February

ఢిల్లీలో CPM శిక్షణా పాఠశాల..

ఢిల్లీలోని ఐటీఓ సమీపంలో గల రోజ్‌ఎవెన్యూలో హరికిషన్‌సింగ్‌ సుర్జీత్‌ భవంతికి సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం శంకుస్థాపన చేశారు. ఐదంత స్థులతో నిర్మించనున్న ఈ భవంతిలో పార్టీ శిక్షణా పాఠశాలను నెలకొల్ప నున్నారు. కొల్‌కతా ప్లీనం నిర్ణయం మేరకు ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తు న్నారు. మార్చి మొదటి వారంలో నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టను న్నారు. ఈ భవంతిలో పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశమందిరం, ఆడిటోరియం, విద్యార్థుల తరగతి గది, నివాస గదులు, వంటశాల నిర్మించనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. 

5 రాష్ట్రాల ఎన్నికలకు సిపిఎం సిద్ధం

సీపీఐ(ఎం) 21వ మహాసభ ఆమోదించిన 'రాజకీయ ఎత్తుగడల పంథా' ఆధారంగానే త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. బెంగాల్‌లో ప్రజలను ఐక్యపరిచి అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం కలిసొచ్చే ప్రజాతంత్రశక్తులతో ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఇక కేరళలో ప్రస్తుత వామపక్ష ప్రజాతంత్ర కూటమితో ఎన్నికల్లోకి వెళ్తామని వెల్లడించారు. 

కన్హయ్య బెయిల్ తిరస్కరణ

 జేఎన్ యూ నేత కన్హయ్య బెయిల్ ను తిరస్కరిస్తున్నట్లు తీర్పు చెప్పడంతో విద్యార్థులు..ఇతరులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. న్యాయస్థానాల ఎదుట దాడికి దిగిన బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మకు గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేశారని విమర్శలు చేస్తున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కన్హయ్య అరెస్టుపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో వామపక్ష విద్యార్థి సంఘం నేతలు రైళ్లను ఆపివేసి తమ నిరసన తెలిపారు. మతతత్వవాదాన్నే కన్హయ్య వ్యతిరేకించారని తేలింది. దీంతో కన్హయను అక్రమంగా అరెస్టు చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి.

జగన్ కోర్టుకు హాజరవ్వాల్సిందే ..

ఆస్తుల కేసులో వైసీసీ అధినేత జగన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 28న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్‌కు చెందిన సంస్థల్లో అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్ కంపెనీల పెట్టుబడులపై ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన న్యాయస్థానం జగన్‌ సహా 19 మందికి సమన్లు జారీ చేసింది. 

భద్రత పేరిట కుట్ర: CPM

భద్రత పేరిట కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివిధ రాష్ట్రాలను సందర్శిస్తున్నారు. అందులో భాగంగా విశాఖపట్టణంలో రాజ్ నాథ్ సింగ్ సమావేశాలు నిర్వహించారు. ఈ పర్యటన వెనుక పెద్ద కుట్ర ఉందని సీపీఎం నేత నర్సింగరావు పేర్కొన్నారు.విశాఖపట్టణం పర్యటన వెనుక పెద్ద కుట్ర ఉందని, ఏజెన్సీలోని బాక్సైట్ ను దక్కించుకొనే కుట్ర జరుగుతోందన్నారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు, సంఘాలు వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. దీనితో ఈ ప్రాంతంలో పారామిలటరీ సైన్యాన్ని దింపడానికి వ్యూహరచన చేశారని విమర్శించారు.

జాతి వ్యతిరేకులెవరు?

ప్రఖ్యాతి గాంచిన ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యా లయంలో వారం రోజుల క్రితం జరిగిన కొన్ని ఘటనలను ఆధారం చేసుకొని విద్యార్థి ఉద్యమాలపైనా, వామపక్షాలపైనా ఆర్‌యస్‌ యస్‌ నాయకత్వంలోని సంఘపరివారం భౌతికంగా, భావజాలపరంగా దాడులు చేస్తోంది. మరో నాలుగురోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్‌ మరణంతో ఉత్పన్నమైన సమస్యల నుంచి తమను తాము కాపాడుకోడానికి ఒక రాజకీయ ఎత్తుగడగా జెఎన్‌యు ఘటనలకు మసిపూసి మారేడుకాయ చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోం ది. తనను కాదన్న ప్రతి ఒక్కరినీ దేశద్రోహులుగా ముద్రవేసి, తమకు తాము దేశభక్తులుగా ముద్రవేసుకొంటోంది.

రైవాడ నీటి కోసం సంఘటిత పోరాటం

 రైవాడ నీరు రైతులకు పునరంకితం అయ్యే వరకూ రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం సాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం పిలుపునిచ్చారు. రైవాడ నీరు రైతులకు ఇవ్వాలని కోరుతూ రైవాడ ఆయకట్టుదారుల నీటి సాధన కమిటీ ఆధ్వర్యాన ఈ నెల 14న ప్రారంభమైన పాదయాత్ర గురువారం విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం, ఆనందపురంలో ముగిసింది. ఈ సందర్భంగా సాధన కమిటీ అధ్యక్షులు వేచలపు చినరామునాయుడు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో లోకనాథం మాట్లాడారు. రైవాడ నీటిని సాధించేందుకు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొనే సమయం ఆసన్నమైందని, ఇందుకు ఆయకట్టుదారులు సిద్ధం కావాలన్నారు.

దివీస్‌ విస్తరణ పనుల నిలిపివేతకు ఆందోళన

 విశాఖ జిల్లా, భీమిలి మండలంలో వున్న  దివీస్‌ కంపెనీ మూడో యూనిట్‌ నిర్మాణ పనులు నిలిపివేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించింది. భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ సిటీనగర్‌ ఆటోస్టాండ్‌ నుంచి ప్రారంభమై దివీస్‌ కంపెనీ వరకు సాగిన ప్రదర్శనలో ఆశపాలెం, కొసవానిపాలెం, కంచేరుపాలెం, చిప్పాడ, మూలకొద్దు, నమ్మివానిపాలెం, పెదనాగమల్లిపాలెం, అన్నవరం తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ప్రజలను చీల్చి తమ పనులు చక్కదిద్దుకోవాలన్న యాజమాన్య కుయుక్తులను పసిగట్టిన ఉద్యమ కమిటీ అడ్డుకుంది.

దివీస్‌ విస్తరణ పనుల నిలిపివేతకు ఆందోళన

 విశాఖ జిల్లా, భీమిలి మండలంలో వున్న  దివీస్‌ కంపెనీ మూడో యూనిట్‌ నిర్మాణ పనులు నిలిపివేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించింది. భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ సిటీనగర్‌ ఆటోస్టాండ్‌ నుంచి ప్రారంభమై దివీస్‌ కంపెనీ వరకు సాగిన ప్రదర్శనలో ఆశపాలెం, కొసవానిపాలెం, కంచేరుపాలెం, చిప్పాడ, మూలకొద్దు, నమ్మివానిపాలెం, పెదనాగమల్లిపాలెం, అన్నవరం తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ప్రజలను చీల్చి తమ పనులు చక్కదిద్దుకోవాలన్న యాజమాన్య కుయుక్తులను పసిగట్టిన ఉద్యమ కమిటీ అడ్డుకుంది.

పెద్ద‌ల‌కు దోచిపెడుతున్న ప్రభుత్వం: బాబూరావు

రాజధానిలో భూ కుంభకోణాను ప్రభుత్వం చట్టబద్ధం చేస్తోంది.  పేద‌ల‌ను న‌ట్టేట ముంచి పెద్ద‌ల‌కు దోచిపెట్టేందుకు ప్ర‌భుత్వం పూనుకుంది. లంక‌భూముల వ్య‌వ‌హారంలో బ‌హిర్గ‌త‌మయింది.  అసైన్డ్‌, లంక, ఫారెస్ట్‌ భూములు అమ్మడానికి వీల్లేదని చెప్పి దళితులు, పేదల‌ను భయపెట్టి పెద్దలు భూము కొనుగోలు చేశారు.  న‌ష్ట‌పరిహారం కూడా ఇవ్వబోమని చెప్పడంతో పేదలు భయపడి భూముల‌ను తక్కువ ధరకు అమ్ముకున్నారు.  కొనుగోళ్లు పూర్త‌యిన త‌రువాత  జిఓ నెంబరు 41 విడుదల చేసి వాటిని చట్టబద్ధం చేసి పెద్ద‌ల‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్య‌క్షంగా తోడ్ప‌డింది.

Pages

Subscribe to RSS - February