ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని శంకుస్థాపన సభలో ''మీరు చేసిన త్యాగానికి ఏం చేసినా తక్కువే'' అని ఆ ప్రాంత ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. వాస్తవంగా కూడా భూమినే నమ్ముకున్న 29 గ్రామాల రైతులు, ఆ భూములపై ఆధారపడ్డ కూలీలు, సంబంధిత ఉత్పత్తితో ముడిబడ్డ చేతివృత్తిదారులు, చిరు వ్యాపారులు మొత్తం ప్రజానీకం తమ భూములను, ఉపాధిని, జీవనాన్ని రాజధాని నిర్మాణం కోసం వదులుకొని (బలవంతంగా అయినా) త్యాగం చేశారు.