April

పనామ పేపర్స్ లో కోనేరు మధు

ఆంధ్రప్రదేశ్‌ ఇండిస్టియల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కార్పొరేషన్‌-ఎమార్‌ కేసును ఫిబ్రవరి, 2012లో ఈ ట్రైమెక్స్‌ కంపెనీ అధినేతపై నమోదైంది. అయితే రెండు నెలల తర్వాత మధు కోర్టు ముందు హాజరయ్యారు. అనూహ్యంగా అప్పుడే బెయిలూ లభించింది. ఈ కేసు పూర్తి వివరాల్లోకెళ్తే లగ్జరీ భవంతి అమ్మకపు లావాదేవీల్లో రూ.138 కోట్లు మధు తండ్రి రాజేంద్ర ప్రసాద్‌కు అందినట్లు తెలుస్తోంది. ఆ డబ్డును దుబారులోని మధుకు పంపినట్లు ఛార్జిషీటులో పేర్కొన్నారు. అంతేగాక ఈ వ్యవహారంపై ఏప్రిల్‌9, 2013లో ఇచ్చిన వివరణను మోసాక్‌ ఫోన్సెకాకు అదే రోజున పంపినట్లు స్పష్టమైంది.

దళితుల సమస్యల పరిష్కారం కోసం..

రాష్ట్రంలో దళితుల సమస్యలు పరిష్కారం కాకపోగా హక్కులనూ కాలరాస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. నేటికీ అంటరానితనం సమాజంలో వేళ్లూనుకుని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విగ్రహాలు పెట్టి ప్రజల కళ్లుగప్పేందుకు పాలకులు పూనుకుంటున్నారని, ఆయనకు నిజమైన నివాళులర్పించాలంటే రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని, సామాజిక న్యాయం అందేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులతో భర్తీ చేయాల్సిన బ్యాక్‌లాగ్‌ పోస్టులను అర్హులు లేరనే పేరుతో ఇతరులకు దారాదత్తం చేస్తున్నారని, అంబేద్కర్‌ ఆశించిన పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయడం లేదని అన్నారు.

TDP సుజనాచౌదరికి అరెస్టు వారెంట్‌..

మారిషస్‌ బ్యాంకుకు రూ. 106 కోట్ల రుణం ఎగవేత కేసుకు సంబంధించి కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజి శాఖ సహాయ మంత్రి వైఎస్‌ సుజనా చౌదరికి నాంపల్లి కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం మూడుసార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ హాజరుకాకపోవడంతో నాంపల్లి 12 వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ గురువారం అరెస్టుకు ఉత్తర్వులు ఇచ్చారు. 

ఆర్థిక నేరగాళ్లపై ఆంక్షలుండవా..?

దేశంలో గతంలో ఎన్న డూ కనీవినీ ఎరుగని రీతిలో బ్యాంకులు కొంత ఆర్థిక ఒడిదు డుకులకు గురవుతు న్నాయా..? అంటే అవుననే అనిపిస్తుంది. బ్యాంకుల ఆర్థిక మూలాలను దెబ్బ తీసిందెవరు...? దేశంలో పేదలు నమ్మకంతో తమ కష్టార్జితాన్ని దాచుకునే బ్యాంకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే పరిస్థితేంటి...? అనే చర్చ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం. పెట్టు బడిదారులు తమ అవసరాలకు బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుని తీరా వారు చేపట్టిన సంస్థలు అప్పుల పాలయ్యాయని ఎగవేత దారులుగా మారుతున్నారు. 'భారతదేశంలో పరిశ్రమలు పెట్టండి, అనేక విధాలుగా ప్రోత్సాహకాలు అందిస్తాం.

విమ్స్‌ స్థలం ప్రైవేట్‌ కు ధారాదత్తానికి కుట్ర

విమ్స్‌ స్థలం ప్రైవేట్‌ కు ధారాదత్తానికి కుట్ర
కార్పొరేట్‌ హాస్పటల్స్‌తో తొలుగుదేశం - బిజెపి కుమ్మక్కు
విమ్స్‌ నిర్వీర్యానికీ ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి అప్పగింత
    
    విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికెల్‌ సైన్స్‌ (విమ్స్‌) హాస్పటల్‌ అవుట్‌ పేషెంట్‌ (ఒ.పి) సేవలను ఏప్రిల్‌ 11న ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విమ్స్‌లో వైద్య సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభించకుండా కేవలం ఓపి సేవాలు  ప్రారంభించడం వెనుక తెలుగుదేశం, బిజెపిలు పెద్ద కుట్రకు పల్పపాడ్డాయి. ఈ చర్యను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) గ్రేటర్‌ విశాఖ నగర కమిటి తీవ్రంగా ఖండిస్తున్నది.

దివీస్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

- ముగ్గురు కార్మికులకు గాయాలు
- ఆందోళనలో కార్మికులు, స్థానికులు
- సంఘటనాస్థలాన్ని పరిశీలించిన సిపిఎం, సిఐటియు నేతలు 
- దివీస్‌ ప్రమాదఘటనపై సమగ్రదర్యాప్తు సిపిఎం, సిఐటియు డిమాండ్‌ 

ఫ్లైఓవర్‌ అవినీతి, నారద టేపుల స్కామ్‌..

 బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన సిపిఐ(యం), కాంగ్రెస్‌ ఆ పనిలోనే వున్నాయి. ఫ్లైఓవర్‌ అవినీతి, నారద టేపుల స్కామ్‌ అస్త్రాలతో ప్రచారం చేస్తున్నాయి. అయితే తృణమూల్‌ అవినీతి పాపం ప్రధానమైనదే అయినప్పటికీ ... తమ ఎన్నికల ప్రచార అంబుల పొదిలో మరిన్ని పదునైన అస్త్రాలున్నాయంటున్నారు ప్రతిపక్ష నేతలు. ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి, పారిశ్రామికీకరణ లేమి, క్షీణిస్తున్న శాంతిభద్రతలు వంటి పలు అంశాలకు కూడా సమానమైన ప్రాధాన్యతనిస్తామంటున్నారు. 

రూ.1,80,000 కోట్ల అవకతవకలు..

 కాంగ్రెస్‌, అవినీతి పర్యాయ పదాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ ఎద్దేవా చేశారు. అస్సాంలోని బోర్ఖెత్రే నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో భారీ అవినీతి జరిగిందని, రూ.1,80,000 కోట్లకు అవకతవకలు జరిగినట్లు కాగ్‌ ఎత్తిచూపిందని పేర్కొన్నారు. నిధుల ఖర్చుకు సంబంధించిన వినియోగపత్రాలు ఇవ్వాలని కాగ్‌ కోరితే ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఇవ్వడం లేదని విమర్శించారు.

బీహర్ మద్య నిషేధంపై పిల్

 బీహర్లో నితీష్ కుమార్ ప్రభుత్వం విధించిన సంపూర్ణ మద్యనిషేధంపై A.N సింగ్ అనే వ్యక్తి పాట్నా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశాడు. 
ఈ నిషేధం మనిషి తినే తిండి, తాగే అలవాట్లను అరిస్తుందని పెర్కొన్నాడు. రాజ్యాంగంలోని అరిక్టల్ 14,19,21,22 లకు ఈ చర్య వ్యతిరేకమని పెర్కొన్నాడు. దీనిపై విచారణకు కోర్టు సమయం కేటాయించవలసి ఉంది.

Pages

Subscribe to RSS - April