రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచేసి ప్రజల నెత్తిన పెనుభారం మోపింది. కరోనా విలయానికి జనం బతుకులు కకావికలమైన సమయాన ఇళ్లకు వాడే కరెంట్ బిల్లులు పెంచి షాక్ ఇవ్వడం సర్కారు కర్కశానికి తార్కాణం. ఇప్పటికే కేంద్రం గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల మోత మోగిస్తూ ప్రజల నడ్డి విరుస్తుండగా దానికి విద్యుత్ ఛార్జీల భారం అదనం. గృహ వినియోగదారులపై పడే మొత్తం భారం రూ.4,300 కోట్లు. అందులో టారిఫ్ పెంపుదల మూలంగా పడేది రూ.1,400 కోట్లు. ట్రూ అప్ వసూళ్లు రూ.2,900 కోట్లు.