February

యూనివర్శిటీలను కబేళాలుగా..

దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలను మానవ కబేళాలుగా మార్చేందుకు కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రయత్నిస్తున్నదని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) విమర్శించింది. ఇటీవలి కాలంలో ఒకదాని తరువాత ఒకటిగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు దారి తీస్తున్న పరిణామాలపై ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయంలో రోహిత్‌ ఆత్మహత్య చిచ్చు చల్లారకముందే మరో యువ మేథావి ప్రాణాలు తీసుకోవటం వంటిప రిణామాలను పరిశీలిస్తే దేశంలోని విశ్వవిద్యాలయాలు విద్యార్ధులు, యువ మేధావుల కబేళాలుగా మారుతున్నాయన్న భావన కలుగక మానదని ఎస్‌ఎఫ్‌ఐ పేర్కొంది.

నష్టాల్లో చమురు సంస్థలు..

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గణనీయంగా పడిపోవడంతో ఆయా సంస్థల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, ఆర్థిక సాయం కోసం ప్రపంచ బ్యాంక్‌ను ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపాయి. కాగా, చమురు ధరలు రెండేండ్లలో 70శాతానికి తగ్గాయి. గత ఏడాది జూన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌ 115డాలర్లు (రూ.7వేల 800) ఉండగా, ఈ ఏడాది 60డాలర్లకు (రూ.4072 ) దిగి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నదని నైజీరియా, అంగోలా, ఆఫ్రికాలోని రెండు ప్రముఖ చమురు కంపెనీలు పేర్కొన్నాయి. 

ఉత్తరాంధ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టండి

     ఉత్తరాంధ్ర అభివృద్ధికి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సర్క్యూట్‌ హౌస్‌లో వినతిపత్రాన్ని అందజేశారు. 

విజ‌య‌వాడ‌లో గాంధీ కాల‌నీ వాసుల‌కు శాశ్వత ప్రాతిపదికన పక్కా గృహాలు కేటాయించాలి. ` సి.పి.ఎం. రాష్ట్రకార్య‌ద‌ర్శివ‌ర్గ స‌భ్యులు సిహెచ్‌.బాబూరావు, న‌గ‌ర క్యార్య‌ద‌ర్శి కాశీనాథ్ డిమాండ్

విజ‌య‌వాడ‌లో గాంధీ కాల‌నీ వాసుల‌కు శాశ్వత ప్రాతిపదికన పక్కా గృహాలు కేటాయించాలి. ` సి.పి.ఎం. రాష్ట్రకార్య‌ద‌ర్శివ‌ర్గ స‌భ్యులు సిహెచ్‌.బాబూరావు,  న‌గ‌ర క్యార్య‌ద‌ర్శి కాశీనాథ్ డిమాండ్   

విజ‌య‌వాడ‌లో గాంధీ కాల‌నీ వాసుల‌కు శాశ్వత ప్రాతిపదికన పక్కా గృహాలు కేటాయించాలి. ` సి.పి.ఎం. రాష్ట్రకార్య‌ద‌ర్శివ‌ర్గ స‌భ్యులు సిహెచ్‌.బాబూరావు, న‌గ‌ర క్యార్య‌ద‌ర్శి కాశీనాథ్ డిమాండ్

విజ‌య‌వాడ రాజీవ్‌గాంధీ కాల‌నీలో అగ్ని ప్రమాదం జరిగి మూడు రోజులు అయియినా  అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంపై సి.పి.ఎం. రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు శ్రీ సిహెచ్‌.బాబూరావు మండిప‌డ్డారు.  వారికి శాశ్వ‌త గౄహాలు మంజూరు చేయాల‌ని కోరారు.  

మోడీతో జట్టు కడతా: ఒవైసీ

మజ్లిస్‌ నేత, శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రసంగానికి చెందిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. అందులో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి దేశంలో కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేస్తానని చేసిన వ్యాఖ్యలున్నాయి.కాంగ్రెస్‌ నేతలు గాంధీలకు బానిసలని ఆయన ఎద్దేవా చేశారు.

ఆక్వాఫుడ్‌పార్క్‌పై రైతుల ఆందోళన

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మత్స్యకారులు, రైతులు ఆందోళనకు దిగారు. తుందుర్రులో చేపట్టిన గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ గురువారం భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఫుడ్‌ పార్కు నిర్మిస్తున్న తుందుర్రు, కె.బేతపూడి, జొన్నలగర్వు గ్రామస్తులతోపాటు.. మొగల్తూరు మండల కేంద్రం, ముత్యాలపల్లి, కొత్తోట, వారతిప్ప, కాళీపట్నం తదితర ప్రాంతాల రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మొగల్తూరు ప్రధాన రహదారి నుంచి నరసాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు.

Pages

Subscribe to RSS - February