ఆర్టికల్స్
ధరల పెరుగుదల-పిడిఎస్ ప్రాధాన్యత
Thu, 2015-11-12 16:59
నిత్యావసర సరుకుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పెరిగిపోతున్నాయి. గతంలో ఉల్లిపాయల ధరలు పెరిగాయి. ఇప్పుడు కందిపప్పు ధరలు ఆ విధంగానే పెరుగుతున్నాయి. మార్కెట్లో కిలో రూ.15 నుంచి రూ.20 లభించే ఉల్లిపాయల ధరలు రూ.80 దాటి పెరిగి, ఇప్పుడు రూ.25-30 వద్ద ఉన్నాయి. రూ.80-90 కందిపప్పు ధర గత నాలుగు మాసాల నుంచి పెరుగుతూ కోడిమాంసం ధరలను దాటి, ఏటమాంసం ధరలను అందుకొనే వైపుగా పరుగులు తీస్తున్నది. ఇతర పప్పుల ధరలు కూడా ఈ విధంగానే పెరుగుతున్నాయి. ఈ సరుకుల ధరలు పెరగటానికి కారణమేమిటి? ఏ సరుకైనా ఎక్కువగా ఉత్పత్తి జరిగి, మార్కెట్లో కావలసినంత మొత్తం అందుబాటులో ఉంటే ధరలు తక్కువగా ఉంటాయని, తగినంత ఉత్పత్తి జరగక, కొరత ఏర్పడితే ధరలు పెరుగుతాయని బడా వ్యాపారులు...
బీహార్ ఎన్నికలు నేర్పుతున్న పాఠాలు
Tue, 2015-11-10 17:01
రాజకీయ విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహా కూటమి ఘనవిజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు బిజెపికి ప్రత్యేకించి మోడీ, అమిత్ షాల నాయకత్వాలకు పెద్ద ఎదురు దెబ్బ. అన్నిటినీ మించి సంఘ పరివార్ దేశంపై రుద్దాలనుకున్న సనాతన, భూస్వామ్య సంస్కృతి, వారి అనాగరిక చర్యలకు ఇది బీహార్ ప్రజల సమాధానం. కులం, ఉప కులం పేరుతో ప్రజలను చీల్చాలనుకోవడం, ప్రజల్లోని భక్తి భావాలను రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే దృష్ట యత్నాలకు దీన్ని ప్రతిఘటనగా భావించవచ్చు. స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి పాత్రా లేని ఆరెస్సెస్, మహాత్మా గాంధీని హత్య చేసిన ఆరెస్సెస్, సంఘ పరివార్ ఫాసిస్టు పోకడలకు ఇది అడ్డుకట్ట. దేశభక్తి, జాతీయత, మతం వంటి ముసుగులను కప్పుకొని వారు...
ఆంధ్రుల స్ఫూర్తి ప్రదాత బ్రౌన్..
Tue, 2015-11-10 16:57
ఆంధ్ర భాషా సారస్వతాలకు ఎనలేని సేవచేసిన ఆంగ్లేయ సివిల్ ఉద్యోగి, ఆంగ్ల విద్వాంసుడుగా గణుతికెక్కిన సర్ ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్. మిణుకు మిణుకు మంటున్న తెలుగు సాహిత్యాన్ని ఒంటి చేత్తో కృషిచేసి జాజ్వల్యమానంగా వెలిగించే కర్తవ్యాన్ని నిర్వహించిన ఆంగ్లేయుడు. 1798 నవంబరు 10న ఒక క్రైస్తవ మిషనరీ కుటుంబంలో కలకత్తాలో (కోల్కతా) జన్మించాడు. ఆయన తండ్రి డేవిడ్ బ్రౌన్ బహు భాషా కోవిదుడు. తన పిల్లలు కూడా అలాగే కావాలని కోరుకునేవాడు. బ్రౌన్ చిన్ననాటి నుంచే ఇంగ్లీషు, హిబ్రూసిరియన్, అరబ్బీ, పారశీక, గ్రీకు, లాటిన్, బెంగాలీ, వంటి పెక్కు భాషలను క్షుణ్ణంగా అభ్యసించాడు. తన తండ్రి మరణానంతరం 1812లో ఇంగ్లాండుకు వెళ్లి ఐసిఎస్ పరీక్షలో ఉత్తీర్ణుడై 1817లో...
మతతత్వ శక్తులకు చెంపపెట్టు..
Tue, 2015-11-10 16:55
బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు నితీష్ కుమార్ సారధ్యంలోని లౌకిక మహా కూటమికి తిరుగులేని ఆధిక్యంతో పట్టం కట్టి తమ విలక్షణతను చాటుకోవడం అభినందనీయం. జనం మధ్య చిచ్చుపెట్టే విచ్ఛిన్నకర మతతత్వ శక్తులను అధికారానికి ఆమడ దూరంలో పెట్టి బుద్ధుడు జన్మించిన గడ్డ వారసత్వాన్ని కొనసాగించడం హర్షణీయం. ఒక విధమైన ఉద్రేక భరిత వాతావరణం మధ్య జరిగిన బీహార్ ఎన్నికలు యావత్ దేశాన్నీ ఆకర్షించడమే కాకుండా నరాలు తెగే ఉత్కంఠ రేపాయి. అందుక్కారణం ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాకు, ప్రభుత్వానికి పరీక్షగా మారడమే. మోడీ సైతం బీహార్ ఎన్నికలను వ్యక్తిగతంగా తీసుకొని ప్రధాని హోదాలో గతంలో మరెవ్వరూ తిరగనంతగా కాలికి బలపం కట్టుకొని మరీ ఎన్డిఎ గెలుపు కోసం...
ధరలపై యుద్ధం..
Tue, 2015-11-10 15:51
ఇటు రైతులను అటు వినియోగదారులను కట్టకట్టి అందినకాడికి దోపిడీ చేసే దళారీ వ్యవస్థను మరింతగా స్థిరీకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నడుంబిగించడం ఆందోళన కలిగించే అంశం. ఈ దుష్పరిణామం పివి నరసింహారావు 'సంస్కరణ'లతో పురుడు పోసుకొని వాజపేయి హయాంలో మొగ్గ తొడిగి మన్మోహన్ సమయంలో కొమ్మలుగా విస్తరించి చివరికి మోడీ నేతృత్వంలో వటవృక్షమైంది. రైతుల, వినియోగదారుల మూలుగ పీల్చే కేంద్ర విధానాలకు రాష్ట్రం తందాన అంటోంది. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) దక్కక ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నదీ, నిత్యావసరాల ధరలు పెరిగిపోయి పేదల కంచాల్లో కనీసం పప్పుచారు, చింత పులుసు కరువవుతున్నదీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని ప్రజల నెత్తిన రుద్దిన విధానాల ఫలితమే....
కాషాయాన్ని వెంటాడుతున్న కమ్యూనిస్టు భూతం
Mon, 2015-11-09 17:01
మామూలుగా ఎన్నికల ప్రచార సమయంలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ఉంటుంది. పోలింగ్ ముగిసిన మరుక్షణంలో మొదలయ్యే ఎగ్జిట్ పోల్స్ ఆ కుతూహలానికి కొంత సమాధానమిస్తాయి. ఎన్నికల సర్వేల కన్నా ఎగ్జిట్ పోల్స్ వాస్తవ ఫలితాలకు కొంత దగ్గరగా ఉంటాయనేది సాధారణంగా ఉన్న భావన. కానీ ఇప్పుడు బీహార్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠను మరింత పెంచేశాయి. విజయం గురించిన అంచనాలలో విపరీతమైన తేడా ఇందుకు కారణం. రెండు మినహా మిగిలిన ఛానల్స్ జెడియు-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి ఆధిక్యత లేదా మొగ్గు ఉంటుందని చెప్పాయి. టుడేస్ చాణక్య, ఎక్స్ప్రెస్ సిసిరో మాత్రం బిజెపి ఎన్డిఎ కూటమికి అధికారం వస్తుందంటున్నాయి. మిగిలిన సంస్థల కన్నా ఒక రోజు ఆలస్యంగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన...
ప్రజాస్వామ్య సంస్కృతి..
Mon, 2015-11-09 16:59
మధ్యయుగాల నాటి సామాజిక జీవితపు పోకడలతో పోలిస్తే ఆధునిక ప్రజాస్వామ్యం ఒక సుగుణం. శతాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉదాత్తాంశం. సకల రంగాల్లో వ్యక్తి స్వేచ్ఛకూ, సమానత్వానికీ, ఎంచుకునే హక్కుకూ మూలం ప్రజాస్వా మ్యం. రాచరికపు సంస్కతికి భిన్నమైన ప్రజాస్వామ్యం ఓ అందమైన భావన. ఆచరణలో విరుద్ధాంశాలు కనిపించినప్పటికీ మౌలికంగా ప్రజాస్వామ్య సూత్రాలకు బద్ధులై ఉండాలన్న భావనలు 1950 కాలం నాటికి బలపడ్డాయి. కాలం గడుస్తున్న కొద్దీ ఈ భావనలు మరింత శక్తిని పుంజుకుని ప్రజాస్వామ్య సంస్కతి పరిఢవిల్లాల్సింది. అందుకు భిన్నంగా కాలం చెల్లిన భూస్వామ్య నిరంకుశత్వపు పోకడలు సామాజిక జీవితంలో పెత్తనం చెలాయించడం వర్తమాన వాస్తవం. ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం మతం వ్యక్తిగత...
నయవంచన..
Mon, 2015-11-09 16:56
పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్ల పేరిట పేదల భూములను బెదిరింపు ఎత్తుగడలతో బలవంతంగా గుంజుకొంటున్న చంద్ర బాబు సర్కార్..ఇప్పుడు గిరిజన బతుకులను బూడిదపాల్జేసేందుకు నయవం చనకు పాల్పడింది. పర్యావరణవేత్తల ఆందోళనలను, గిరిజనుల ఆవేదనలను ఏమాత్రం పట్టించుకోకుండా, గతంలో ఇచ్చిన హామీలను విస్మరించి మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వడం దుర్మార్గం. విశాఖ జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని చింతపల్లి, జెర్రెలలో 1212 హెక్టార్ల అటవీభూమిని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు బదలాయించింది. ఆన్రాక్ అల్యుమినా వంటి కార్పొరేట్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి రాజ్యాంగంలోని ఆర్టికల్ 242లో ఆదివాసీలకు దఖలుపర్చిన హక్కులను కాలరాస్తూ జివో 97...
సర్కారీ ఘాతుకాలు..
Mon, 2015-11-09 12:34
జాతికి అన్నం పెట్టే రైతుల ఆత్మహత్యలు పెను విషాదం కాగా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానిది పెద్ద ఘాతుకం. ఒక వైపు చంద్రబాబు సర్కారు నవ్యాంధ్ర అభివృద్ధి నమూనా చిత్రాన్ని రంగుల్లో ఆవిష్కరిస్తుం డగా ఇంకో వైపు రైతుల బలవన్మరణాల పరంపర కొనసాగింపు రాష్ట్రంలో నెలకొన్న రెండు విభిన్న ధోరణులకు నిదర్శనం. అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రసీమలో కాడెత్తాల్సిన అన్నదాతలు ఉరితాళ్లకు వేలాడుతున్నా పంట పండించాల్సిన వ్యవసాయదారులు పొలంలోనే పురుగు మందు తాగి విగత జీవులవుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. పైగా తెలంగాణాతో పోలికపెట్టి ఎపిలో తక్కువని ఆత్మవంచన చేసుకోవడం క్షమించరానిది. రైతు ఆత్మహత్య వార్త లేకుండా దినపత్రికలు, టీవీ చానెళ్లు లేవంటే గ్రామాల పరిస్థితి ఎంత...
కార్మికోద్యమస్ఫూర్తి ప్రదాత అక్టోబర్విప్లవం
Sat, 2015-11-07 12:48
పెట్టుబడిదారులు, వారి కిరాయి రచయితలు పండుగజేసుకుని పట్టు మని పాతికేళ్ళు కాలేదు. ఫుకయామా ''చరిత్ర అంతమైందని'' ప్రకటించి నేటికి 23 ఏళ్లు. మార్క్స్ చెప్పిన ''వేతన బానిసలు'' (కార్మికవర్గమే) లేరని ఆండ్రీ గోర్జ్ అంతకు ముందే ప్రకటించాడు. సోవియట్లో సోషలిజం కూలిపోయినప్పుడు, అప్పటికే తూర్పు ఐరోపా దేశాలు పెట్టుబడి కబంద హస్తాల్లో చిక్కినప్పుడు ''సామ్రాజ్యం'' పులకించి పోయింది. ఆ మైకంలో ఫ్రాన్సిస్ ఫుక యామా పలవరింపే పైన చెప్పిన ''చరిత్ర అంతం''! మన దేశంలోని వారి తాబేదార్లు, జీతగాళ్ళు, ''అన్ని యిజాలు విఫలమ య్యాయి. ఇక భవిష్యత్ అంతా టూరిజ ందే!'' అని ప్రవచించారు.
1998లో ''ఆసియా పులుల'' సంక్షోభంతో ఆత్మరక్షణ లో పడ్డ ''సంస్కరణల ప్రతిపాదకులు'' 2008...
'నిజం' పేరుతో అబద్ధాలా?
Fri, 2015-11-06 11:32
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఇక్కడ విడుదల జేసిన పుస్తకం 'నిజం తెలుసుకోండి' (నో ది ట్రూత్)లో కొత్తదనమేమీ లేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి చెప్పారు. లెఫ్ట్పై బిజెపి గతంలో చేసిన ఆరోపణలను ఇందులో మరోసారి ప్రస్తావించారని ఏచూరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో మేధావుల ఆలోచనలను లెఫ్ట్ తప్పుదోవ పట్టిస్తోందని అందులో విమర్శించారని, వామపక్ష మేధావుల ఆలోచనా ధోరణి పరిశీలనాత్మకంగానే వుం టుందని, ఇకపై కూడా అదే విధంగా కొనసాగుతుందని ఏచూరి స్పష్టం చేశారు. వారి మేధోసంపత్తి, హేతు వాదం, చరిత్ర అధ్యయనం వంటివి ఇందుకు ప్రధాన కారణాలని ఆయన వివరించారు. ఈ ఉన్నత ప్రమాణా లను అందుకోలేక ఆపసోపాలు పడుతున్న ఆరెస్సెస్ మరోసారి తప్పుడు సమాచారంతో '...
UGC ముట్టడి ఎందుకు...?
Thu, 2015-11-05 11:52
ఆక్యుపై యుజిసి అనేది... ఢిల్లీ విద్యార్థి లోకం ఎత్తుకున్న ప్రధాన నినాదం. ఢిల్లీలో ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో నేడు యుజిసి ముట్టడి అనేది ఒక పెద్ద ఉద్యమంగా తయారయింది. దేశంలో గత రెండు దశాబ్దాలుగా వేగవంతమైన నయా ఉదారవాద విధానాల ఫలితంగా అన్ని రంగాలూ స్వరనాశనమయ్యాయి. అన్ని రంగాల్లో ప్రయివేట్ ఆధిపత్యం పెరిగింది. అందులో మరీ ముఖ్యంగా విద్య, వైద్యం అంగడి సరుకైనాయి. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ ప్రయివేటు అనుకూల విధానాల ఫలితంగా ఉన్నత విద్య పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షలా మారింది. ఇప్పటి వరకు విద్య జోలికి రాని ప్రభుత్వం ఒక్కసారిగా ఉన్నత విద్యలో సంస్కరణలు తెచ్చేందుకు పూనుకుంది. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన...