February

279జిఒని ఉపసంహరించుకోవాలి..

తమ కడుపులను కొట్టే జిఒ 279ని ఉపసంహరించుకో వాలని డిమాండు చేస్తూ పారిశుధ్య కార్మికులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించారు. అందులోభాగ ంగా గుంటూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, నగర నాయకులు ముత్యాలరా వును పోలీసులు అరెస్ట్‌ చేసి అనంతరం విడుదల చేశారు. తొలుత నిర్వహించిన ధర్నాలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, జిఒను రద్దు చేయకుంటే దీర్ఘకాలిక సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై ప్రజాభిప్రాయ ఓటింగు పెట్టండి

విజయనగరం జిల్లా భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలా? వద్దా? అనే విషయమై దమ్ముం టే చంద్రబాబునాయుడు 'ప్రజాభిప్రాయ ఓటింగు' పెట్టాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సవాల్‌ విసిరారు. 'మెజార్టీ ప్రజలు ఎయిర్‌పోర్టు కావాలంటే కట్టుకోండి. లేదంటే తోకము డిచి ఎయిర్‌పోర్టు ప్రతిపాదన విరమించు కోండి' అని సూచించారు. రాష్ట్ర రాజధానికి గన్నవరం ఎయిర్‌పోర్టు సరిపోయినప్పుడు, విశాఖలో ఎయిర్‌పోర్టు ఉండగా ఇక్కడ మరొకటి ఎందుకని ప్రశ్నించారు. ఇది భోగాపురంలోని పెద్దల భూములకు ధరలు పెరగడానికి తప్ప, ప్రయాణికుల కోసమో, ప్రజల కోసమో కాదని విమర్శించారు. అభివృద్దే అనుకుంటే..

ఎపిఎన్‌జిఒ సంఘ రాష్ట్ర మహాసభల పోస్టరావిష్కర‌ణ‌

   ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్ధమేనని కార్మికశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం మండలంలోని నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎపిఎన్‌జిఒ సంఘ 19వ రాష్ట్ర మహాసభలకు సంబంధించి ఆ సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌జిఒల రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు.

అడుగులో అడుగు వేస్తూ...

వంశధార నిర్వాసితుల పాదయాత్ర
కష్టాలను చెప్పుకోవడానికి బయలుదేరిన నిర్వాసితులు
మరో పోరాటానికి సిద్ధమైన బాధితులు
పాదయాత్రకు విశేష స్పందన

ప్రయివేటు రంగంలోనూ దామాషా పద్ధతి

ప్రయివేటు రంగంలో దామాషా పద్ధతి (జనాభా నిష్పత్తి)లో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రయివేటు రంగంలో రిజర్వేషన్స్‌ పోరాట సాధన కమిటీ సలహాదారు కె.ఎస్‌.చలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్‌ ఆడిటోరియంలో ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో 'ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి' అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. కెవిపిఎస్‌ జిల్లా ప్రధానకార్యదర్శి డి.గణేష్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో కె.ఎస్‌.చలం మాట్లాడారు.

BC కమిషన్‌ లేకుండా చేర్చలేం..

బీసీ కమిషన్‌ నివేదిక ద్వారానే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కమిషన్లు లేకుండా ఇంతవరకు ఎవర్నీ బీసీల్లో చేర్చలేదని, అలా చేసినపుడల్లా న్యాయస్థానాలు సదరు రిజర్వేషన్లను కొట్టేశాయని తెలిపారు. అదే సమయంలో కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయవద్దని బీసీ నేతలను కోరారు.

23 నుంచి బడ్జెట్ సమావేశాలు..

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 23 నుంచి మార్చి 17వరకు బడ్జెట్‌ తొలి విడత సమావేశాలు, ఏప్రిల్‌ 25 నుంచి మే 13 వరకు రెండో విడత సమావేశాలు జరుగనున్నాయి. 23న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 25న రైల్వే బడ్జెట్‌, 26న ఆర్థిక సర్వే, 29న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.మరోసారి జీెఎస్టీ బిల్లును పార్లమెంట్‌లో్ ప్రవేశపెట్టనున్నారు

ఖమ్మం కార్పొరేషన్‌పైఎర్రజెండా..

నీతివంతమైన పాలనవైపే ఖమ్మం నగర ప్రజలు ఉంటారని వీరి అండతో కార్పొరేషన్‌పై ఎర్రజెండా ఎగరేస్తామని సీపీఐ(ఎం) తమ్మినేని వీరభద్రం అన్నారు.ఖమ్మం మున్సిపాల్టీ ప్రారంభం నుంచి చిర్రావూరి, అఫ్రోజ్‌ సమీనాలు నీతివం తమైన పాలన అందిం చారని, చిర్రా వూరి ఆశయాలకు అను గుణంగా ముందు కు పోతామన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ప్రయత్నిస్తోందన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని హితువుపలికారు. ఖమ్మం నగర అభివృద్ధి సీపీఐ(ఎం)తోనే సాధ్యమైందన్నారు.

ఇరకాటంలో సోలార్‌ సిఎం..

కేరళ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న సోలార్‌ కుంభకోణం  కేసు దర్యాప్తు విజిలెన్స్‌ కమిషన్‌ చేతుల్లోకి రావటం, విజిలెన్స్‌ కోర్టు మొట్టికాయలు, ఎక్సైజ్‌ మంత్రి రాజీనామా, న్యాయమూర్తిపై మంత్రి తిట్ల దండకం, విజిలెన్స్‌ కోర్టు ఆదేశాలపై హైకోర్టుస్టే, మంత్రిగారి పున్ణప్రవేశం, హోం మంత్రి రమేష్‌ చెన్నితల, ఆరోగ్య మంత్రి శివకుమార్‌పై తాజా ఆరోపణలు, ముఖ్యమంత్రి లంచాల బాగోతంపై సరిత తాజా ఆరోపణలు... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కుంభకోణం మలుపుల జాబితా అనంతంగా సాగిపోతూనే వుంటుంది. అయితే ఈ ఘటనలన్నీ అంతర్లీనంగా ఒకదాదనితో ఒకటి ముడిపడి వుండటం విశేషం.

Pages

Subscribe to RSS - February