ఆక్వాఫుడ్‌పార్క్‌పై రైతుల ఆందోళన

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మత్స్యకారులు, రైతులు ఆందోళనకు దిగారు. తుందుర్రులో చేపట్టిన గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ గురువారం భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఫుడ్‌ పార్కు నిర్మిస్తున్న తుందుర్రు, కె.బేతపూడి, జొన్నలగర్వు గ్రామస్తులతోపాటు.. మొగల్తూరు మండల కేంద్రం, ముత్యాలపల్లి, కొత్తోట, వారతిప్ప, కాళీపట్నం తదితర ప్రాంతాల రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మొగల్తూరు ప్రధాన రహదారి నుంచి నరసాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు.