February

కడపలో రాయలసీమ బస్సుయాత్ర..

బాబొస్తే జాబొస్తుందంటూ కల్లబొల్లిమాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అడ్డం తిరిగారు.. బాబుకేమో వాస్తవంగా జాబొచ్చింది.. ఇక్కడ ఎంఎల్‌ఏగా ఓడిపోయిన ముద్దుకృష్ణమనాయుడుకీ ఎంఎల్‌సిగా చోటు దక్కింది.. జాబ్‌ ఇస్తారని నమ్మి ఓటేసిన జనానికేమో కష్టాలొచ్చాయి' అంటూ వామపక్ష నాయకులు ఉద్ఘాటించారు. రాయలసీమ బస్సు యాత్రకు మూడో రోజు చిత్తూరు జిల్లాలో అడుగడుగునా ఆదరణ లభించింది. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి గాలేరు-నగరి వస్తే తప్ప ఇక్కడ ప్రజల మనుగడ సాధ్యం కాదన్నారు.

విషం చిమ్ముతున్న 'దివీస్‌'

 దివీస్‌ లేబొరేటరీ.. పరిసర ప్రాంతాలను విషతుల్యం చేస్తోంది. ఒకప్పుడు పిల్లా, పాపలతో సంతోషంగా గడిపే కుటుంబాలిప్పుడు బతుకు తెరువులేక అల్లాడుతున్నాయి. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీని వాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం భీమిలి మండలం చిప్పాడ పంచాయతీలో దివీస్‌ లేబొరేటరీ ఉంది. ఇది దశాబ్దంన్నరగా ఔషధాలకు అవసరమైన పౌడరు ను ఉత్పత్తి చేస్తోంది. ఈ కంపెనీ వెలువరించే వాయు, జల రసాయనాల కాలుష్యంతో భీమిలి మండలంలోని 17 గ్రామాలకు చెందిన జనం టిబి, కీళ్ల నొప్పులు, గుండె, కంటి, కిడ్ని, శ్వాసకోశ వంటి వ్యాధుల బారినపడుతున్నారు.

బాబును జైలుకు పంపుతా:వైగో

తమిళనాట తాము అధికారంలోకి వస్తే... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని జైలుకు పంపుతామని ఎండీఎంకే పార్టీ నేత వైగో సంచలన వ్యాఖ్య చేశారు. ఇటీవల తిరుపతి సమీపంలో జరిగిన తమిళ కూలీల ఎన్ కౌంటర్ ను ప్రస్తావించారు. ఎర్రచందనం కూలీల పేరిట 20 మంది అమాయక తమిళ కూలీలను చంద్రబాబు ప్రభుత్వం ఎన్ కౌంటర్ చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్ కౌంటర్ పేరిట తమిళులను చంపేసిన ఏపీ సీఎం చంద్రబాబును... తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా జైలుకు పంపుతామని ఆయన సంచలన ప్రకటన చేశారు.

ఖమ్మంలో సత్తాచాటేందుకుCPM

పోరాటాల ఖిల్లా ఖమ్మంలో కార్పొరేషన్‌కు ఎన్నికల హడావుడి షురూ అయింది. అభ్యర్ధుల ఎంపికలో పార్టీలన్నీ బిజీబిజీగా ఉంటే.. ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గత మూడు ఎన్నికల్లో పీఠం దక్కించుకున్న సీపీఎం మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తోంది. 

ఏపి అసెంబ్లీ సమావేశాలు మార్చి 5న..

అసెంబ్లీ సమావేశాలు మార్చి ఐదున ప్రారంభమవుతాయని, 10న బడ్జెట్‌ ప్రవేశపెడతామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. కలెక్టర్ల సదస్సలో ఆయన మాట్లాడుతూ 15 నెలల్లోనే రాష్ట్రంలో రెండంకెల వృద్ధి సాధించామని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మండలాల వారీగా జిఎస్‌డిపి నమోదు చేస్తామని వెల్లడించారు.

కన్నయ్య పై మళ్లీ దాడి చేస్తాం..

మూడు గంటలపాటు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యను చితకబాదినట్టు ఇండియాటుడే మీడియా సంస్థ నిర్వహించిన స్ట్రింగ్‌ ఆపరేషన్‌లో ముగ్గురు న్యాయవాదులు చెప్పి అడ్డంగా బుక్కయ్యారు. ఆ ముగ్గురు లాయర్లలో విక్రమ్‌ సింగ్‌ చౌహాన్‌, యష్‌పాల్‌ సింగ్‌, ఓం శర్మ ఉన్నారు. మేం అతడిని వదిలి పెట్టం. అతడిని చితకబాదుతాం. నాపై ఎన్ని కేసులు మోపినా లెక్కచేయను. వాడిపై పెట్రోల్‌ బాంబుతో దాడి చేస్తాను. నాపై హత్యానేరం నమోదైనా ఏమాత్రం వెనుకాడబోను...అని యశ్‌పాల్‌ సింగ్‌ అన్నారు

ఏచూరిని ఆహ్వానించిన నేపాల్‌ ప్రధాని..

భారత్‌, నేపాల్‌ సంబంధాలపై నేపాల్‌ ప్రధానితో ఏచూరి చర్చించారు. రెండు దేశాల మధ్య మైత్రీ బంధం మరింత బలపడాలని కోరినట్లు చెప్పారు. గతంలో నేపాల్‌ రాజ్యాంగ సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితుల నుంచి మళ్ళీ యథాతథస్థితికి చేరుకోవడానికి సిపిఎం జోక్యంతోనే జరిగిందన్న అంశం చర్చకు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంలో నేపాల్‌కు రావాల్సిందిగా ఏచూరిని నేపాల్‌ ప్రధాని కోరారు. 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్య, జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య అరెస్ట్‌, పఠాన్‌కోట్‌ దాడి అంశాలు పార్లమెంట్‌ను కుదిపేసే అవకాశముంది. విపక్షాల అసహనానికి ప్రభుత్వ పక్షం సహనం వహించే ప్రయత్నానికి మధ్య కురుక్షేత్ర సంగ్రామం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్థిక సంస్కరణలకు ఊతమిచ్చే జీఎస్‌టీ బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్రం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. 

సుజనా చౌదరిపై ఆరోపణలు..

సీబీఐ మాజీ డైరెక్టర్‌ కుమారుడు కళ్యాణ్ శ్రీనివాస్‌ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందారనే ఆరోపణలతో ఇప్పటికే కళ్యాణ్‌ శ్రీనివాస్‌ అరెస్ట్ అయ్యారు.ఇదిలా ఉంటే ఇప్పటికే సుజనా చౌదరిపై గతంలో రూ. 100 కోట్లకు రుణం తీసుకుని మారిషస్ కమర్షియల్ బ్యాంక్ అనే అంతర్జాతీయ బ్యాంక్ ను మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.  ఇప్పుడు ఆయనపై ఈ ఆరోపణలు రావటం సంచలనం సృష్టిస్తోంది. కాగా, మారిషస్ బ్యాంక్ ఛీటింగ్ కేసుతో తనకు సంబంధం లేదని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. 

మారిన మాస్టర్ ప్లాన్..

స్వల్ప మార్పులతో మాస్టర్‌ప్లానును విడుదల చేశారు. ఉత్తర దక్షణ దిశలుగా ఉండే ఐదురోడ్లు, తూర్పు పడమరలుగా ఉండే ఒకరోడ్డును కొద్దిగా అటూ ఇటూ జరిపారు. దీంతోపాటు నీరుకొండ దగ్గర ఏర్పాటు చేయనుకున్న రిజర్వాయర్‌ స్థలాన్ని, కొండవీటివాగు, పాలవాగు ప్రవాహ ప్రాంతాలనూ మార్పులు చేర్పులు చేశారు. మంత్రి నారాయణ విడుదల చేసిన ప్లానులో దాదాపు గ్రామాల్లో రోడ్లు వెళ్లడాన్ని నివారించారు. ఒక్క ఐనవోలు గ్రామంలో మాత్రమే నష్టాన్ని కొద్దిగా తగ్గించారు. ఉండవల్లి గ్రామంలో గతంలో నాలుగురోడ్లను ప్రతిపాదించి వాటిని ఎత్తేశారు. అయితే సీడ డెవపల్‌మెంట్‌ ఏరియా ఉన్న మందడంలో రోడ్లను మార్చలేదు.

Pages

Subscribe to RSS - February