భారత్లో ఫేస్బుక్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నెట్ న్యూట్రాలిటీ వైపే మొగ్గు చూపింది. ఒకే సమాచారానికి వేర్వేరు ధరలు నిర్ణయించడాన్ని వ్యతిరేకించింది. నిబంధనలు ఉల్లంఘించే టెలికాం ఆపరేటర్లకు రోజుకు 50 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.