కరోనా వైరస్ ప్రమాదం గుర్తించని మోడీ ప్రభుత్వం దేశాన్ని లాక్డౌన్ చేసింది. ముందస్తు ఏర్పాట్లు లేకుండా అర్థంతరంగా అమలు చేసిన లాక్డౌన్ వలన పేదలు, రోజు కూలీలు, వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, రైతులు అందునా ఆదివాసీలు, దళితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.లాక్డౌన్తో ఆదివాసీల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆదివాసీలు వారపు సంతల్లో ఉత్పత్తులు అమ్ముకుని నిత్యావసరాలు కొనుక్కుంటారు. లాక్డౌన్ వలన వారపు సంతలు మూసేయాల్సి వచ్చింది. సంతలు లేనందున తమ సరుకును అమ్ముకోలేక పోతున్నారు. నిత్యావసరాలు కొనుక్కోలేకపోతున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో చింతపండు పంట వస్తుంది.