ఆర్టికల్స్
రవాణా రంగం కుదేలు
Mon, 2020-04-06 12:47
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్డౌన్ ప్రభావం తూర్పు గోదావరి లోని సుమారు 1.50 లక్షల మంది ట్రాన్స్పోర్టు రంగ కార్మికులపై తీవ్రంగా పడింది. అత్యవసర సరకుల రవాణా మినహా మిగిలిన సరకుల రవాణా నిల్చిపోవడంతో లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు ఉపాధి కరువైంది. ఆర్థిక సంక్షోభం, ఇటీవల వరకు ఎదుర్కొన్న ఇసుక కొరత వల్ల ఇప్పటికే రవాణా రంగం తీవ్ర ఒడిదొడుకుల్లో ఉంది. దీనికి లాక్డౌన్ కూడా తోడు కావడంతో ట్రాన్స్పోర్టు రంగ కార్మికులు, ట్రాన్స్పోర్టు వాహనాల యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. కార్మికులు అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకురావాల్సి వస్తోంది.తూర్పుగోదావరి జిల్లాలో పది టన్నుల కెపాసిటీగల టిప్పర్, క్వారీ లారీలు 6,500 వున్నాయి. 20...
ఒక విషాదానికి తెరతీసిన తీరు
Mon, 2020-04-06 12:44
దేశం యావత్తూ లాక్డౌన్లో ఉంది. కాని వేల సంఖ్యలో వలస కూలీలు ప్రతి పట్టణం లోనూ బస్స్టాండ్లలో కిక్కిరిసి పోయారు. లేదా రోడ్ల మీద ఉన్నారు. ఇక లాక్డౌన్కి అర్థం ఏంటి? ఈ మహమ్మారి వ్యాపించకూడదన్న లక్ష్యంతోనే లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు దేశాంతరవాసానికి బయలుదేరి ఇంతవరకూ ఈ మహమ్మారి సోకని పల్లె ప్రాంతాలకు పోతున్నారు. అక్కడేమో ప్రజారోగ్య వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది. వైరస్ వ్యాప్తి కారణంగా మానవ జీవితాలు విషాదం కాకూడదని లాక్డౌన్ విధిస్తే...అంతకన్న తీవ్రమైన మానవ విషాదం ఇప్పుడు కళ్లెదుట కనపడుతోంది!కేవలం నాలుగు గంటల వ్యవధి ఇచ్చి లాక్డౌన్ ప్రకటించారు. సరైన ప్రణాళిక లేకుండా, ముందస్తుగా తగిన సన్నాహాలు చేయకుండా ఇటువంటి...
విలవిల్లాడుతున్న ఆదివాసీలు
Mon, 2020-04-06 12:40
కరోనా వైరస్ ప్రమాదం గుర్తించని మోడీ ప్రభుత్వం దేశాన్ని లాక్డౌన్ చేసింది. ముందస్తు ఏర్పాట్లు లేకుండా అర్థంతరంగా అమలు చేసిన లాక్డౌన్ వలన పేదలు, రోజు కూలీలు, వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, రైతులు అందునా ఆదివాసీలు, దళితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.లాక్డౌన్తో ఆదివాసీల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆదివాసీలు వారపు సంతల్లో ఉత్పత్తులు అమ్ముకుని నిత్యావసరాలు కొనుక్కుంటారు. లాక్డౌన్ వలన వారపు సంతలు మూసేయాల్సి వచ్చింది. సంతలు లేనందున తమ సరుకును అమ్ముకోలేక పోతున్నారు. నిత్యావసరాలు కొనుక్కోలేకపోతున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో చింతపండు పంట వస్తుంది. అలాగే కొండ చీపుళ్లు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసీలకు పెద్ద...
వ్యవసాయం లాక్డౌన్
Mon, 2020-04-06 12:03
కరోనా వ్యాప్తి నివారణకు దేశ వ్యాప్త లాక్డౌన్ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అరవై శాతం మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని పూర్తిగా విస్మరించింది. సర్కారు నిర్లక్ష్య పర్యవసానాలు వ్యవసాయ రంగాన్ని, మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో సేద్యం సంక్షోభంలో కూరుకుపోగా కర్షకులు ఆత్మహత్యలబాట పట్టారు. ఆర్థిక మాంద్యం తోడైన ఫలితంగా పరిస్థితి మరింతగా దిగజారింది. సరిగ్గా ఇప్పుడే కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం వెనకాముందు చూడకుండా విధించిన సుదీర్ఘ లాక్డౌన్, కునారిల్లుతున్న వ్యవసాయ రంగంపై పిడుగుపాటైంది. లాక్డౌన్ను అమలు చేస్తున్న కేంద్రం, దాని వలన నష్టపోయే కొన్ని వర్గాల...
అలసత్వం, అల్పత్వం, ఆత్మ సంతృప్తి .. అనర్థం
Sat, 2020-04-04 12:36
కేవలం పదిహేను రోజుల వ్యవధిలో దేశంలో కరోనా తప్ప మరో మాట వినిపించకుండా పోయిన స్థితి. చూస్తుండగానే దాదాపు రెండు మాసాల కాలం పోగొట్టుకున్నాం. ఇది ఇంకా తీవ్రమయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా వంటి దేశమే అతలాకుతలమై పోతున్నది. విస్త్రుతంగా పరీక్షల పని పెట్టుకోకుండా మన పరిస్థితి మెరుగని చెప్పుకున్న దశ మారింది. ఇప్పుడు ఐసిఎంఆర్ పరీక్షలు పెంచే దిశలో ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు గాని దానికి అవసరమైన సదుపాయాలు లేవు. కోటి మందికి ఒక్క లాబొరేటరీ వుండగా వాటిలోనూ మూడో వంతు సమర్థతనే వాడుకుంటున్నాము. మాస్కులు, కిట్లు, కవర్ ఆల్లు, వెంటిలేటర్లు అన్నిటికీ తీవ్రమైన కొరత వెన్నాడుతూనే వుంది. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ప్రకటనలు వీడియో మీడియా...
కరోనా మహమ్మారి - కఠోర వాస్తవాలు!
Sat, 2020-04-04 12:31
ప్రపంచంలో తలెత్తే ప్రతి మహమ్మారిని కచ్చితంగా రాజకీయ, సామాజిక, ఆర్థిక కోణాల్లోంచి పరిశీలించాల్సిందే. ప్రజల సంక్షేమానికి ఎంతో కీలకమైన మౌలిక సేవలను నయా ఉదారవాద పెట్టుబడిదారీవాదం ధ్వంసం చేస్తున్న సమయంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రబలింది. అనేక దేశాల్లో ప్రైవేటీకరణ ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది. ప్రజలకు మౌలిక అవసరాలైన ఆహారం, ఇల్లు, విద్య, ప్రభుత్వ రవాణా వంటి వాటిని అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు వదిలి పెట్టాయి. సమాజం ఎదుర్కొనే ఏ సంక్షోభమైనా-అది ఆర్థికమైనా లేక సామాజికమైనా-ప్రభుత్వ విధానాల ప్రాధాన్యత ఎప్పుడూ కూడా ఫైనాన్స్ పెట్టుబడి- కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు, కోటీశ్వరుల-ప్రయోజనాలను పరిరక్షించేదిగానే వుంటుందే తప్ప కార్మికుల...
మానవతా మూర్తులు
Sat, 2020-04-04 11:58
'ఆరోగ్యమే మహా భాగ్యం' అన్నారు పెద్దలు. ఆ ఆరోగ్యం కాపాడుకోవడమనేది అంత తేలికైన విషయమేమీ కాదు. నేటి ఆధునిక కాలంలో విద్య, ఉద్యోగ వత్తిడులు, సంఘర్షణలు, నగరీకరణ, కాలుష్యం, పర్యావరణ క్షీణత, కల్తీలు వంటి అనేక ఒత్తిడులతో పాటు కార్పొరేటీకరణ తెచ్చిన ప్రమాదం, ప్రకృతి వనరుల దోపిడీ మనిషి అనారోగ్యానికి కారణమౌతున్నాయి. ఆధునిక పోకడలు పెరిగిపోతున్న కొద్దీ మనిషి శరీరంలో రోగనిరోధక శక్తి రోజురోజుకు తగ్గుతోంది. ప్రస్తుతం మానవాళిని వేధిస్తున్న అనేక ఆరోగ్య సమస్యలతో పాటు రోజుకో కొత్త వైరస్ పుట్టుకొచ్చి, మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోంది. వీటికి మానవ తప్పిదాలే చాలా వరకు కారణం. ఎవరైనా దగ్గినా తుమ్మినా దూరంగా జరిగే రోజులివి. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ...
ఏ దేవుడూ ఏ వైరస్ని నిర్మూలించలేడు !
Fri, 2020-04-03 12:27
దేశంలో కేంద్రప్రభుత్వం పౌరసత్వ చట్టం తెచ్చింది. మత ప్రాతిపదికన జనాన్ని విడగొట్టడం ప్రజలకు నచ్చలేదు. కుల, మత, ప్రాంతీయ బేధాలు, ఆర్థిక స్థోమతలు పక్కనపెట్టి దేశమంతా ఒక్క గొంతై తన నిరసనను తీవ్రంగా వెలిబుచ్చింది. మానవత్వమే వెన్నెముకై దేశమంతటా వందల షాహీన్బాగ్లు వెలిశాయి. వెనువెంటనే దేశంలోకి కరోనా వైరస్ వ్యాపిస్తూ వచ్చింది. అన్ని మతాల దేవుళ్ళూ తలుపులు మూసుకున్నారు. అప్పుడు మళ్లీ కుల, మత ప్రాంతీయ బేధాలు, ఆర్థిక స్థోమతలు పక్కకు తొలగిపోయాయి. మనుషులంతా ఒక్కటిగా నిలిచారు. మానవత్వమే వెన్నెముక అయిన వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. విచారించవల్సిన విషయమేమంటే మన పాలకులు గానీ, అధికారులు గానీ, మీడియా గానీ ఎవరూ సూక్ష్మక్రిమి అన్వేషకులను...
పెద్దన్నకు కార్పొరేట్ ప్రయోజనాలే ప్రధానం
Fri, 2020-04-03 12:26
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్! కరోనా వైరస్ తీవ్రతను పట్టించుకోని అగ్రరాజ్య అధిపతి!! చైనా, ఇటలీ తరువాత మూడో స్థానంలోకి చేరిన అమెరికా!!! 228 ఏళ్ల న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ చరిత్రలో తొలిసారిగా సోమవారం నాడు వాణిజ్య కేంద్రం మూసివేత. ఉద్దీపన పథకానికి సెనెట్లో ఎదురుదెబ్బ తగిలింది. దాంతో ఫెడరల్ రిజర్వు (రిజర్వు బ్యాంకు వంటిది) రంగంలోకి అప్పులు, ఇతర ఆస్తులను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దాంతో ఆసియా లోని స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఇది ఎంతకాలం పతనాన్ని ఆపుతుందన్నది ప్రశ్న. ఒకవైపు గంట గంటకూ అమెరికాలో వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. అయినా 'వ్యాధి తీవ్రత కంటే చికిత్స కఠినంగా ఉండకూడదు. పదిహేను రోజుల తరువాత ఏ మార్గంలో...
నిర్లిప్తత వీడండి !
Fri, 2020-04-03 11:51
కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం అస్త్ర విన్యాసమెరుగక బరిలోకి దూకిన సైనికుడిని తలపిస్తోంది. లాక్డౌన్ కష్టాలతో ఆర్థికంగా చితికిపోయిన కష్టజీవులను ఆదుకోవడం మొదలుకొని కరోనా పోరులో కీలకమైన వైద్య సిబ్బందికి అండగా నిలవడం వరకూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కోవిడ్పై పోరు సల్పుతూ ప్రజల దృష్టిలో దేవుళ్లుగా మారిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, పోలీసుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సబబుగా లేదు. వైద్యులకు, పారా మెడికల్ సిబ్బందికి కనీస రక్షణ కిట్లను కూడా సరిపడ అందించకపోవడం ఆందోళనకరం. సోదర రాష్ట్రమైన తెలంగాణలో వీరి సేవలను ప్రశంసిస్తూ పూర్తి వేతనాన్ని ఇవ్వడంతో పాటు, అదనపు పారితోషికం ఇచ్చి...
చైనాపై తప్పుడు ప్రచారాలు, సమాధానం లేని ప్రశ్నలు!
Thu, 2020-04-02 12:24
హాలీవుడ్ సినిమాల్లో గొరిల్లాల మాదిరి కరోనా తమ ముంగిటికి వచ్చినప్పటికీ గుర్తించలేని మతి తప్పిన స్థితిలో కొందరు ఉన్నారు. వారిలో ట్రంప్ ఒకరు. మన దేశంలో కొందరు మడి కట్టుకున్న మాదిరే ప్రపంచంలో తమను ఏ వైరస్లు అంటుకోవు అనే దురహంకారులు ప్రపంచమంతటా ఉన్నారు. చైనాలో దాన్ని అరికట్టినా అక్కడ వెలువడుతున్న కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారిలో తప్ప స్థానికుల్లో కొత్త కేసులు లేవు. అనేక మంది ఈ వార్తలను నమ్మటం లేదు. 'స్వయం కృతం అని, తన గోతిలో తానే పడిందని, తయారు చేసి ప్రపంచం మీదకు వదలింద'ని ఇలా చైనా గురించి తప్పుడు ప్రచారాలన్నీ చేసిన వారు, బుర్రకు పని పెట్టకుండా వాటిని గుడ్డిగా నమ్మినవారు చైనాలో వైరస్ను అరికట్టటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇది కరోనా...
జెఎన్యు @ కోవిడ్-19
Thu, 2020-04-02 12:21
కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, మెజారిటీ ప్రయోజనాలకు తలొగ్గిన అయోధ్య తీర్పు, జెఎన్యు హాస్టల్ ఫీజు పెంపు, క్యాంపస్లో విద్యార్థులపై ఆర్ఎస్ఎస్ గూండాల పాశవిక దాడి, ఢిల్లీ అల్లర్ల మధ్య తీసుకొచ్చిన సిఎఎ-2019 చట్టం...వంటి అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా జెఎన్యు తన అసమ్మతిని వ్యక్తం చేసింది. విద్యార్థులు అనేకానేక నిరసన ప్రదర్శనలు, అధికారిక విజ్ఞప్తులు చేశారు. పార్లమెంటు వరకు పాదయాత్రలు చేశారు. విచక్షణా రహితంగా సాగిన పోలీసు లాఠీచార్జి, నీటి ఫిరంగుల ప్రయోగం, నిర్బంధాల నడుమ...మండుటెండలను, వణికించే చలినీ లెక్కచేయక...మిట్టమధ్యాహ్నాలు, అర్థరాత్రుళ్లన్న బేధం లేకుండా...క్యాంపస్ లోపల వెలుపల విద్యార్థులు చేసిన నినాదాలు ప్రతిధ్వనించాయి. విభిన్న...