ఆర్టికల్స్
కరోనాపై పోరు-రెండు వ్యవస్థల తీరు
Sat, 2020-04-11 10:11
అతి చిన్నదే, అయినా కరోనా వైరస్ ప్రాణాంతకమైనది. ఈ 21వ శతాబ్దంలో రెండు సామాజిక వ్యవస్థలైన పెట్టుబడిదారీ విధానం, సోషలిజం మధ్య గల తేడాను ప్రస్ఫుటంగా మరోసారి కనపరిచింది. ప్రపంచవ్యాప్తంగా దేశాలను అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్ను కొన్ని దేశాలు ఎదుర్కొన్న తీరు ఈ తేడాను ప్రముఖంగా చూపిస్తోంది. ఒకవైపు-ప్రపంచం లోనే అతి శక్తివంతమైన సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ దేశమైన అమెరికా వుంది. ప్రైవేటీకరించిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ వుంది. కార్పొరేట్ సంస్థలు నిర్వహించే ఆరోగ్య రంగం లాభాల దిశగా పయనిస్తోంది. కానీ, కరోనా వంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు సమర్ధవంతంగా ఎదుర్కొనడంలో ఈ వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. పైగా ఆస్పత్రుల్లో పడకలు, ఐసియు లు, వెంటిలేటర్లు,...
వేగుచుక్క వుహాన్
Sat, 2020-04-11 10:02
అత్యంత సూక్ష్మ రూపంలో ఉండే కరోనా వైరస్ నేడు విశ్వ మానవాళికి పెను సవాలు విసురుతూ అతి పెద్ద శత్రువుగా పరిణమించింది. అణ్వాయుధ దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అణగారిన దేశాలు అనే తేడా లేకుండా ప్రపంచమంతా వ్యాపిస్తూ హడలెత్తిస్తున్న ఈ మహమ్మారిపై చైనాలోని వుహాన్ నగరం విజయం సాధించింది. ఇది ఈ వైరస్పై మానవాళి సాగిస్తున్న పోరాటంలో దక్కిన తొలి విజయం. ప్రజలు, ప్రజా సంక్షేమం కోరే పాలకులు ఉమ్మడిగా పట్టుబడితే ఎంతటి భయంకరమైన శత్రువైనా పాదాక్రాంతం కాకతప్పదనేందుకు వుహాన్ తార్కాణంగా నిలుస్తోంది. కరోనా మొట్టమొదట వెలుగుచూసిన హ్యుబెయి ప్రావిన్స్ లోని వుహాన్లో 76 రోజుల లాక్డౌన్కు బుధవారం తెర దించడం అక్కడి ప్రజలకే గాక విశ్వజనులందరికీ అమితానాందం...
కేంద్రం సాయం చేయదు...అప్పు తీసుకోనివ్వదు...
Fri, 2020-04-10 14:59
లాక్డౌన్ కారణంగా కేరళ రాష్ట్రానికి ఏమేరకు ఆర్థిక నష్టం వాటిల్లుతుందని మీ అంచనా!
మాకు సాధారణ పరిస్థితులలో ఉండే ఆదాయాలలో కన్నా 20 శాతం తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నాం. లాక్డౌన్ కారణంగా జిఎస్టి వలన వచ్చే ఆదాయం సహజం గానే రాదు. మేం లాటరీలు నిలిపివేశాం. కేరళలో మందు దుకాణాలు మూసివేశాం. మోటార్ వాహనాల అమ్మకాలు లేవు. భూ లావాదేవీలు దాదాపుగా నిలిచిపోయాయి. ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేసినా రాబోయే మూడు నెలలలో ఇదివరకటి ఆదాయంలో సగానికి సగం తగ్గుదల ఉంటుంది. మొదటిగా లాక్డౌన్ మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రెండు, లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే యథాస్థితి రాదు. మూసివేసిన చిన్న పరిశ్రమల పరిస్థితి ఏమవుతుందో చెప్పలేను. పర్యాటకం లాంటివి...
కరోనాపై పోరు - నేర్పుతున్న పాఠాలు
Fri, 2020-04-10 14:53
కరోనా వైరస్ మహమ్మారి మన సామూహిక జీవనంలోని అత్యంత తీవ్రమైన సమస్యలనూ, దాని ప్రధాన వైరుధ్యాలనూ బట్టబయలు చేసింది.ఎంత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టినా కొనలేని ఎన్నో వస్తువులు ప్రపంచంలో ఉన్నాయనీ, ''మార్కెట్ అదృశ్య హస్తం'' మీద ఆధారపడి పరిష్కరించలేని అత్యంత కష్టతరమైన సమస్యలెన్నో ఉన్నాయనీ, జనానికి 'హఠాత్తుగా' తెలిసివస్తున్నది. అంతే కాదు, ఆ సమస్యలను మనం ఒంటరిగా పరిష్కరించలేమని కూడా తెలిసివస్తున్నది. మన ప్రపంచమంతా ఒకటేననీ, దాన్ని రక్షించడానికి అందరమూ కలిసి పని చేయవలసిందేననీ తెలిసి వస్తున్నది. క్వారంటైన్ లూ, కలవకుండా ఉండడాలూ ఎంత ముఖ్యమైనప్పటికీ, ఈ మహా విపత్తును ఓడించాలంటే మనందరమూ కలిసి, ప్రపంచమంతా ఒకటిగా, ఉమ్మడిగా పని చేయవలసిందేననీ తెలిసివస్తున్నది....
మరిన్ని చర్యలు కావాలి..
Fri, 2020-04-10 14:49
కరోనా వైరస్ నిర్ధారణకు అవసరమైన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు రాష్ట్రంలో బుధవారం నుండి అందుబాటు లోకి రావడం స్వాగతించదగింది. అవి కూడా విశాఖ మెడ్టెక్ జోన్లో తయారుకావడం ముదావహం. రక్త నమూనాకు కరోనా వైరస్ ఫలితం రావడానికి ప్రస్తుతం దాదాపు తొమ్మిది గంటల సమయం పడుతుండగా ఈ కిట్ల ద్వారా కేవలం 55 నిమిషాల్లోనే తెలియనుండడం గమనార్హం. అక్కడే వెంటిలేటర్ల తయారీ కూడా ప్రారంభమైంది. వ్యక్తిగత భద్రత పరికరాలు (పిపిఇలు) కూడా రాష్ట్రం లోనే తయారవుతున్నాయి. కరోనా నివారణా చర్యల్లో స్వయంపోషక దిశగా రాష్ట్రం ముందడుగు వేయడం శుభ పరిణామం. ప్రైవేటు రంగంలో పని చేస్తున్న అనేక మంది స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టుల సేవలను వినియోగిస్తున్న ప్రభుత్వం 58 ప్రైవేటు ఆసుపత్రులలో...
లాక్డౌన్ - అనుభవాలు
Thu, 2020-04-09 13:01
దేశంలో ఈ లాక్డౌన్ కాలంలో మనం కొన్ని అంశాలను గమనించవచ్చు. మొదటిది, భారతదేశ ప్రజలంతా ప్రభుత్వ సూచనలను అనుసరించడం ద్వారా తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆకస్మికంగా ప్రకటించిన లాక్డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తినప్పటికీ, కరోనా మహమ్మారిని నిరోధించేందుకు ప్రజలంతా ఐక్యంగా తమ పాత్రను పోషిస్తున్నారు.దేశ వ్యాప్తంగా సాధ్యాసాధ్యాల మేరకు భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్టు) కార్యకర్తలు, పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు, ఇతర ప్రజాసంఘాల కార్యకర్తలు...నిరాశలో, అవసరాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం మనకు ప్రోత్సాహకరమైన మరొక అనుభవం. ఎర్రజెండా ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేసే చిహ్నంగానే ఉంటుంది.ఈ కాలంలో ప్రతికూలమైన విషయం ఏమంటే... దేశ ప్రజల మాదిరిగా, మన కేంద్ర...
కరోనా మహమ్మారి... చైనా చికిత్సా విధానం...
Thu, 2020-04-09 12:57
కరోనా సోకిన రోగి డాక్టర్ మీద వాంతి చేసుకుంటే ఏం చెయ్యాలి? క్వారంటైన్ లో వాంతి చేసుకుంటే ఏం చేయాలి? ఆపరేషన్ జరుగుతున్న సమయంలో వైరస్ నిండిన రక్తం చిందితే ఏం చేయాలి? ఆస్పత్రిలో వైరస్ సోకిన ప్రాంతానికి, సురక్షిత ప్రాంతానికి మధ్య తేడాను ఎలా పాటించాలి? ఎటువంటి అనుమానితులను వైద్య పరీక్షలకు ఎంపిక చేసుకోవాలి? కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారిని ఎలా అప్పగించాలి?గత మూడు నెలలుగా ముందు వరుసలో నిలబడి పని చేసిన డాక్టర్లు, నర్సుల అనుభవాలను క్రోడీకరించి...ప్రపంచ దేశాలకు ఉపయోపడే విధంగా చైనా ఒక నివేదిక విడుదల చేసింది. పై ప్రశ్నలకు సమాధానం అందులో లభిస్తుంది. నివేదిక లోని పలు అంశాలను 'బిజినెస్ స్టాండర్డ్' దినపత్రిక ధారావాహికగా ప్రచురించే ప్రయత్నంలో...
అంతా వ్యాపారమేనా..?
Thu, 2020-04-09 12:08
కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఐపిఎల్ మ్యాచ్లను ఎలాగైనా నిర్వహించేందుకు బిసిసిఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) సన్నాహాలు చేస్తోందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్చి నెలలో ప్రారంభం కావాల్సిన ఐపిఎల్ 2020 మ్యాచ్లు దేశవ్యాప్త లాక్డౌన్లో భాగంగా ఏప్రిల్ 14 వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో లాక్డౌన్ను ఎత్తివేయాలా? సడలించాలా? కొనసాగించాలా? అన్న విషయమై చర్చోపచర్చలు సాగుతున్నాయి. అనేక రాష్ట్రాలు మరికొద్ది రోజులు కొనసాగించాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందన్న విషయంలో స్పష్టత లేదు. ఈ చర్చ సాగుతుండగానే 'ఆలూ...
హై హై నాయకా!
Tue, 2020-04-07 12:53
మనం ఒక యుద్ధంలో ఉన్నాం. అందరమూ సైనికులమే. మన అందరి శక్తి సామర్థ్యాలనీ కలబోసి యుద్ధంలో శత్రువు మీద విజయం సాధించేలా సైన్యాన్ని నడపవలసిన బాధ్యత సేనా నాయకుడిదే. అతగాడేం ఆదేశించినా మనం పాటిస్తాం. ఇందులో సందేహం లేదు. మార్చి 22న నాయకుడు జనతా కర్ఫ్యూ పాటించాలన్నాడు. పాటించాం. చప్పట్లు కొట్టమన్నాడు. చప్పట్లే కాదు, శంఖాలూ మోగించాం. తాళాలు, బాజాలు వాయించాం. మోత మోగించాం. నాలుగ్గంటలన్నా వ్యవధి ఇవ్వకుండానే లాక్డౌన్ పాటించమన్నాడు. పాటిస్తున్నాం. ఎన్ని లక్షల మంది కాలినడకన లాంగ్మార్చ్లు చేయాల్సి వచ్చిందో లెక్క లేదు. అయినా నడిచారు. బహుశా ఇంకా కొందరు నడుస్తూనే ఉన్నారు కూడా. రాష్ట్రాల సరిహద్దుల దగ్గర వాళ్లని నానా యాతనలు పెట్టారు. బందెల దొడ్లో పశువుల్ని...
విషాదంలో వలస కార్మికులు
Tue, 2020-04-07 12:51
కోవిడ్-19 మరణాల కంటే స్వగ్రామాలకు బయలుదేరి మార్గమధ్యంలో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. స్వగ్రామాలకు వస్తుండగా 40 మంది పేదలు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మాసాల గర్భణితో సహా సహరాన్ పూర్ నుంచి వంద కిలోమీటర్ల కాలినడకన బయలుదేరిన వలస కార్మిక కుటుంబాన్ని 50 కిలోమీటర్లు తర్వాత ప్రజలు ఆదుకొని అంబులెన్స్లో సొంతూరుకు పంపారు. నాగపూర్ నుంచి కాలినడకన చెన్నై బయలుదేరిన వలస కార్మికుడు హైదరాబాద్ శివారులో గుండెపోటుతో మరణించాడు. తొమ్మిది నెలల నిండు గర్భిణీ కాళీబారు దీ అలాంటి గాధే. ఉత్తరప్రదేశ్ లోని మధుర నుంచి కాలినడకన బయలుదేరి మధ్యప్రదేశ్ లోని స్వగ్రామానికి...అనేక అవస్థలు పడుతూ ఐదు ట్రక్కులు మారి...ఏప్రిల్ 1న ఇంటికి చేరింది. ఇలాంటి వలస...
వాస్తవాలను దాచిపెడితే విశ్వసనీయత ఏముంది?
Tue, 2020-04-07 12:48
ప్రపంచ వ్యాపితంగా ప్రభావం చూపుతున్న ఈ అంటువ్యాధి వల్ల ఆర్థికంగా కలిగే నష్టాల గురించి చాలా చర్చ జరుగుతోంది. కానీ, ప్రజాస్వామిక వాతావరణాన్ని కుదించడం వల్ల జరిగే కీడు గురించి అంతగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. అసోం దగ్గర నుంచి అమెరికా దాకా నిరంకుశ పోకడలు ఎలా పెరిగిపోతున్నాయో చూస్తున్నాం. కరోనాను సాకుగా చూపి హంగరీ ప్రధాని, పచ్చి మితవాది విక్టర్ ఓబ్రాన్ తప్పుడు సమాచారం ఇచ్చే వారిని జైలుకు పంపడంతో సహా పలు క్రూరమైన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించే చట్టాన్ని పార్లమెంటరీ ఆమోదానికి పెట్టారు. డిక్రీల ద్వారా పాలన సాగించేందుకు ఎమర్జెన్సీని రుద్దారు. ఈ అత్యయిక పరిస్థితికి నిర్దిష్ట గడువు అంటూ ఏమీ లేదు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్యుటెర్టే కరోనా లాక్...
మత విద్వేషాలకు తావివ్వొద్దు
Tue, 2020-04-07 12:06
కరోనా మహమ్మారిపై జాతి యావత్తూ ఒక్కటై పోరాడుతున్న వేళ దానిని బలహీనపరిచేలా కొన్ని స్వార్థపర శక్తులు యత్నించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ శతాబ్దం లోనే అతి భయంకరమైన శత్రువుతో ప్రపంచం పోరాడుతోంది. మన దేశంలో దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అనేదానిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం మత పరంగా సమాజంలో చీలికలకు ఆస్కారమిచ్చేలా వ్యవహరించడం శోచనీయం. కరోనాకు మతం రంగు పులిమేందుకు సోషల్ మీడియా లోను, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా సాగుతున్న గోబెల్స్ ప్రచారానికి, అధికారంలో ఉన్న పెద్దలకు సంబంధం లేదని అనుకోలేము. కరోనాపై పోరు ప్రకటించిన సమయంలో ఢిల్లీలో వందలాది మందితో సమావేశం ఏర్పాటు చేయడం 'తబ్లిఘీ జమాత్' నిర్వాహకుల బాధ్యతారాహిత్యమే. కరోనా...