April

తాగునీటి సమస్యపై దృష్టేదీ?

రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కరించే దిశగా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. ఈ నెల 3, 4 తేదీల్లో విజయవాడలో జరి గిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ తీర్మానాలను రాష్ట్ర కార్యదర్శి పి. మధు మంగళవారం నెల్లూరులో విడుదల చేశారు. నిజాలను కప్పిపుచ్చి సమస్యలను పక్కదారిపట్టించేలా బూటకపు ప్రచా రాలకు దిగుతున్న ప్రభుత్వ తీరును సీపీఐ(ఎం) తీవ్రంగా విమర్శించింది. రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నా తగిన సహాయ చర్యలు చేపట్టలేదని ఆ పార్టీ పే ర్కొంది. వివిధ రంగాల కార్మికులు తమ సమస్యల పరి ష్కారానికి ఉద్యమబాట పట్టారని ఆందోళన వ్యక్తం చేసింది.

భారత ప్రధాని పాక్ కు లొంగిపోయారు

పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై జరిగిన దాడిని పరిశోధించడానికి పాకిస్థాన్‌ బృందాన్ని ఆహ్వానించడం ద్వారా ప్రధాని మోడీ భారత్‌మాతాకు వెన్ను పోటు పొడిచారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు.  దేశ సమగ్రతను అవమాన పర్చిన మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ప్రధాని పాకిస్థాన్‌కు లొంగిపోయారని విమర్శించారు. గత 65 సంవత్సరాల కాలంలో ఏ ప్రధాని కూడా ఇలాంటి ఘోర తప్పిదానికి పాల్పడలేదని అన్నారు.

బడ్జెట్‌ సమావేశాల్లో GSTఆమోదం..

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు (రెండో విడత) ఈ నెల 25 నుంచి ప్రారంభమవనున్నాయి. మే 13 వరకు జరిగే ఈ సమావేశాల్లో జీఎస్‌టీ సహా పలు కీలక బిల్లులు ఆమోదానికి ప్రతిపక్షాలు సహకరిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.కీలకమైన జీఎస్‌టీ బిల్లును రాజ్యసభ ఆమోదించాల్సి ఉందని, ఇందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయన్న నమ్మకం తమకుందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు.

కోల్ స్కాం దోషులకు జరిమానా,జైలు

దేశంలో సంచలనం రేపిన కోట్లాది రూపాయల బొగ్గు కుంభకోణంలో తొలి తీర్పు సోమవారం వెలువడింది. మోసం, నేరపూరిత కుట్రలకు గాను ఝార్ఖండ్‌ ఇస్పాత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జేఐపీఎల్‌) డైరెక్టర్లు ఆర్‌.సి. రుంగ్తా, ఆర్‌.ఎస్‌.రుంగ్తాలకు ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించింది. నిజాయతీ, నైతికతల్లేని ఇలాంటి వ్యాపారుల వల్ల భారత్‌ అభివృద్ధిలో వెనుకబడిపోతోందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రుంగ్తాలిద్దరికీ ప్రత్యేక సీబీఐ జడ్జి భరత్‌ పరాశర్‌ జైలుశిక్షతో పాటు రూ. 5 లక్షల వంతున జరిమానా విధించారు. జేఐపీఎల్‌ కంపెనీకి కూడా రూ. 25 లక్షల జరిమానా విధించారు.

బెంగాల్లో స్థానిక నేతలు Vs స్టార్స్

ఎన్నికల దగ్గరకొచ్చేకొద్దీ అన్ని పార్టీలూ స్టార్లను రంగంలోకి దింపుతుంటే సిపిఐ(యం) మాత్రం స్థానిక నేతలకు ప్రాధాన్యతనిస్తోంది. స్టార్లూ వర్సెస్‌ స్థానిక నేతలుగా ప్రచారం సాగుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ సినీ, క్రీడా తారలకు ప్రాధాన్యతనిస్తుండగా... బి.జె.పి, కాంగ్రెస్‌ లోకల్‌ నేతల కంటే జాతీయ నాయకుల వైపే మొగ్గు చూపుతున్నాయి. దీదీ ప్రచార బృందంలో రాజ్‌ చక్రవర్తి, సోహమ్‌ చక్రవర్తి, మిమి చక్రవర్తి, శ్రీకాంతో మెహతా, హిరన్‌ చటర్జీ, యష్‌ దాస్‌ గుప్తాతో పాటు ఫుట్‌ బాల్‌ ఆటగాడు బైచుంగ్‌ భుటియా వంటి స్టార్‌ ప్రచారకులూ వున్నారు.

బెజవాడలో మీ దందా నిజం కాదా..?

గతంలో సిబిఐ కేసు నుంచి తప్పించుకొనేందుకే రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్‌ వర్ల రామయ్య టిడిపిలో చేరారని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్‌ రతన్‌ విమర్శించారు. విజయవాడలో ఆయన సిఐగా పనిచేస్తూ పాల్పడిన దందా అందరికీ తెలుసని, అలాంటి వ్యక్తి తమ నేత సి రామచంద్రయ్యపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. 

వారికి భారీ మూల్యం తప్పదట..!

‘పనామా పత్రాల్లో’ 500 మంది భారతీయుల పేర్లు ఉన్నట్లుగా వెల్లడైన నేపథ్యంలో.. ఓ బహుళ సంస్థల దర్యాప్తు బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. విదేశాల్లో అక్రమ ఖాతాలను కలిగి ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

రోజువారీ వేతనం180/- నుంచి 194/-

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌) కింద వేతనాన్ని రోజుకు రూ.180 నుంచి రూ.194కు పెంచుతూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన వేతనాలు ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

బలవంతపు భూ సేకరణ ఆపాలి.

సబ్బవరం మండలం వంగలి సర్వేనెంబర్‌ 109, 135, 240, 241, 242లోగల అసైన్డ్‌ భూములను బలవంతంగా లాక్కొనే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న డిమాండ్‌ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సేకరణకు సంబంధించి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన భూహక్కుదారుల జాబితా తప్పుల తడకగా ఉందన్నారు. హక్కుదారులలో కొంతమందికి ఐదు ఎకరాల సాగు భూమి ఉండగా 2, 3 ఎకరాలు ఉన్నట్లుగా చూపిస్తున్నారని తెలిపారు. మరికొంత మంది హక్కుదార్ల పేర్లు జాబితాలో లేవన్నారు.

లక్షల తలలు నరికేసే వాళ్లం:రాందేవ్

‘భారత్‌ మాతాకీ జై’ నినాదంపై వివాదంలో యోగా గురు రామ్‌దేవ్‌ బాబా మరింత ఆజ్యం పోశారు. తమకు దేశ రాజ్యాంగంపై గౌరవముందని, లేదంటే ఆ నినాదాన్ని చేయననే లక్షల మంది తలలు నరికేసే వాళ్లమని ఘాటుగా వ్యాఖ్యానించారు. 

Pages

Subscribe to RSS - April