February

హస్పిటల్ లో చికిత్స పొదితున్న ఆంజినేయులను పరామర్సించిన :- పి.మధు

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులుని పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజునాయుడిని కలుసుకుని ఆంజనేయులు ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆంజనేయులుకు మెరుగైన వైద్యం అందించడం కోసం వైద్యులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. దాడిలో గాయపడిన భవన నిర్మాణ కార్మికుడు సతీష్‌నూ పరామర్శించారు. ఆంజనేయులు భార్య మల్లేశ్వరితో మాట్లాడారు. పార్టీ అండగా నిలుస్తుందని, అధైర్య పడవద్దని చెప్పారు. ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ పేదల కాలనీలను దౌర్జన్యంగా తరిమేయాలని చూస్తే సహించేది లేదన్నారు. రౌడీషీటర్ల విషయంలో సరైన విధంగా స్పందించని తాలూకా సిఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇది ఇళ్ళు ఇచ్చే ప్రభుత్వమా? కూల్చే ప్రభుత్వమా?

విజయవాడలో  పైపుల్‌రోడ్డు ప్రాంతం నుండి సుందరయ్య వ‌ర‌కు వున్న (సుంద‌ర‌య్య నగర్‌) కట్ట మీద వున్న పేద ఇళ్లను తొగించడానికి ప్రభుత్వం హడావుడి చేస్తుందని, ఇళ్ళు ఎక్కడిస్తారో? ఎప్పుడిస్తారో? స్పష్టం చేయకుండా తొగించే ప్రయత్నాలు మానుకోవాని  బాబూరావు కోరారు.  తొల‌గింపు విషయంలో ప్రజల్లో వున్న అనుమానాను ప్రభుత్వమే నివృత్తి చేయాల‌ని  డిమాండ్ చేశారు. ఎన్నికల‌కు ముందు మేము అదికారంలోకి  వస్తే ఇళ్ళుతొగించమని, పట్టాలు ఇస్తామని చెప్పిన టి.డి.పి అధికారంలోకి రాగానే ఇళ్లను తొగించే ప్రయత్నాలు ముమ్మరం చేయడం దారుణమన్నారు.

పాల‌కుల దాడిని తిప్పికొట్టగలిగేవి ప్రజాపోరాటాలే. సి.దివాకర్‌ వర్ధంతి సభలో సిపిఎం కృష్ణా జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు

తుమ్మపాల సుగర్‌ ఫాక్యరీ పోరాటానికి సిపియం పార్టీ సంపూర్ణ మద్ధతు.

అనకాపల్లి తుమ్మపాల కో-ఆపరేటివ్‌ సుగర్‌ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు చేస్తున్న పోరాటానికి సిపియం పార్టీ విశాఖ జిల్లా కమిటీ సంపూర్ణ మద్ధతు తెలియజేస్తుంది.

పాల‌కుల దాడిని తిప్పికొట్ట‌గ‌లిగేవి ప్రజాపోరాటాలే. పి.దివాకర్‌ వర్ధంతి సభలో సిపిఎం కృష్ణా జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు

పాల‌కులు అన్ని వైపుల నుండి ప్రజల‌పైన ముప్పేట దాడి చేస్తున్న నేటి తరుణంలో ప్రజల‌ను కదిలించి పోరాటాలు చేయడం ద్వారానే వాటిని ఎదుర్కొనగల‌మని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు అన్నారు. ఈ రోజు ఉదయం పాల‌ఫ్యాక్టరీ వద్ద గల‌ ఆఫీసులో కార్మికనేత సిపిఎం సీనియర్‌ నాయకు కామ్రేడ్‌ పి. దివాకర్‌ గారి 12వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ రైతు నుండి బవంతంగా భూము గుంజుకుంటున్నారు. కార్మిక హక్కును కారాస్తున్నారు.  పట్టణాల్లో ప్రజపై భారాలు పెంచుతున్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజు సంఘటితం కాకుండా చీల్చ‌డానికి కుంపట్లు రగిలిస్తున్నారు.

తమ కార్యర్తలపై దాడులకు పాల్పడ్డ రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలి:- సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి మధు

తమ కార్యర్తలపై దాడులకు పాల్పడ్డ రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన సుందరయ్యనగర్‌ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కార్యవర్గ సభ్యులు కృష్ణయ్య, రమాదేవి సందర్శించారు. మరోవైపు సీపీఎం కార్యకర్తలపై హత్యాయత్నంలో రౌడీషీటర్లు ఉపయోగించిన కత్తి, కారంపొడి ప్యాకెట్లను మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్మిస్తున్న మరుగుదొడ్లలో వీరు గుర్తించారు. స్థానిక సీఐ రౌడీషీటర్లకు మద్దతు ఇచ్చారు. టిడిపిలోని కొంతమంది బలపర్చడంతో రౌడీ షీటర్లు ఈ చర్యకు పూనుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు రౌడీ చర్యలను ప్రోత్సహిస్తున్నారు. రౌడీషీటర్లకు మద్దతు తెలపవద్దు. నేరస్తులను శిక్షిస్తే...

బాబు ఎస్సి వ్యాఖ్యలపై రగడ..

చంద్రబాబు ఎస్సీల పరంగా చేసిన వ్యాఖ్యలను కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి తప్పుబట్టింది. దళితుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు మాట్లాడారని కెవిపిఎస్‌ విజయవాడ నగర కార్యదర్శి నటరాజ్‌ విమర్శించారు. విజయవాడలోని మాచవరం సెంటర్‌లో కెవిపిఎస్‌ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్‌ దళితుడని ఇంకా ఎందరో మేథావులు దళితుల్లో ఉన్నారని అటువంటి దళిత సామాజిక వర్గాన్ని కించపరచడం సరికాదని అన్నారు.

దళితులకు అందని రాజ్యాంగ ఫలాలు..

ప్రతి భారతీయుడి కంట తడిని తుడిచివేయాలన్న స్వాతంత్య్ర సమరయోధుల ఆకాంక్షలను నెరవే ర్చేందుకు ప్రతి పౌరునికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పిం చాలనే లక్ష్యంతో మన రాజ్యాంగం ఏర్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కులు, రాజ్యాంగ ఫలాలు దళితులకు అందాయా అని ప్రశ్నించుకుంటే ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంది. రాజ్యాంగ ఫలాలు అందక పోగా మిగతా హక్కులను కూడా గుంజుకుం టున్నారని స్పష్టమౌతోంది. దళితులు నేటికీ అమానుషమైన కులవివక్ష, అంటరానితనం, దాడులు, అవమానాలు, సాంఘిక బహిష్కరణలు, హత్యలు, అత్యాచారాలకు గురవుతున్నారు. అగ్రకుల అహంకారానికి బలౌతున్నారు. ఇష్టపడి ఆహారం తినడానికిలేదు.

జన్మభూమి కమిటీలను రద్దుచేయాలి

జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో అన్ని మండల తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహశీలార్లకు వినతిపత్రం సమర్పించారు. సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ జన్మభూమి కమిటీ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు.

Pages

Subscribe to RSS - February