ప్రతిపక్షాలతో బడ్జెట్‌ భేటీ..

వచ్చే వారం ఆరంభం కానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారాన్ని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నేడు ప్రధాన ప్రతిపక్షాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభలోని ప్రతిపక్ష నేతలకు మోడి ఆహ్వానం పంపినట్లు ఓ ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే ఇది అఖిలపక్ష సమావేశం కాదని, పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లుల గురించి ఈ సమావేశంలో చర్చించారని ఆ అధికారి తెలిపారు.