SFI విద్యా పరిరక్షణ యాత్ర..

 ఏజెన్సీలో గిరిజన విద్యను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎంపీ, ఎపి గిరి జన సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ మిడియం బాబూరావు విమర్శించారు. గిరిజన విద్యను పరిరక్షించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థులు చేపట్టిన జీపుయాత్రను బాబూరావు మారేడుమిల్లిలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. దీంతో వారు రక్తహీనతతో చనిపోతున్నారని చెప్పారు. సౌకర్యాలు కల్పించ డంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శిం చారు. గురుకుల పాఠశాలల్లో సమస్యలు తిష్టవేశాయన్నారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.