నష్టాల్లో చమురు సంస్థలు..

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గణనీయంగా పడిపోవడంతో ఆయా సంస్థల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, ఆర్థిక సాయం కోసం ప్రపంచ బ్యాంక్‌ను ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపాయి. కాగా, చమురు ధరలు రెండేండ్లలో 70శాతానికి తగ్గాయి. గత ఏడాది జూన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌ 115డాలర్లు (రూ.7వేల 800) ఉండగా, ఈ ఏడాది 60డాలర్లకు (రూ.4072 ) దిగి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నదని నైజీరియా, అంగోలా, ఆఫ్రికాలోని రెండు ప్రముఖ చమురు కంపెనీలు పేర్కొన్నాయి.