దాడులకు భయపడేది లేదు:ఏచూరి

పిఎం ప్రధాన కార్యాలయం(ఎకెజి భవన్‌)పై దాడికి తెగబడిన కాషాయ మూకలు, గత రాత్రి పార్టీ కార్యాలయానికి ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగాయి..కొందరు పనిగట్టుకొని చేతకాక ఇలాంటి దాడులకు పూనుకుంటున్నారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి పేర్కొన్నారు. ఇటువంటి దాడులకు సిపిఎం భయపడదని, వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కావాలనే సిపిఎంపై దాడులకు పాల్పడతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు. చేతనైతే ప్రజాస్వామ్య యుతంగా, సైద్ధాంతికంగా చర్చకు రావాలని, అంతే తప్ప పిరికి పందల మాదిరి వ్యవహరించకూడదని హెచ్చరించారు.