఏర్పడిన ఆర్థిక ప్రభావం నుంచి ప్రజలను...

కాంతిరేఖ క్యూబా

అంధకారంలో చిక్కుకున్న ప్రపంచానికి క్యూబా ఓ కాంతిరేఖ. భయోత్పాతంలో ఉన్న మానవాళికి ఓ ధైర్యం. ఆపదలో ఉన్న దేశాలకు కొండంత అండ! ప్రపంచ పటంలో కష్టపడి వెతికితేకాని కనిపించని ఓ చిన్న దేశం క్లిష్ట సమయంలో నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించడం సామాన్యమైన విషయం కాదు. అది కూడా, అమెరికా వంటి అగ్రదేశం కాడి పడేసి, కరోనా (కోవిడ్‌-19) కాటుకు దిక్కుతోచక విలవిలలాడుతున్న వేళ ఆ రక్కసితో ధైర్యంగా పోరాడటమే కాకుండా అనేక దేశాలకు వైద్య బృందాలను పంపడం, ఔషధాలను సరఫరా చేయడం క్యూబాను వర్తమాన ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపించడంతో అత్యధిక మరణాలు చోటు చేసుకుంటున్న ఇటలీతో పాటు అనేక దేశాలకు క్యూబా సాయం చేస్తోంది. వెనిజులా, నికరాగువా,...

కౌలు రైతుకు భరోసా ఏదీ?

రైతు భరోసా నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఒబిసి మైనారిటీలకు చెందిన కౌలు రైతులకు మాత్రమే సహాయం అందుతుంది. అగ్ర కులాల్లోని పేద రైతులు ముందుగా మినహాయించబడ్డారు. తరువాత మిగిలిన వారిలో ఆ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, ఆదాయ పన్ను చెల్లిస్తున్నా ఈ సహాయం అందదు. అన్నదమ్ములో, తండ్రీ కొడుకులో ఒకే కుటుంబం అన్న పేరుతో కోత పెడుతున్నారు. దరఖాస్తులన్నీ ఇలా ఒడపోసి ఐదవ వంతుకు తగ్గిస్తే ఉన్న వాటికి భూ యజమాని సంతకం లేదు కాబట్టి వాటిని పక్కన పెట్టేశారు. ఈ అవాంతరాలన్నీ దాటుకొని ఎంత మందికి భరోసా సహాయం దక్కుతుందో చూడాలి. ఇప్పటి వరకు నమోదు కానివారు నవంబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది కౌలు రైతుల్లో ఉన్న ఆందోళనను...

లాభాలు పెద్దలకు-రోగాలు ప్రజలకు..

చంద్రబాబు ప్రభుత్వం రెండంకెల అభివృద్ధి జపం చేస్తున్నది. రెండంకెల అభి వృద్ధి సాధన కోసం ఎన్నుకున్న రంగా ల్లో కీలక మైనది ఆక్వారంగం. రాష్ట్రంలో ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా ఆక్వా సాగును ప్రోత్సహిస్తా మని, రాష్ట్రాన్ని ఆక్వా హబ్‌గా మారుస్తామని ప్రభుత్వం ప్రకటిం చింది. కోస్తా ప్రాంతాల్లో ముఖ్యం గా పై మూడు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అధికారికంగానూ, అనధికారికం గానూ లక్షలాది ఎకరాలు చేపలు, రొయ్యల చెరువు లుగా మారాయి. ఇంకా మారుతు న్నాయి. అన్నపూర్ణగా పేరొంది, దేశానికే తిండి గింజలను అందించే కృష్ణా, గోదావరి డెల్టాల్లోని వరిచేలు నేడు చేపలు, రొయ్యల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఆక్వాసాగు ప్రజల...

Pages