February

ఢిల్లీలోనూ రాష్ట్రపతి పాలన..

రాజధానిలో కూడా రాష్ట్రపతి పాలన విధించాలనే కుట్రలో భాగంగానే బీజేపీ నాయకత్వం ఢిల్లీలో పారిశుధ్య కార్మికుల సమ్మెను ప్రోత్సహిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో న్యాయసమ్మతం కాని పద్ధతిలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిందని గుర్తు చేస్తూ ఢిల్లీ పరిధిలో కూడా అదే తరహా కుట్రలు పన్నుతోందని ఆయన అనుమానం వ్యక్తంచేసారు

హైకోర్టు తీర్పు దురదృష్టకరం:SFI

ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ సీట్ల భర్తీలో రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం లేదని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తీర్పు ఇవ్వడం దురదృష్టకరమని (భారత విద్యార్థి ఫెడరేషన్‌) ఎస్‌ఎఫ్‌ఐ పేర్కొంది. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభు త్వం తన వైఖరిని ప్రకటించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, నూర్‌మహమ్మద్‌ డిమాండ్‌ చేశారు. హైకోర్టు తీర్పు వైద్య విద్య వ్యాపారానికి మరింత అవకాశం ఇచ్చిన్నట్లు ఉందని భావించారు...

 

279 జీవో రద్దు చేయాలి..

కాంట్రాక్టర్లకు పారిశుధ్య పనులు అప్పగించే జీవో 279ని రద్దు చేయాలని కెవిపియస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ జీవో అమలు చేయాలని గుంటూరు మున్సిపల్‌ ఆర్డీ ఆదేశించడం సిగ్గు చేటన్నారు. మున్సిపల్‌ కార్మికుల్లో 97 శాతం దళిత, గిరిజన ప్రజలే ఉన్నారన్నారు. వారికి ప్రభుత్వ అండ ఉంది అని చెప్పే పాలకులు వారి జీవితాలను ప్రైవేటు కాంట్రాక్టర్లకి అప్పగించడం దుర్మార్గమని ఆందో ళన వ్యక్తం చేశారు. జీవో రద్దు చేయక పొతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రజలే తిరస్కరించాలి..

స్వాతంత్రనంతర చరిత్రలో సత్ప్రవర్తనతో ఉంటానని వ్రాత పూర్వకమైన హామీ ప్రభుత్వానికిచ్చి పనిచేస్తున్న ఒకే ఒక్క సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. సరిగ్గా 68 సంవత్సరాల క్రితం 1948 ఫిబ్రవరి 4న ఆర్‌ఎస్‌ఎస్‌ (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు)ను నాటి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత మరి రెండుసార్లు ఆర్‌ఎస్‌ఎస్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఒకసారి 1975 అత్యవసర పరిస్థితిలో, 1993లో బాబరీ మసీదును కూల్చినప్పుడు. పైకి ఏమి చెప్పినా, వ్రాత పూర్వకంగా క్షమార్పణలు చెప్పినా ఆర్‌ఎస్‌ఎస్‌ స్వభావంలో ఎటువంటి మార్పులేదని చరిత్ర నిరూపిస్తున్నది. ప్రస్తుతం అది మరింత శక్తివంతంగా తయారై తన ఫాసిస్టు భావజాలాన్ని విరజిమ్ముతున్నది.

బాబుకు భూ దాహం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భూ దాహం ఎక్కువైందని భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ దడాల.సుబ్బారావు అన్నారు. వంశధార నిర్వాసితుల సంఘం ఆధ్వర్యాన బ్యారేజీ సెంటర్‌లో నిర్వాసితులు చేపడుతున్న దీక్షలు 15 రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు బుధవారం సంఘీభావం తెలిపిన అనంతరం సుబ్బారావు మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని కార్పొరేట్‌, విదేశీ సంస్థలకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో భూ బ్యాంక్‌ పేరుతో 15 లక్షల ఎకరాలను తీసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు.

వినాశనం చేస్తారా..?

కొవ్వాడ అణుపార్కును ఏర్పాటు చేస్తూ ఉత్తరాంధ్రను వినాశనం చేస్తారా అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. కొవ్వాడ అణుపార్కును వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యాన 102 మంది కార్మికులు మంగళవారం రక్తదానం చేశారు. మండలంలోని అరిణాం అక్కివలసలో శ్యామ్‌పిస్టన్స్‌ ప్లాంట్‌-3 పరిశ్రమ వద్ద చేపట్టిన ఈ రక్తదాన శిబిరాన్ని నర్సింగరావు ప్రారంభిస్తూ మాట్లాడారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న దేశాల్లో నిషేధిస్తున్న ఇలాంటి పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

దివీస్‌ ఔషద్‌ కంపెనీ విస్తరణ ప్రతిపాదన వద్దు

             భీమిలి మండలం చిప్పాడ దివీస్‌ ఔషద్‌ కంపెనీకి అనుబంధంగా కంచేరుపాలెంలో యూనిట్‌ 3 పేరుతో చేపట్టనున్న విస్తరణ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. అర్హులైన స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, కాలుష్యాన్ని నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు సోమవారం స్థానిక తహశీల్ధార్‌ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. 

పునరావాస ప్యాకేజీ అమలుచేయాలి..

పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించి ఎకరాకు రూ.20 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ ఎంపీ మిడియం బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సంఘం ఆధ్వర్యాన ముంపు గ్రామాల్లో జరుగుతున్న పాదయాత్రను ఆయన ప్రారంభించారు. 18 ఏళ్ళల నిండిన నిర్వాసిత యువతీ యువకులకు పునరావాస ప్యాకేజీ అమలు చేయాలన్నారు. నిర్వాసితుల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని కోరారు. బాధితుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే రూ.5లక్షలు అదనంగా చెల్లించాలన్నారు.

ప్రభుత్వ తీరే కారణం:మధు

కాపు గర్జన సభ సందర్భంగా జరిగిన ఘటనలు దురదృష్ట కరం, ప్రజలు భద్రత కోరుకుంటారు, రైలు బోగీలు తగలబడడాన్ని ఎవరూ హర్షించరని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శి పి మధు పేర్కొన్నారు. ప్రభుత్వం వాగ్దానాలు చేసి ఒక తరగతి ప్రజల్లో ఆశలు రేపడం, దీర్ఘకాలం నాన్చడమే ఈ పరిస్థితి రావడానికి కారణమన్నారు. వాగ్దానాలు అమలు పరచాలని ప్రజలు కోరిన నేపథ్యంలో వారితో సంప్రదింపులు జరిపి పరిస్థితి చేజారిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. అయితే, అది ఆ పనిచేయకపోడం వల్లే ఇటువంటి ఘటనలకు దారితీసిందని ఆయన పేర్కొన్నారు.

Pages

Subscribe to RSS - February