February

చంద్రబాబుకు 'తుని' ఒక హెచ్చరిక

సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఎదురు దాడికి మించిన ఆత్మరక్షణ లేదన్న సూత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో బాగా ఉపయోగిం చుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఏ సమస్యనైనా తీసుకోండి, అది రాజధాని సమస్యా, పోలవరం సమస్యా లేక రాయలసీమ అభివృద్ధి సమస్యా... ఏదైనా మంచి అంతా తన ఖాతాలో వేసుకోవడం చెడు జరిగితే అధికారుల మీద తోసేయడం, విమర్శలొస్తే ఎదురుదాడికి దిగడం ముఖ్యమంత్రి అనుసరి స్తున్న వ్యూహం. తాజాగా కాపుసామాజిక వర్గం ఆందోళన విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అదే వ్యూహం అనుసరిస్తున్నారు.

రాజధాని యువత - భరోసా లేని భవిత

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని శంకుస్థాపన సభలో ''మీరు చేసిన త్యాగానికి ఏం చేసినా తక్కువే'' అని ఆ ప్రాంత ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. వాస్తవంగా కూడా భూమినే నమ్ముకున్న 29 గ్రామాల రైతులు, ఆ భూములపై ఆధారపడ్డ కూలీలు, సంబంధిత ఉత్పత్తితో ముడిబడ్డ చేతివృత్తిదారులు, చిరు వ్యాపారులు మొత్తం ప్రజానీకం తమ భూములను, ఉపాధిని, జీవనాన్ని రాజధాని నిర్మాణం కోసం వదులుకొని (బలవంతంగా అయినా) త్యాగం చేశారు.

దళితులంటే బాబుకు చిన్నచూపు

కులాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దళితులను చిన్న చూపు చూసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం తగదన్నారు.

నేడు గవర్నర్లతో ప్రణబ్ భేటి

 రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మరో ముఖ్యమైన అత్యున్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దేశ భద్రత, కేంద్ర పథకాల అమలు, ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంపు తదితర అంశాలు అజెండాగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఢిల్లీ వేదికగా ఇవాళ, రేపు జరగనున్న ఈ సదస్సుకు..ప్రధాని మోదీ సహా...కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు హాజరుకానున్నారు. 

మూడు జ్యూట్‌ మిల్లుల లాకౌట్‌..

విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని మూడు జ్యూట్‌ మిల్లులకు సోమవారం ఆయా యాజమాన్యాలు లాకౌట్‌ ప్రకటిం చాయి. వీటిలో కొత్తవలస మండలం సీతంపేట వద్దగల ఓల్డు ఉమా ట్వైన్‌, చింతలదిమ్మ సమీపంలోని న్యూ ఉమా జ్యూట్‌ ప్రొడక్ట్సు, అదే ప్రాంగణంలోని సాయి జ్యూట్‌ ప్రొడక్ట్సు మిల్లులు ఉన్నాయి. ఇక్కడ పని చేస్తున్న సుమారు వెయ్యి మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ మూడు మిల్లులూ ఒకే కుటుంబానికి చెందిన వారివి. 

అయోధ్యపై సుప్రీంతీర్పు తర్వాతే

అయోధ్యలో రామాలయ నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి కల్‌రాజ్‌ మిశ్రా తెలిపారు. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీల్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి వుంది, ఆ తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం. దాని తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితులను బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. అయితే, బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని సాధ్యం చేసి తీరుతామంటూ వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

1.14 లక్షల కోట్లు మాఫీ..

గత మూడేండ్లలో బ్యాంకుల వద్ద పేరుకుపోయిన రూ. 1.14 లక్షల కోట్ల నిరర్థక ఆస్తులను (ఎన్‌పీఏ) లేదా వసూలు కాని అప్పులను మాఫీ చేశామని ప్రభుత్వం వెల్లడిం చింది. ఈ మొత్తాన్ని భారతీయ బ్యాం కులు గత మూడు ఆర్థిక సంవ త్సరాల్లోనే (2013-15 మధ్య) నష్ట పోయాయి. ఇది గత తొమ్మిదేండ్లలో దేశంలోని 29 రాష్ట్రాలు కలిగి వున్న మొత్తం నిరర్థక ఆస్తుల విలువకన్నా ఎక్కువ.

గ్రీన్‌జోన్‌పై 29 వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ తొల‌గించకుంటే సిఎం క్యాంప్‌ కార్యాయం ముట్టడి అడ్రస్‌లేని అవగాహన సదస్సులు

  అఖిపక్షం ఆధ్వర్యంలో సిఆర్‌డిఎ కార్యాయాన్ని ముట్టడిరచిన  రైతు

గ్రీన్‌జోన్‌పై 29 వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ తొగించకుంటే సిఎం క్యాంప్‌ కార్యాయం ముట్టడి అడ్రస్‌లేని అవగాహన సదస్సు అఖిపక్షం ఆధ్వర్యంలో సిఆర్‌డిఎ కార్యాయాన్ని ముట్టడిరచిన రైతు

వ్య‌వ‌సాయ ప‌రిర‌క్ష‌ణ జోన్‌పై అభ్యంత‌ర ప్ర‌తాల‌ను సి.ఆర్‌.డి.ఏ(విజ‌య‌వాడ‌) కార్య‌ల‌యంలో క‌మీష‌న‌ర్‌కు అంద‌చేయ‌డానికి వెళ్తున్న అఖిల‌ప‌క్ష నాయ‌కులు.

Pages

Subscribe to RSS - February