October

IMF పెదవి విరుపు..

భారత్ ఆర్థిక వృద్ధిరేటు ఆసక్తికరంగానే ఉన్నా.. సంస్కరణల అమలుపై ఐఎంఎఫ్ మరోసారి పెదవి విరిచింది. కీలక రంగాల్లో ఆశించిన స్థాయిలో సంస్కరణలు అమలు జరగటం లేదని పేర్కొంది. ఈ ఏడాది వృద్ధిరేటును కూడా గత అంచనా కంటే స్వల్పంగా తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటుపై ఐఎంఎఫ్ తాజా నివేదిక విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా కనిపిస్తున్నా.. సంస్కరణలు అమలు ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంది. ముఖ్యంగా నిర్మాణ రంగాల్లో కీలకమైన ఎనర్జీ, మైనింగ్, విద్యుత్ రంగాల్లో రీఫామ్స్ సరిగా జరగడం లేదని పెదవి విరిచింది.

ప్రజా చైతన్యయాత్రలో ఉద్రిక్తత

 'రాజధాని ప్రజా చైతన్య యాత్ర'ను పోలీసులు అడ్డుకున్నారు.పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై రాజధాని ప్రాంత సీపీఎం కమిటీ కన్వీనర్ సీ.హెచ్.బాబురావు తీవ్రంగా తప్పుబట్టారు. తాము ఎం తప్పు చేశామని పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తాము డిమాండ్ చేయడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా తాము పాదయాత్ర చేపట్టినట్లు ఇక్కడ ఉన్న కౌలు రౌతుల పరిస్తితి ఏంటీ ? రూ.2500 పెన్షన్ ఎలా సరిపోతుంది అని ప్రశ్నించారు.

రాజధాని రైతుల సమస్యలపై పోరు

సిపిఎం చేపట్టిన 'రాజధాని ప్రజా చైతన్య యాత్ర'కు  పోలీసులు అడ్డు తగిలారు. తుళ్లూరు ప్రాంతంలో చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదంటూ సీపీఎం నేతలను అరెస్టు చేశారు.ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు..పేదలకు ఎలాంటి పాట్లు పడుతున్నారో కళ్లకు కట్టినట్లుగా కళారూపాలు ప్రదర్శించారు. పాదయాత్రలో పేదలు..ఇతరులు..వామపక్ష నేతలు భారీగా హాజరయ్యారు. కొద్దిసేపు ముందుకు సాగిన అనంతరం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా చేస్తున్న యాత్రకు ఎందుకు అడ్డుతగులుతున్నారని వామపక్ష నేతలు ప్రశ్నించారు. పోలీసులను దాటుకుని నేతలు ముందుకెళ్లారు.

అరాచకత్వానికి నిదర్శనం

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కమిషనర్‌ సుశాంత్‌ రంజన్‌ ఉపాధ్యారు రాజీనామాతో ఆ రాష్ట్రంలో అరాచకత్వం ఏ స్థాయికి చేరిందో తేటతెల్లమైంది. మున్సిపల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు ఆ రాష్ట్రంలో భయోత్పాతం సృష్టించిన తీరు ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ. అధికారం అండతో గూండాలు చెలరేగి పోవడంతో హింస రాజ్యమేలింది. తెగించి పోలింగ్‌ బూత్‌లకు వచ్చిన సాధారణ ప్రజానీకంపై అమానుష దారుణకాండ చోటు చేసుకుంది. పోలింగ్‌ ప్రక్రియ ఇంతగా అపహాస్యం అయ్యింది కాబట్టే వామపక్ష సంఘటన మూడుచోట్ల రీపోల్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేయాల్సి వచ్చింది.

దాద్రి దారుణం..

 మోడీ ప్రభుత్వ అండ చూసుకుని దేశంలో హిందూత్వ శక్తులు పేట్రేగిపోతున్నాయి. ఢిల్లీకి యాబై కిలోమీటర్ల దూరంలోని దాద్రిలో సాగిన దారుణం కాషాయ మూకల రాక్షసత్వానికి మరో నిదర్శనం. గోవధ జరిగిందన్న తప్పుడు ప్రచారానికి హిందూ ఆలయాన్ని వేదికగా చేసుకోవడం మరీ దుర్మార్గం. గొడ్డు మాంసం తింటున్నాడన్న తప్పుడు ఆరోపణలతో యాభై ఏళ్ల మహ్మద్‌ ఇఖ్లాక్‌ అనే అమాయక ముస్లింను మతోన్మాద శక్తులు పొట్టనపెట్టుకోవడం హేయాతిహేయం. దీనికి కొద్ది రోజుల ముందు కాన్పూర్‌లో ఒక ముస్లింను పాకిస్తానీ ఉగ్రవాది అన్న ముద్ర వేసి ఇలాగే ప్రాణాలు తీశాయి. ముజఫర్‌గర్‌లో ఏ శక్తులైతే ఘర్షణలకు తెగబడ్డాయో అవే శక్తులు దాద్రి ఘటన వెనక వుండడం గమనార్హం.

బెంగాల్లో లెఫ్ట్‌ హవా..

కొల్‌కతా: పురపాలక సంఘ ఎన్నికల్లో పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ కుట్రలు, దౌర్జన్యాలను ఎదిరించి బెంగా ల్‌లోని సిలిగురిలో వామపక్షాలు విజ యభేరీ మోగించాయి. ప్రజలు స్వచ్ఛం దంగా ఓటు వేసిన చోట తృణమూల్‌ పునాదులు కదిలిపోతాయని సిలిగురిలో మరోసారి రుజువైంది. సిలిగురి ఎన్నిక ల్లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ విజయాన్ని అడ్డుకోవ డానికి అధికార తృణమూల్‌తో పాటు అన్ని రాజకీయ పక్షాలు ఎన్ని కుయుక్తు లు, కుతంత్రాలు పన్నినా వాటి తరం కాలేదు. సిలిగిరి ముహాకామా పరిషత్‌ లో 9 స్థానాలకు 6 స్థానాలు అంటే 70 శాతం సీట్లు గెలుచుకుని లెఫ్ట్‌ ఫ్రంట్‌ తిరుగులేని విజయం సాధించి ంది.

ఖాకీ కంచెలు

సోలార్‌ పార్కు భూ నిర్వాసితుల సమస్యలను తెలుసుకునేందుకు బుధ వారం అనంతపురం జిల్లా నంబూల పూలకుంట (ఎన్‌పి కుంట) మండలానికి వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ను పోలీసులు అడుగడుగునా అడ్డుకు న్నారు. భూముల వద్దకెళ్లి నిర్వాసిత రైతుల సమస్యలను తెలుసుకోకుండా సిపిఎం నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌లో పెట్టారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నడుమ మధు పర్యటన సాగింది. ఎన్‌పి కుంట మండలంలో 10,700 ఎకరాల్లో సోలార్క్‌ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా మొదటి విడతలో 7,500 ఎకరాల భూములను సేకర ణకు పూనుకున్నారు. ఈ భూములకు సంబంధించి కొందరు బినామీ వ్యక్తులకు పరిహారం

CRDA కార్యాలయం ముట్టడి..

రాజధానిలో పింఛన్ల జాబితాలో అవకతవకలున్నాయనే ఆగ్రహంతో పేదలు తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో మంగళవారం ధర్నాలు నిర్వహించారు. తాడేపల్లి మండలం పెనుమాక పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం బైఠాయించారు. పచ్చచొక్కలోళ్ళకే పింఛన్లు దక్కుతున్నాయని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి, జె.నవీన్‌ప్రకాష్‌ అక్కడికి చేరుకున్నారు. అవకతవకలను సరిచేయాలని సర్పంచ్‌ కళ్ళం పానకాలరెడ్డిని కోరారు. అనంతరం ఎస్‌ఐ వినోద్‌కుమార్‌, కార్యదర్శి పద్మావతి ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీనిచ్చారు.

Pages

Subscribe to RSS - October