సీపీఎం నాయకులపై గొడ్డళ్లతో దాడి

గుంటూరు సుందరయ్య నగర్ సీపీఎం నాయకులపై దాడి జరిగింది. సీపీఎం సుందరయ్య నగర శాఖ సహాయ కార్యదర్శిగా పని చేస్తున్నా ఆంజనేయులు, సతీష్ గొడ్డళ్లతో కోటేశ్వరరావు, బాజీ అనే వ్యక్తులు దాడి చేశారు. దాడిలో గాయపడిన ఆంజనేయులు, సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజులుగా స్థానిక సమస్యలపై సీపీఎం నేతలు పోరాటం చేస్తున్నారు. దాడికి పాల్పడిన కోటేశ్వరరావు, బాజీలతో పాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం.