October

చంద్రబాబుకు ఆ హక్కు లేదు..

బ్రిటిష్‌ ప్రభుత్వం పాలిస్తున్నప్పుడే 1926లో మనదేశ కార్మికవర్గం పోరాడి, కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కును సాధించింది. కార్మిక సంఘాలనేవి ఏ దేశంలోనైనా ఉంటాయన్న స్పృహతో బ్రిటిష్‌ ప్రభుత్వం వ్యవహరించింది. అయితే కార్మిక సంఘాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం మాత్రం దారుణంగా వ్యవహరిస్తోంది.కార్మిక సంఘాలు, వామపక్ష ఉద్యమాలు, ప్రజల ఆకాంక్షలపై చంద్రబాబు ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో ఫార్మా కంపెనీల యజమానులతో జరిగిన సమావేశంలో సంఘాలపైనా, ఉద్యమాలపైనా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 'పాలనంటే బడాబాబులకు సాగిలపడడమా? ప్రజలను, కార్మికులను పట్టించుకోరా?

గురజాడ పఠనమందిరం ప్రారంభం

సమాజంలో ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, అందుకు గ్రంథాలయోద్యమం మళ్లీ రావాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రావి శారద పిలుపునిచ్చారు. విజయవాడ ఆకుల వారి వీధిలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మహాకవి గురజాడ పఠన మందిరాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ ఎంతటి సమాచారం ఉన్నా అది గ్రంథాలయాల ద్వారానే ప్రజలకు అందుబాటులోకి వస్తుం దన్నారు. మహాత్మాగాంధీ నుంచి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ వరకు గొప్ప నాయకులంతా గ్రంథాలయాల్లోనే ఎక్కువ సమయం గడిపారన్నారు.

భోగాపురం గ్రామాలలో ఉద్రిక్తత..

విమానాశ్రయ ప్రభావిత గ్రామాల్లో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనమిక్‌ సర్వే (రైట్స్‌) (న్యూఢిల్లీ) బృందం చేపట్టిన సర్వేను బాధితులు అడ్డుకున్నారు. సర్వే రాళ్లను మహిళలు పీకేశారు. గురువారం పలు గ్రామాల్లో సర్వే చేసి బౌండరీలు ఏర్పాటు చేసిన రైట్స్‌ బృందం సభ్యులు శుక్రవారం కొంగవానిపాలెం, దిబ్బలపాలెం ప్రాంతాల్లో పలు చోట్ల రాళ్లు పాతారు. తూడెం గ్రామంలో జిరాయితీ భూముల్లో సర్వే రాళ్లు ఏర్పాటు చేయడంతో రైతులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. అడిగేందుకు వెళ్లిన వారిని పోలీసులు వెళ్లగొట్టారు.

వేతనాలG.Oవిడుదల చేయాలి:గఫూర్

ప్రభుత్వ ఒప్పందం ప్రకారం మున్సిపల్‌ ఉద్యోగులకు అందజేస్తామని హామీ ఇచ్చిన రూ. 11 వేల జీతాలకు జీవోను వెంటనే విడుదల చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.ఎ గఫూర్‌ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన 11 రోజుల సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని ఆయన కోరారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో డిమాండ్ల సాధన కోసం విజయ వాడలో శుక్రవారం సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని ప్రారంభి ంచిన గఫూర్‌ మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ అని పదే పదే చెప్పే చంద్ర బాబు వీధులను, డ్రైనేజీలను శుభ్రపరిచే వారికి పెంచిన వేతనాలు అందించకపో వడం సిగ్గు చేటన్నారు.

స్వచ్ఛ భారత్‌ ఇలాగా!

అయిదేళ్లలో పరిశుభ్ర భారతావని సాధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీక్షబూని ఏడాది గడుస్తున్న సందర్భంగా మళ్లీ చీపురు కట్టలు పట్టుకుని రాజకీయ నాయకులు, సినీ, సామాజిక రంగ ప్రముఖలు టివీల్లో కనిపిస్తున్నారు. ఏడాది క్రితం ఇదే సీజన్‌లో మనకు ఇవే దృశ్యాలు కనిపించాయి. ఈ మధ్య కాలంలో స్వచ్ఛ భారత్‌ గురించి నేతలు చెప్పినదానికీ, కింది స్థాయిలో జరిగినదానికీ ఎక్కడా లంగరు కుదరడంలేదనడానికి దేశంలో 70 శాతం మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంపై పెదవి విరుస్తున్న తీరే నిదర్శనం. గ్రామాల సంగతి అటుంచితే నగరాలు, పట్టణాల్లో సైతం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం ప్రచారార్భాటంగానే తయారైందన్నది సర్వత్రా వినవస్తున్న మాట.

రహస్య ఒప్పందాలు బయటపెట్టాలి..

రాజధాని నిర్మాణ విషయంలో రహస్య ఒప్పందాలవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సిపిఎం సిఆర్‌డిఏ ఏరియా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు విమర్శించారు.  రాజధాని విషయంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలే అనుమానాలకు ఊతమిస్తున్నాయన్నారు. దీనిపై స్పష్టత కరువైందని తెలిపారు. పరోక్ష పద్ధతిలో భూములను విదేశీ కంపెనీలకు కట్ట బెట్టాలనే కుట్ర సాగుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. పారదర్శకంగా వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు.

స్పష్టతలేని భూ కేటాయింపులు

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన పలు హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. తుళ్లూరును రాజధాని ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం పలు హామీలిచ్చింది. అయితే అమలులో మాత్రం చతికిలపడింది. భూములిచ్చిన రైతులకు పరిహారం ప్యాకేజి కింద అభివృద్ధి చేసిన భూములను ఎక్కడ కేటాయిస్తారనేది ఇప్పటికీ స్పష్టతివ్వలేదు. భూమిలేని నిరుపేదలకు పింఛను ఇస్తామన్నారు. 23,500 మంది నిరుపేదలున్నట్లు పంపిన ప్రతిపాదనలను ఆమోదించిన ప్రభుత్వం తరువాత వివిధ రూపాల్లో వడపోత చేపట్టి గురువారం వరకూ 13,019 మందికి ఫించన్లు అందించింది.

Pages

Subscribe to RSS - October