నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడే వారిపై దాడులు చేయటం హేయమైన చర్య - సిహెచ్‌ మణిలాల్‌

నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడే సిపిఎం నాయకులపై దాడులు చేయటం హేయమైన చర్యని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ అన్నారు. మంగళవారం గుంటూరు సుందరయ్య కాలనీకి చెందిన రౌడీషీటర్లు, మాజీ నేరస్తులైన బాజీ, కోటేశ్వరరావులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బస్టాండ్‌ సెంటరులో రౌడీషీటర్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ 2007లో సిపిఎం నాయకుల కృషితో సుందరయ్య కాలనీ ఏర్పడిందని, అప్పటి నుంచి పేదలకు ఇచ్చిన భూములను ఆక్రమించుకోవాలని చూస్తున్న బాజీ, కోటేశ్వరరావు అనే రౌడీషీటర్లు ప్రయత్నిస్తుండటంతో వారిని అడ్డుకునేందుకు సిపిఎం కార్యదర్శి కె.ఆంజనేయులు పార్టీ సహకారంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అతనిపై అమానుషంగా హత్యాయత్యానికి పాల్పడిన రౌడీషీటర్లను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.