April

సంక్షోభంలో వ్యవసాయరంగం:కరత్‌

మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబీవీకే), ప్రజాశక్తి బుకహేౌస్‌ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని ఐవి ప్యాలెస్‌లో '25 ఏళ్ల సంస్కరణలు - ఫలితాలు' అనే అంశంపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ మాకినేని బసవపున్నయ్య స్మారకోపన్యాసం చేశారు.సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభానికి గురైందన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గాయన్నారు. విదేశీ ఉత్పత్తులను స్వేచ్ఛగా అనుమతించటంతో దేశీయ వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లభించటంలేదన్నారు. సరళీకరణ వల్ల దేశంలో పారిశ్రామికాభివృద్ధి క్షీణించిందన్నారు. బీహెచ్‌ఈఎల్‌ వంటి సంస్థల్లో ఉత్పత్తి తగ్గినట్లు తెలిపారు.

430 కోట్లు దారి మళ్లించిన మాల్యా

బ్యాంకులకు పెద్దయెత్తున రుణాలు ఎగ్గొట్టిన కింగ్‌ఫిషర్‌ మాజీ అధిపతి విజరు మాల్యా విదేశాల్లో ఆస్తుల కొనుగోలు కోసం రూ. 430 కోట్లు అక్రమంగా దారి మళ్లించారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ఆదివారం పత్యేక కోర్టుకు తెలిపింది. ఐడిబిఐ బ్యాంకు నుంచి కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తీసుకున్న రూ.950 కోట్ల నుంచే దీనిని మళ్లించినట్లు ఇది వివరించింది. 

'భారత మాత'కు ఇచ్చే గౌరవం ఇదేనా?

భారత్‌ మాతాకీ జై... అనక పోతే దేశద్రోహమే అని సంఫ్‌ు పరివార్‌ అనుయా యులు ఈ మధ్య పదే పదే అంటున్నారు. దేశాన్ని తల్లిగా చూడాలా, తండ్రిగా చూడా లా? లేక తల్లితండ్రిగా చూడ కుండా వేరే పద్ధతిలో దేశ భక్తిని ప్రదర్శించే మార్గమే లేదా? అన్న చర్చ కూడా ఈ సందర్భంగా దేశంలో జరుగుతున్నది. ప్రస్తు తం ఈ చర్చల జోలికి పోవడం నా ఉద్ధేశ్యం కాదు. దేశంలోని మాతలకు (స్త్రీలను) సమానత్వం ఇవ్వకుండా, వారికి తగిన గౌరవం ఇవ్వకుండా భారత్‌ మాతాకీ జై అంటే దేశభక్తులై పోయి నట్లేనా? అన్నది నేను లేవనెత్త దలుచు కున్న చర్చ. 

25 ఏళ్ల సంస్కరణలు - ఫలితాలు

 25 ఏళ్ల సరళీకరణ విధానాల వల్ల దేశంలో అన్ని రంగాల్లోనూ అసమానతలు తీవ్రంగా పెరిగాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటంతోపాటు భారత దేశానికి అనుకూలమైన సోషలిస్టు ప్రత్యామ్నాయం కోసం కృషి చేయటం ప్రజలముందున్న కర్తవ్యమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ స్పష్టం చేశారు. మార్క్సిస్టు మేథావి మాకినేని బసవపున్నయ్య తన జీవితాంతం సోషలిజం కోసం పని చేశారని, దేశంలో సోషలిస్టు ప్రత్యామ్నాయాన్ని సాధించటమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళని కరత్‌ చెప్పారు. 25 ఏళ్లలో సరళీకృత ఆర్థిక విధానాల అమలు దేశ ఆర్థిక రంగం మీదే కాకుండా రాజకీయ, సామాజిక, సాంస్కృక రంగాలన్నింటిపైనా తీవ్ర ప్రభావాన్ని చూపించాయన్నారు.

'బ్రాండిక్స్‌' వైఖరిపై భగ్గుమంటున్న మహిళా కార్మికులు

( visakha rural) ;   బ్రాండిక్స్‌ యాజమాన్యం మహిళలు పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కార్మికులు ఉద్యమించారు. చాలీచాలని వేతనాలతో సంవత్సరాలు తరబడి పనిచేస్తున్నప్పటికీ నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని బ్రాండిక్స్‌ మెయిన్‌ గేట్‌ వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. పిఎఫ్‌, గ్రాట్యూటీ, జీతాల పెంపు వంటి సమస్యలను పట్టించుకోలేదన్నారు. కార్మికశాఖ అధికారులు యాజమాన్యానికి తలొగ్గారన్నారు. పలు పర్యాయాలు జీతాలు పెంచాలని డిమాండ్‌ చేసిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం మొండి వైఖరి నశించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

నిన్న అంబేద్కర్ కి 125అడుగుల విగ్రహం కడతామని గొప్పలు చెప్పి . . . ఈరోజు రాజ్యాంగ విరుద్దంగా CRDA పరిధిలో ఇచ్చే ఉద్యోగాలకు రిజర్వేషన్స్ వర్తించవు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం దారుణం . విజయవాడలో సీపీఎం నిరశన .

నిన్న అంబేద్కర్ కి 125అడుగుల విగ్రహం కడతామని గొప్పలు చెప్పి . . . ఈరోజు రాజ్యాంగ విరుద్దంగా CRDA పరిధిలో ఇచ్చే ఉద్యోగాలకు రిజర్వేషన్స్ వర్తించవు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం దారుణం .  విజయవాడలో సీపీఎం నిరశన .

Pages

Subscribe to RSS - April