మజ్లిస్ నేత, శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగానికి చెందిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. అందులో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి దేశంలో కాంగ్రెస్ను నామరూపాలు లేకుండా చేస్తానని చేసిన వ్యాఖ్యలున్నాయి.కాంగ్రెస్ నేతలు గాంధీలకు బానిసలని ఆయన ఎద్దేవా చేశారు.