అయోధ్యపై సుప్రీంతీర్పు తర్వాతే

అయోధ్యలో రామాలయ నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి కల్‌రాజ్‌ మిశ్రా తెలిపారు. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీల్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి వుంది, ఆ తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం. దాని తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితులను బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. అయితే, బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని సాధ్యం చేసి తీరుతామంటూ వివాదాస్పద వ్యాఖ్య చేశారు.