ఆర్టికల్స్

సెప్టెంబర్‌ 2 సమ్మె ఎందుకు?

ప్రపంచీకరణ నేప థ్యంలో స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారీ వర్గాల ఒత్తిళ్ల వల్ల 1991 నుంచి పాలకవర్గాలు అవలంబిస్తున్న సరళీ కరణ ఆర్థిక విధానాలు, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆది నుం చీ కార్మిక సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో కార్మికవర్గాన్ని ఒక వర్గంగా ఐక్యంచేయటానికి కృషి జరుగుతున్నది. వివిధ కార్మిక సంఘాల నాయకత్వంలోని కార్మిక వర్గం ఇప్పటికే 15 సార్లు సార్వత్రిక సమ్మెలు చేసి, ఈ విధానాలను తాము తుదికంటా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. తత్ఫలితంగా ప్రయివేటీక రణ, సరళీకరణ విధానాల అమలు వేగం తగ్గింది. అయినా వాటి అమలు కోసం నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం సర ళీకరణ...

సమ్మెతో కార్పొరేట్‌ పాలకులకు సమాధానం..

  కార్పొరేట్‌ పాలకులైన బిజెపి, టిడిపిలు కార్మిక వర్గంపై యుద్ధం ప్రకటించాయి. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి, ఉరికొయ్యలు, చెరసాలలు, ఆత్మబలిదానాలతో సాధించు కున్న కార్మిక చట్టాలను సవరించి, కార్పొరేట్‌ సంస్థలు, యాజ మాన్యాలు మరింత దోపిడీ చేసుకునే విధంగా మార్పులు చేస్తున్నాయి. కార్మిక చట్టాల సవరణ సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే... ఎటువంటి హక్కులూ, రక్షణా లేని కార్మికునిగా మార్చడం. కార్పొరేట్‌ పాలకులు కార్మిక వర్గానికి బానిస సంకెళ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. కార్మిక వర్గం ఉద్యమాలు, ఆత్మబలిదానాలతో రూపొం దించబడ్డ, ఐడి యాక్ట్‌, ట్రేడ్‌ యూనియన్‌ యాక్ట్‌, ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌, కాంట్రాక్టు వర్కర్స్‌ రెగ్యులరైజేషన్‌ అండ్‌ అబాలిషన్‌ యాక్ట్‌, అప్రంటీస్...

పొంచివున్న విద్యుత్‌ ఛార్జీల ముప్పు

ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో ఐదేళ్ళ బకాయిలను ఇప్పుడు వసూలు చేస్తామనడం సబబు కాదు. ఇప్పుడు 2009-10 నుంచి 2013-14 వరకు ఎపిఇపిడిసిఎల్‌ రూ.1,158 కోట్లు, ఎస్‌పిడిసిఎల్‌ రూ.6,051 కోట్లు ట్రూఅప్‌ ఛార్జీలు ప్రతిపాదించారు. రెండు డిస్కాంల వాదనల్లో అనేక అంతరాలు, అసంగతాలు ఉన్నాయి. ఇఆర్‌సి అనుమతించిన దానికంటే తక్కువ విద్యుత్‌ను సరఫరా చేశారు. అలాగే కొనుగోలు చేసిన విద్యుత్‌ పరిమాణం కూడా తక్కువే. (పరిస్థితి ఇలావుండగా రానున్న ఐదేళ్లలో విద్యుత్‌ డిమాండ్‌ మూడు రెట్లు పెరుగుతుందన్న ప్రభుత్వ వాదన గాల్లో మేడలు కట్టడమే కదా!) అయినా ఖర్చు మాత్రం చాలా పెరిగిందని డిస్కాంలు వాదిస్తున్నాయి.

గడచిన ఎన్నికల్లో ''జాబు కావాలంటే బాబు రావాలి'' అని చేసిన...

చర్చలు తప్ప మరో మార్గం లేదు..

భారత్‌, పాకిస్తాన్‌ జాతీయ సలహాదారు స్థాయీ (ఎన్‌ఎస్‌ఎ) చర్చలు చివరి నిమిషంలో రద్దు కావడం బాధాకరం. ఇరు దేశాల్లోనూ శాంతికి విఘాతం కలిగించాలని కోరుకునే ఛాందసవాద శక్తులకు ఇది ఊతమిస్తోంది. నవంబరు 26 ముంబయి దాడుల తరువాత ప్రతిష్టంభనలోపడిన ద్వైపాక్షిక చర్చలను పునరుద్ధరించేందుకు జరిగిన మరో ప్రయత్నం ఇలా ఆగిపోవడం శోచనీయం. ఈ పరిణామం ఇరుదేశాల్లోని చర్చల ప్రక్రియను వ్యతిరేకించే శక్తులకు సంతోషం కలిగించవచ్చు, కానీ, ఈ ఉపఖండంలో కమ్ముకున్న అనిశ్చితిని తొలగించాలని కోరుకునేవారికి ఇది ఒక విచారకరమైన అంశం. ఆరు వారాల క్రితం షాంఘై కూటమి సమావేశాల సందర్భంగా రష్యాలోని ఉఫాలో భారత్‌, పాకిస్తాన్‌ ప్రధానులిరువురూ కూర్చొని ఉపఖండంలో శాంతి, సామరస్యాలను నెలకొల్పేందుకు చర్చల...

ఆత్మహత్యల భారతం..

నేడు భారతదేశంలో ప్రతి 42 నిమిషాలకు ఒక రైతన్న ఆత్మహత్య చేసుకుంటున్నాడు. 'అచ్ఛే దిన్‌'. జాతీయ నేరాల రికార్డు బ్యూరో(ఎన్‌సిఆర్‌బి) ప్రకారం 2014లో దేశంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 12,360. రైతుల ఆత్మహత్యల సంఖ్య తక్కువ చేసి చూపించటానికి ఎన్‌సిఆర్‌బి తక్కువ ప్రయత్నమేమీ చేయలేదు. నిజాన్ని మరుగుపర్చటానికి రైతుల ఆత్మహత్యలను రెండు భాగాలుగా విభజించింది. ఒకటి రైతు, రెండోది వ్యవసాయ కార్మికులు. దీనివల్ల రైతు ఆత్మహత్యల సంఖ్య 67 శాతం తగ్గిపోయింది. కానీ జరుగుతున్నదేమంటే చారిత్రకంగానే వ్యవసాయ కార్మికులు కూడా రైతులలో భాగంగానే పరిగణించబడతారు. 6,050 మంది రైతులు, 6,310 మంది వ్యవసాయ కార్మికులు. ఈ రెండు గణాంకాలూ కలిపితే 2014లో రైతు ఆత్మహత్యల సంఖ్య 12,360...

పరిశ్రమాధిపతులకు డికెటి భూములు..

 చిత్తూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి పేరు మీద 1,60,938 ఎకరాలకు పైగా భూములను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ఇందులో ప్రధానంగా ఎస్‌సి, ఎస్‌టి, బలహీనవర్గాలు సాగుచేసుకుంటున్న డికెటి (అసైన్డ్‌) భూములపై కేంద్రీకరించి వివరాలను సేకరిస్తోంది. ఈ భూములు ఒకే దగ్గర వందల, వేల ఎకరాలు ఉంటున్నాయి. పాత చట్టాల ఆధారంగా ప్రభుత్వ అవసరాలకు తీసుకోవచ్చని భయపెట్టి తీసుకుంటున్నారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా, అది ప్రభుత్వ స్థలంగా చూపి లాక్కోవాలని చూస్తున్నారు. మొత్తం చిత్తూరు జిల్లాలో 66 మండలాలుండగా, అందులో 22 మండలాల నుంచి 1,60,938.58 ఎకరాల భూమి సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు ఎపిఐఐసి వెబ్‌సైట్‌లోనూ,...

ప్రత్యేక హోదా సాధనతోనే రాష్ట్రాభివృద్ధి..

పరిశేష ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందటానికి ప్రత్యేకహోదాను సాధించటం అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఆదాయాన్నిచ్చే రాజధాని నగరం హైదరాబాద్‌ తెలంగాణకు రాజధానిగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిని నిర్మించుకోవాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా లోటులో ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.16,000 కోట్ల లోటు ఉంది. విశాఖపట్నం, తిరుపతి లాంటి చోట్ల మినహా పారిశ్రామికాభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇటువంటి స్థితిలో రాష్ట్రం ఆభివృద్ధిని సాధించాలంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించటం తప్పనిసరి. రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి...

ప్రమాద ఘంటిక..

సోమవారంనాటి భారతీయ స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం రానున్న ఆర్థిక సంక్షోభ తీవ్రతకు ప్రమాద ఘంటిక. దేశ మార్కెట్‌ చరిత్రలో బ్లాక్‌ మండే. నష్టాల సునామీలో మదుపర్లకు చెందిన సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయని అంచనా. సెన్సెక్స్‌ 1,621.51 పాయింట్లు కోల్పోయి 25,741.56 పాయింట్ల వద్ద, నిఫ్టీ 490.95 పాయింట్లు కోల్పోయి 7,809 పాయింట్ల వద్ద ముగిశాయి. గడచిన ఏడేళ్లలో స్టాక్‌ మార్కెట్లు ఇంత భారీగా పతనం కావడం ఇదే ప్రథమం. సెన్సెక్స్‌ చరిత్రలో చోటు చేసుకున్న భారీ పతనాల్లో మూడవది. 2008 జనవరి 21 తర్వాత అతి పెద్ద నష్టం. 26 వేల పాయింట్ల దిగువకు చేరడం సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది. సెన్సెక్స్‌ అతిపెద్ద పది పతనాల్లో ఎనిమిది ప్రపంచ ఆర్థిక మాంద్యం సంభవించిన...

ధరలను నియంత్రించాలి..

ధరల పెరుగుదలను నియంత్రించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇందుకు ప్రజాపంపిణీ వ్యవస్థను సార్వత్రీకరించాలి. నిత్యావసర సరుకుల మార్కెట్‌లో స్పెక్యు లేషన్‌ను నివారించాలి. అఖిల భారత వినిమయ ధరల సూచిక 2013-13లో 10.4 శాతం పెరగగా 2013-14లో 8.3 శాతం, 2014-15లో 5.3 శాతం పెరిగింది. ఆహార వస్తువుల ధరలు మరింత పెరుగుతున్నాయి. వీటి ధరలు 2012-13లో 12 శాతం, 2013-14లో 8.3 శాతం, 2014-15లో 6.3 శాతం పెరిగాయి. గత 8 నెలలుగా ధరల పెరుగుదల రేటు పెరుగుతున్నది. నవంబరు 2014లో ద్రవ్యోల్బణం 4.12 శాతం కాగా మే 2015లో 5.74 శాతం అయింది. జూన్‌ 2015లో ద్రవ్యోల్బణం రేటు భారతదేశంలో 5.4 శాతం కాగా చైనాలో 1.4 శాతమే ఉన్నది.
బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు డిఎ రేటు 2007 జనవరిలో 0 కాగా...

రాజధాని రాజకీయ క్రీడలో చంద్రబాబు..

మిగిలిన విషయాలెలా ఉన్నా ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం దీర్ఘ కాల దృష్టితో జరగాల్సిన చారిత్రిక వ్యవహారం. అందులోనూ నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ప్రజా రాజధాని నిర్మిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటికి రెండుసార్లు ప్రకటించి ఉన్నారు. కానీ ఆచరణలో ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రజలనూ, ప్రజల్లో పనిచేసే పార్టీలనూ ఏ మాత్రం విశ్వాసంలోకి తీసుకోని ఏకపక్ష తతంగంగా నడుస్తున్నది. ఆఖరుకు తన మిత్రపక్షాలనూ, స్వంత పాలకపక్ష ప్రముఖులనూ, ప్రభుత్వ నిర్వహణకు ప్రాణవాయువు లాటి ఉద్యోగ అధికార వర్గాలను కూడా తికమక పెట్టేదిగా మారింది. రాజధానికి ఎంపిక చేసిన అమరావతికి ఏ పార్టీ అభ్యంతర పెట్టకపోయినా అక్కడ జీవించే రైతుల, గ్రామీణ పేదల, శ్రామికుల ఘోషను కూడా పట్టించుకోని విపరీత స్థితి....

విద్యార్థుల బలి..

కార్పొరేట్‌ విద్యా సంస్థల ఉక్కుపాదాల కింద విద్యా కుసుమాలు నలిగిపోతున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తుండగా అటువంటి ఉదంతాలు ఇటీవల వరుసగా జరగడం పెను విషాదం. సోమవారం కడప సమీపంలో నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థినులు నందిని, మనీషా బలయ్యారు. అంతలోనే గురువారం నెల్లూరు జిల్లా గూడూరులో డిఆర్‌డబ్ల్యు కాలేజీలో బిఎస్‌సి విద్యార్థిని రవళి ప్రాణాలు తీసుకుంది. తమ పిల్లల భవిష్యత్తుపై గంపెడాశతో వేలకు వేలు పోసి ప్రైవేటు కాలేజీల్లో చేర్పిస్తున్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగలడం పాషాణ హృదయాలను సైతం కలచివేస్తుంది. కాగా కార్పొరేట్‌ విద్యా సంస్థలు తమ పేరు ప్రతిష్టల కోసం అభం శుభం ఎరుగని పిల్లలను బలికోరుతున్నా ప్రభుత్వం చోద్యం చూడటం బాధ్యతారాహిత్యం. కడపలో...

భూ సేకరణ దేనికి? రాజధానికా, విదేశీ కంపెనీలకా?

అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కొత్త రాజధాని అంశం రాష్ట్రంలో చర్చనీ యాం శంగా ఉంది. మంచి రాజధాని కావాలనే ప్రజల ఆకాంక్షను పాలక తెలుగుదేశం ప్రభుత్వం తన ప్రయోజనాల కోసం వాడు కుంటోంది. భూములు తీసుకో కపోతే రాజధాని నిర్మాణం ఆగిపోతుందని ముఖ్యమంత్రి, మంత్రులు బుకాయిస్తున్నారు. అది నిజమా, కాదా? వాస్తవం ఏమిటి? రాజధాని నిర్మాణానికి 98 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, మిగిలిన రెండు శాతం మంది భూములివ్వడం లేదని, అందుకే 3,800 ఎకరాల భూమిని బలవంతంగా సేకరిస్తామని చెబుతు న్నారు. దీనికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం(20వ తేదీన) జీవో 304ను విడుదల చేసింది. దీని ఆధారంగా గ్రామాల్లో నియమించిన భూ సేకరణ అధికారులు 26 రెవెన్యూ గ్రామాల...

Pages