April

కరోనాపై పోరు - నేర్పుతున్న పాఠాలు

కరోనా వైరస్‌ మహమ్మారి మన సామూహిక జీవనంలోని అత్యంత తీవ్రమైన సమస్యలనూ, దాని ప్రధాన వైరుధ్యాలనూ బట్టబయలు చేసింది.ఎంత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టినా కొనలేని ఎన్నో వస్తువులు ప్రపంచంలో ఉన్నాయనీ, ''మార్కెట్‌ అదృశ్య హస్తం'' మీద ఆధారపడి పరిష్కరించలేని అత్యంత కష్టతరమైన సమస్యలెన్నో ఉన్నాయనీ, జనానికి 'హఠాత్తుగా' తెలిసివస్తున్నది. అంతే కాదు, ఆ సమస్యలను మనం ఒంటరిగా పరిష్కరించలేమని కూడా తెలిసివస్తున్నది. మన ప్రపంచమంతా ఒకటేననీ, దాన్ని రక్షించడానికి అందరమూ కలిసి పని చేయవలసిందేననీ తెలిసి వస్తున్నది.

మరిన్ని చర్యలు కావాలి..

కరోనా వైరస్‌ నిర్ధారణకు అవసరమైన ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు రాష్ట్రంలో బుధవారం నుండి అందుబాటు లోకి రావడం స్వాగతించదగింది. అవి కూడా విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో తయారుకావడం ముదావహం. రక్త నమూనాకు కరోనా వైరస్‌ ఫలితం రావడానికి ప్రస్తుతం దాదాపు తొమ్మిది గంటల సమయం పడుతుండగా ఈ కిట్ల ద్వారా కేవలం 55 నిమిషాల్లోనే తెలియనుండడం గమనార్హం. అక్కడే వెంటిలేటర్ల తయారీ కూడా ప్రారంభమైంది. వ్యక్తిగత భద్రత పరికరాలు (పిపిఇలు) కూడా రాష్ట్రం లోనే తయారవుతున్నాయి. కరోనా నివారణా చర్యల్లో స్వయంపోషక దిశగా రాష్ట్రం ముందడుగు వేయడం శుభ పరిణామం.

లాక్‌డౌన్‌ - అనుభవాలు

 దేశంలో ఈ లాక్‌డౌన్‌ కాలంలో మనం కొన్ని అంశాలను గమనించవచ్చు. మొదటిది, భారతదేశ ప్రజలంతా ప్రభుత్వ సూచనలను అనుసరించడం ద్వారా తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆకస్మికంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తినప్పటికీ, కరోనా మహమ్మారిని నిరోధించేందుకు ప్రజలంతా ఐక్యంగా తమ పాత్రను పోషిస్తున్నారు.దేశ వ్యాప్తంగా సాధ్యాసాధ్యాల మేరకు భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్టు) కార్యకర్తలు, పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు, ఇతర ప్రజాసంఘాల కార్యకర్తలు...నిరాశలో, అవసరాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం మనకు ప్రోత్సాహకరమైన మరొక అనుభవం.

కరోనా మ‌హ‌మ్మారి... చైనా చికిత్సా విధానం...

కరోనా సోకిన రోగి డాక్టర్‌ మీద వాంతి చేసుకుంటే ఏం చెయ్యాలి? క్వారంటైన్‌ లో వాంతి చేసుకుంటే ఏం చేయాలి? ఆపరేషన్‌ జరుగుతున్న సమయంలో వైరస్‌ నిండిన రక్తం చిందితే ఏం చేయాలి? ఆస్పత్రిలో వైరస్‌ సోకిన ప్రాంతానికి, సురక్షిత ప్రాంతానికి మధ్య తేడాను ఎలా పాటించాలి? ఎటువంటి అనుమానితులను వైద్య పరీక్షలకు ఎంపిక చేసుకోవాలి? కరోనా వైరస్‌ బారినపడి చనిపోయిన వారిని ఎలా అప్పగించాలి?గత మూడు నెలలుగా ముందు వరుసలో నిలబడి పని చేసిన డాక్టర్లు, నర్సుల అనుభవాలను క్రోడీకరించి...ప్రపంచ దేశాలకు ఉపయోపడే విధంగా చైనా ఒక నివేదిక విడుదల చేసింది. పై ప్రశ్నలకు సమాధానం అందులో లభిస్తుంది.

అంతా వ్యాపారమేనా..?

కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన ఐపిఎల్‌ మ్యాచ్‌లను ఎలాగైనా నిర్వహించేందుకు బిసిసిఐ (బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా) సన్నాహాలు చేస్తోందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్చి నెలలో ప్రారంభం కావాల్సిన ఐపిఎల్‌ 2020 మ్యాచ్‌లు దేశవ్యాప్త లాక్‌డౌన్‌లో భాగంగా ఏప్రిల్‌ 14 వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలా? సడలించాలా? కొనసాగించాలా? అన్న విషయమై చర్చోపచర్చలు సాగుతున్నాయి. అనేక రాష్ట్రాలు మరికొద్ది రోజులు కొనసాగించాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హై హై నాయకా!

మనం ఒక యుద్ధంలో ఉన్నాం. అందరమూ సైనికులమే. మన అందరి శక్తి సామర్థ్యాలనీ కలబోసి యుద్ధంలో శత్రువు మీద విజయం సాధించేలా సైన్యాన్ని నడపవలసిన బాధ్యత సేనా నాయకుడిదే. అతగాడేం ఆదేశించినా మనం పాటిస్తాం. ఇందులో సందేహం లేదు. మార్చి 22న నాయకుడు జనతా కర్ఫ్యూ పాటించాలన్నాడు. పాటించాం. చప్పట్లు కొట్టమన్నాడు. చప్పట్లే కాదు, శంఖాలూ మోగించాం. తాళాలు, బాజాలు వాయించాం. మోత మోగించాం. నాలుగ్గంటలన్నా వ్యవధి ఇవ్వకుండానే లాక్‌డౌన్‌ పాటించమన్నాడు. పాటిస్తున్నాం. ఎన్ని లక్షల మంది కాలినడకన లాంగ్‌మార్చ్‌లు చేయాల్సి వచ్చిందో లెక్క లేదు. అయినా నడిచారు. బహుశా ఇంకా కొందరు నడుస్తూనే ఉన్నారు కూడా.

విషాదంలో వలస కార్మికులు

కోవిడ్‌-19 మరణాల కంటే స్వగ్రామాలకు బయలుదేరి మార్గమధ్యంలో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. స్వగ్రామాలకు వస్తుండగా 40 మంది పేదలు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మాసాల గర్భణితో సహా సహరాన్‌ పూర్‌ నుంచి వంద కిలోమీటర్ల కాలినడకన బయలుదేరిన వలస కార్మిక కుటుంబాన్ని 50 కిలోమీటర్లు తర్వాత ప్రజలు ఆదుకొని అంబులెన్స్‌లో సొంతూరుకు పంపారు. నాగపూర్‌ నుంచి కాలినడకన చెన్నై బయలుదేరిన వలస కార్మికుడు హైదరాబాద్‌ శివారులో గుండెపోటుతో మరణించాడు. తొమ్మిది నెలల నిండు గర్భిణీ కాళీబారు దీ అలాంటి గాధే.

వాస్తవాలను దాచిపెడితే విశ్వసనీయత ఏముంది?

ప్రపంచ వ్యాపితంగా ప్రభావం చూపుతున్న ఈ అంటువ్యాధి వల్ల ఆర్థికంగా కలిగే నష్టాల గురించి చాలా చర్చ జరుగుతోంది. కానీ, ప్రజాస్వామిక వాతావరణాన్ని కుదించడం వల్ల జరిగే కీడు గురించి అంతగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. అసోం దగ్గర నుంచి అమెరికా దాకా నిరంకుశ పోకడలు ఎలా పెరిగిపోతున్నాయో చూస్తున్నాం. కరోనాను సాకుగా చూపి హంగరీ ప్రధాని, పచ్చి మితవాది విక్టర్‌ ఓబ్రాన్‌ తప్పుడు సమాచారం ఇచ్చే వారిని జైలుకు పంపడంతో సహా పలు క్రూరమైన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించే చట్టాన్ని పార్లమెంటరీ ఆమోదానికి పెట్టారు. డిక్రీల ద్వారా పాలన సాగించేందుకు ఎమర్జెన్సీని రుద్దారు.

Pages

Subscribe to RSS - April