April

మానవతా మూర్తులు

'ఆరోగ్యమే మహా భాగ్యం' అన్నారు పెద్దలు. ఆ ఆరోగ్యం కాపాడుకోవడమనేది అంత తేలికైన విషయమేమీ కాదు. నేటి ఆధునిక కాలంలో విద్య, ఉద్యోగ వత్తిడులు, సంఘర్షణలు, నగరీకరణ, కాలుష్యం, పర్యావరణ క్షీణత, కల్తీలు వంటి అనేక ఒత్తిడులతో పాటు కార్పొరేటీకరణ తెచ్చిన ప్రమాదం, ప్రకృతి వనరుల దోపిడీ మనిషి అనారోగ్యానికి కారణమౌతున్నాయి. ఆధునిక పోకడలు పెరిగిపోతున్న కొద్దీ మనిషి శరీరంలో రోగనిరోధక శక్తి రోజురోజుకు తగ్గుతోంది. ప్రస్తుతం మానవాళిని వేధిస్తున్న అనేక ఆరోగ్య సమస్యలతో పాటు రోజుకో కొత్త వైరస్‌ పుట్టుకొచ్చి, మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోంది. వీటికి మానవ తప్పిదాలే చాలా వరకు కారణం.

ఏ దేవుడూ ఏ వైరస్‌ని నిర్మూలించలేడు !

దేశంలో కేంద్రప్రభుత్వం పౌరసత్వ చట్టం తెచ్చింది. మత ప్రాతిపదికన జనాన్ని విడగొట్టడం ప్రజలకు నచ్చలేదు. కుల, మత, ప్రాంతీయ బేధాలు, ఆర్థిక స్థోమతలు పక్కనపెట్టి దేశమంతా ఒక్క గొంతై తన నిరసనను తీవ్రంగా వెలిబుచ్చింది. మానవత్వమే వెన్నెముకై దేశమంతటా వందల షాహీన్‌బాగ్‌లు వెలిశాయి. వెనువెంటనే దేశంలోకి కరోనా వైరస్‌ వ్యాపిస్తూ వచ్చింది. అన్ని మతాల దేవుళ్ళూ తలుపులు మూసుకున్నారు. అప్పుడు మళ్లీ కుల, మత ప్రాంతీయ బేధాలు, ఆర్థిక స్థోమతలు పక్కకు తొలగిపోయాయి. మనుషులంతా ఒక్కటిగా నిలిచారు. మానవత్వమే వెన్నెముక అయిన వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు.

పెద్దన్నకు కార్పొరేట్‌ ప్రయోజనాలే ప్రధానం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌! కరోనా వైరస్‌ తీవ్రతను పట్టించుకోని అగ్రరాజ్య అధిపతి!! చైనా, ఇటలీ తరువాత మూడో స్థానంలోకి చేరిన అమెరికా!!! 228 ఏళ్ల న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ చరిత్రలో తొలిసారిగా సోమవారం నాడు వాణిజ్య కేంద్రం మూసివేత. ఉద్దీపన పథకానికి సెనెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. దాంతో ఫెడరల్‌ రిజర్వు (రిజర్వు బ్యాంకు వంటిది) రంగంలోకి అప్పులు, ఇతర ఆస్తులను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దాంతో ఆసియా లోని స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఇది ఎంతకాలం పతనాన్ని ఆపుతుందన్నది ప్రశ్న. ఒకవైపు గంట గంటకూ అమెరికాలో వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది.

నిర్లిప్తత వీడండి !

కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం అస్త్ర విన్యాసమెరుగక బరిలోకి దూకిన సైనికుడిని తలపిస్తోంది. లాక్‌డౌన్‌ కష్టాలతో ఆర్థికంగా చితికిపోయిన కష్టజీవులను ఆదుకోవడం మొదలుకొని కరోనా పోరులో కీలకమైన వైద్య సిబ్బందికి అండగా నిలవడం వరకూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కోవిడ్‌పై పోరు సల్పుతూ ప్రజల దృష్టిలో దేవుళ్లుగా మారిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, పోలీసుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సబబుగా లేదు. వైద్యులకు, పారా మెడికల్‌ సిబ్బందికి కనీస రక్షణ కిట్లను కూడా సరిపడ అందించకపోవడం ఆందోళనకరం.

చైనాపై తప్పుడు ప్రచారాలు, సమాధానం లేని ప్రశ్నలు!

హాలీవుడ్‌ సినిమాల్లో గొరిల్లాల మాదిరి కరోనా తమ ముంగిటికి వచ్చినప్పటికీ గుర్తించలేని మతి తప్పిన స్థితిలో కొందరు ఉన్నారు. వారిలో ట్రంప్‌ ఒకరు. మన దేశంలో కొందరు మడి కట్టుకున్న మాదిరే ప్రపంచంలో తమను ఏ వైరస్‌లు అంటుకోవు అనే దురహంకారులు ప్రపంచమంతటా ఉన్నారు. చైనాలో దాన్ని అరికట్టినా అక్కడ వెలువడుతున్న కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారిలో తప్ప స్థానికుల్లో కొత్త కేసులు లేవు. అనేక మంది ఈ వార్తలను నమ్మటం లేదు.

జెఎన్‌యు @ కోవిడ్‌-19

కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, మెజారిటీ ప్రయోజనాలకు తలొగ్గిన అయోధ్య తీర్పు, జెఎన్‌యు హాస్టల్‌ ఫీజు పెంపు, క్యాంపస్‌లో విద్యార్థులపై ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాల పాశవిక దాడి, ఢిల్లీ అల్లర్ల మధ్య తీసుకొచ్చిన సిఎఎ-2019 చట్టం...వంటి అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా జెఎన్‌యు తన అసమ్మతిని వ్యక్తం చేసింది. విద్యార్థులు అనేకానేక నిరసన ప్రదర్శనలు, అధికారిక విజ్ఞప్తులు చేశారు. పార్లమెంటు వరకు పాదయాత్రలు చేశారు.

వొట్టి మాటలకే పరిమితమా?

 ముఖ్యమంత్రులతో గురువారంనాడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ లాక్‌డౌన్‌ సందర్భంగా రాష్ట్రాలు చేపట్టిన చర్యలను ప్రశంసిస్తూనే ఉపసంహరణ చర్యలు ఒకే విధంగా వుండాలని కోరడం, మరోవైపు చాలామంది సి.ఎం లు ఆర్థిక కష్టాలను ఏకరువు పెట్టి అదనపు నిధుల కోసం విజ్ఞప్తి చేయడం నేడున్న క్లిష్ట పరిస్థితులకు, గత పది రోజుల పరిణామాలకూ ప్రతిబింబమే! ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రధాని ఏకపక్షంగా జనతా కర్ఫ్యూను, అనంతరం లాక్‌డౌన్‌ను ప్రకటించినా దాన్ని దేశ ప్రజలంతా మంచి స్ఫూర్తితో ఆచరించారు.

Pages

Subscribe to RSS - April